/rtv/media/media_files/2025/06/07/DY4wWvz5PZXmYSdZdlVO.jpg)
Banakacherla Project
బనకచర్ల ప్రాజెక్టు వివాదం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమవుతోంది. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు తెలంగాణ అడ్డుచెబుతోంది. ఇంతకీ అసలు ఈ ప్రాజెక్టు వివాదం ఏంటి ?, తెలంగాణ ఎందుకు అడ్డుకుంటుందో ఈ విషయాలన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే.. బనకచర్ల ప్రాజెక్టు అనేది ఏపీలో చేపడుతున్న ఓ ప్రధాన జలవనరుల పథకం. గోదావరి నది నీటిని కృష్ణా నదికి అనుసంధానం చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.
Also Read: ఛత్తీస్గఢ్లో ఎన్ కౌంటర్, మరో ఇద్దరు మావోయిస్టులు మృతి
పోలవరం జలాశయం నుంచి బనకచర్ల రెగ్యులేటర్ దాకా 200 Tmcft నీటిని తరలించేందుకు రూ.81 వేల కోట్ల అంచనా వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ స్కీమ్ అనేది రాయలసీమ, కడప, కర్నూలు, చిత్తూర, అనంతపురం జిల్లాలకు నీటిపారుదల, తాగునీరు అందిస్తూ ఆ ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడుతుంది. బొల్లపల్లి జలాశయం, శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ల ద్వారా గోదావరి నీటిని బనకచర్లకు తరలించేలా ప్రణాళిక వేశారు. ఈ ప్రాజెక్టు నుంచి వరద నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని.. సముద్రంలో వృథాగా పోయే నీటిని ఆదా చేయవచ్చని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల రాయలసీమలో వ్యవసాయం, ఉద్యానవన రంగాలు అభివృద్ధి చెందుతాయని ఆయన భావిస్తున్నారు. ఆర్థిక వృద్ధికి ఇది దోహదపడుతుందని అంటున్నారు.
తెలంగాణ ఎందుకు అడ్డుకుంటోంది ?
బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం చెబుతోంది. ఈ ప్రాజెత్టు గోదావరి నీటి వివాదాల ట్రైబ్యునల్ (GWDT) అవార్టు 1980, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను ఉల్లంఘిస్తోందని ఆరోపణలు చేస్తోంది. ఈ స్కీమ్ కోసం సెంట్రల్ వాటర్ కమిషన్, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు నుంచి పర్మిషన్లు లేకుండానే ఏపీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని అభ్యంతరం చెబుతోంది. మరోవైపు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలిపారు.
ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణలో కృష్ణా బేసిన్లో ఉండే రైతులకు శాశ్వత నష్టం జరిగే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కృష్ణా నీటిలో తెలంగాణ వాటాను 299 టీఎంసీలుగా నిర్ణయించి.. ఏపీకి 512 టీఎంసీ ఇచ్చిందంటూ కూడా విమర్శించారు. ఇదిలాఉండగా ఏపీ సర్కార్.. ఈ ప్రాజెక్టు కోసం 'జల హారతి కార్పొరేషన్' అనే స్పెషల్ పర్పస్ సంస్థను ఏర్పాటు చేసింది.
Also Read: కరువు మొదలైంది..సింధు జలాల కోసం భారత్ కు పాక్ నాలుగు లెటర్స్
ఈ సంస్థ ద్వారా నిధుల సమీకరణ, ప్రాజెక్టు అమలును వేగవంతం చేయాలని భావిస్తోంది. అలాగే ఈ ప్రాజెక్టుని 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖతో ఇటీవల ఈ బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్పై సమీక్ష జరిగింది. కేంద్రంలో, ఏపీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది. అందుకే ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.