Amit shah: మమతా పాలనలో దారుణాలు.. బెంగాల్‌లో అధికారం మాదే: అమిత్ షా

సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో పశ్చిమ బెంగాల్‌లో చొరబాట్లు, మహిళలపై నేరాలు, బాంబు పేలుళ్లు, హిందువులపై దాడులు పెరిగాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. 2026 బెంగాల్ ఎన్నికల్లో బీజేపీదే అధికారం అన్నారు.

NIA: దేశంలో పాక్‌ గూఢచర్యం.. NIA తనిఖీలు

NIA ఆదివారం దేశవ్యాప్తంగా 15 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఈ తనిఖీలు నిర్వహించింది. పాక్‌ నిఘా సంస్థ ISIతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న వ్యక్తుల ఇళ్లు, కార్యాలయాలు ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయి.

Sukhoi fighter jet: జగన్నాథుడి రథచక్రాలుగా సుఖోయ్‌ ఫైటర్‌ జెట్‌ టైర్లు (VIDEO)

కోల్‌కతాలోని జగన్నాథ స్వామి ఊరేగింపు రథానికి సుఖోయ్ 30 ఫైటర్ జెట్ టైర్లు వాడుతున్నారు. నిర్వాహక సంస్థ ఇస్కాన్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. సుఖోయ్ ఫైటర్ జెట్‌కు వాడే 4 టైర్లను తయారీ కంపెనీ డెలివరీ చేసింది.

భారత్ బహిష్కరించిన వ్యక్తితో సన్నీ మీటింగ్.. పాక్ పర్యటనపై భయపెట్టే నిజాలు!

యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌ పాకిస్తాన్ టూర్‌లో భారత్ బహిష్కరించిన జకీర్ నాయక్‌ను కలిశాడు. జకీర్ నాయక్‌ సమావేశంలో సన్నీ ఓ ప్రశ్న అడిగాడు. దానికి జకీర్ ఇచ్చిన సమాధానం వీడియో వైరల్ అయ్యింది. 7 నెలల క్రితం ఇది జరిగింది. దీంతో NIA సన్నీని విచారిస్తోంది.

Jyothi Malhotra: జ్యోతి మల్హోత్రా కేరళ టూర్‌కు సీఎం అల్లుడే స్పాన్సర్.. బీజేపీ సంచలన ఆరోపణలు

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు అక్కడి పర్యాటక శాఖ మంత్రి మహమ్మద్ రియాస్ నేతృత్వంలో టూరిజం డిపార్ట్‌మెంట్ స్పాన్సర్ చేసిందని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ ఆరోపించారు.రియాస్‌ కేరళ సీఎం పినరయి విజయన్ మేనల్లుడే కావడంతో ఈ వ్యవహారం దుమారం రేపుతోంది.

Corona Cases 2025: వణుకు పుట్టిస్తున్న కరోనా.. తొమ్మిది మంది మృతి - అధికంగా ఆ రాష్ట్రంలో కేసులు!

ఇండియాలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. దేశవ్యాప్తంగా 48గంటల్లో కరోనాతో తొమ్మిది మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఎక్కువగా కేరళలో 1400 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో467, ఢిల్లీలో 375, గుజరాత్‌‌లో 265, కర్ణాటకలో 234 కేసులు ఉన్నాయి. 

Web Stories
web-story-logo banana 30 days వెబ్ స్టోరీస్

రోజుకో అరటిపండు తింటే ఏమౌతుంది

web-story-logo Eggs and health వెబ్ స్టోరీస్

గుడ్లు వల్ల దుష్ప్రభావాలు ఉన్నాయా..?

web-story-logo Sprouts వెబ్ స్టోరీస్

మొలకలతో ఎన్నో చర్మ సౌందర్య లాభాలు

web-story-logo jelebi వెబ్ స్టోరీస్

జిలేబితో ఆరోగ్యం ప్రయోజనాలు తెలుసా..?

web-story-logo Lemon Oil వెబ్ స్టోరీస్

నిమ్మ నూనె పనులను ఈజీగా చేస్తుందా..?

web-story-logo bird nest వెబ్ స్టోరీస్

మనిషి జీవితానికి ప్రకృతి సంకేతాలు

web-story-logo dates Benefits వెబ్ స్టోరీస్

ఖర్జూరాలు తింటే ఇన్ని లాభాలా..?

web-story-logo Tender Tamarind Leaves వెబ్ స్టోరీస్

ఈ ఆకుల కషాయంతో ఆనారోగ్య సమస్యలకు ఉపశమనం

web-story-logo Peacock Feather వెబ్ స్టోరీస్

ఇంట్లో చిన్న నెమలి ఈకతో సంపద అధికం

web-story-logo Guava leaves వెబ్ స్టోరీస్

ఈ ఆకులతో స్పీడ్‌గా బరువు తగ్గుతారు..?

Advertisment

Bangladesh: బంగ్లాదేశ్‌ కొత్త కరెన్సీ నోట్లపై హిందూ, బౌద్ధ ఆలయాలు

బంగ్లాదేశ్‌లో యూనస్ ప్రభుత్వం.. మాజీ ప్రధానమంత్రి షేక్ ముజిబుర్‌ రెహమాన్ చిత్రం ఉన్న కరెన్సీ నోట్లను మార్చింది. ఆయన స్థానంలో హిందూ, బౌద్ధ ఆలయాల చిత్రాలతో ఉన్న కొత్త నోట్లను విడుదల చేసింది.

Paris Riots: పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. 192మందికి పైగా

ఫ్రాన్స్‌లో ఛాంపియన్స్‌ లీగ్‌ పోటీల్లో పారిస్ సెయింట్-జర్మైన్ ఫుట్‌బాల్‌ క్లబ్‌ జట్టు గెలచింది. దీంతో పారిస్‌ వీధుల్లో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఓడిపోయిన జట్టుతో అభిమానుల మధ్య ఘర్షణలు చెలరేగడంతో ఇద్దరు మృతి చెందారు. 197 మంది గాయపడ్డారు.

BIG BREAKING: రష్యాకు బిగ్ షాక్.. 40 విమానాలను నాశనం చేసిన ఉక్రెయిన్

ఉక్రెయిన్ ఆదివారం రష్యాలోని పలు నగరాలపై బాంబులతో విరుచుకుపడింది. ఆ దేశంలోని కీలక వైమానిక స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఒలెన్యా, బెలయా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్‌ దాడులు చేయడం ప్రారంభించింది. ఈ దాడిలో 40కి పైగా రష్యన్ విమానాలు ధ్వంసమైయ్యాయి.

గర్ల్‌ఫ్రెండ్‌కు రూ.30 కోట్లు లాటరీ డబ్బు ఇస్తే.. మంచంలో మరో యువకుడితో..!

కెనడాలో లారెన్స్ కాంప్‌బెల్ అనే వ్యక్తికి రూ.30 కోట్లు విలువ చేసే లాటరీ వచ్చింది. ఆ డబ్బులు అతని గర్ల్‌ఫ్రెండ్ క్రిస్టల్ ఆన్ మెక్కే కు ఇచ్చాడు. అవి తీసుకోని ఆమె మరో వ్యక్తితో పారిపోయింది. దీంతో లారెన్స్ కాంప్‌బెల్ కోర్టును ఆశ్రయించాడు.

Shehbaz Sharif: ఇక బొచ్చె పట్టుకుని అడుక్కోవద్దు.. పాక్ దుస్థితిపై ప్రధాని షాబాజ్ ఆవేదన!

పాక్ ప్రధాని షెహబాద్ షరీఫ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఇకపై భిక్షాటన చేస్తుందని ప్రపంచ దేశాలు ఆశించడం లేదన్నారు. తాము ఇప్పుడు వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.

Sheikh Hasina: షేక్ హసీనాకు బిగ్‌ షాక్.. మరో కేసు నమోదు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగ్ షాక్ తగిలింది. ఆమెపై అక్కిడి ప్రాసిక్యూటర్లు మరో కేసు నమోదు చేశారు. ఉద్యమాన్ని అణిచివేసేలా చర్యలు తీసుకోవాలని హసీనానే ఆదేశించినట్లు విచారణలో గుర్తించినట్లు పేర్కొన్నారు.

China warns US: నిప్పుతో ఆడుకోవద్దు.. అమెరికాకు చైనా వార్నింగ్

నిప్పుతో ఆడుకోవద్దంటూ అమెరికాకు చైనా వార్నింగ్ ఇచ్చింది. ఇండో పసిఫిక్‌లో చైనా దూకుడు ప్రదర్శిస్తే.. అమెరికా అడ్డుకుంటుందని ఆ దేశ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌ అన్నారు. హెగ్సెత్‌ వ్యాఖ్యలపై చైనా మండిపడింది. చైనాని అడ్డుకునేందుకు తైవాన్‌ అంశం తేవడం సరికాదంది.

Advertisment

Flash news: జూన్ 5న తెలంగాణ కేబినెట్ సమావేశం

తెలంగాణ ప్రభుత్వం ఈనెల 5న మంత్రివర్గ సమావేశం నిర్వహించనుంది. ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఆదివారం మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. అవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం అంశాలపై మంత్రులు ఇచ్చిన నివేదికపై చర్చించారు.

Telangana: పోలీసు సేవా పతకాలు ప్రకటించిన తెలంగాణ సర్కార్

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సర్కార్‌ పోలీసు సేవా పతకాలను ప్రకటించింది. 16 మందికి మహోన్నత సేవా పతకం, 92 మందికి ఉత్తమ సేవా పతకం, 47 మందికి కఠిన సేవా పతకం అలాగే 461 మంది సేవా పతకం అందుకోనున్నారు.

Telangana cabinet: రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోకి MLCలు విజయశాంతి, అద్దంకి..?

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌ను ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, విజయశాంతిలు ఆదివారం కలిశారు. బీసీ కోటాలో విజయశాంతి మంత్రి పదవి ఇవ్వాలని అడిగినట్లు సమాచారం. కేబినెట్‌లో తనకు చోటు కల్పించాలని అద్దంకి దయాకర్ కూడా కోరినట్లు తెలుస్తోంది.

Telangana: రేపటి నుంచే రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్‌.. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే!

తెలంగాణలో సోమవారం (జూన్ 2) నుంచి అన్ని స‌బ్‌ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్‌ ప్రారంభం కానుంది. 82476 23578 వాట్సాప్ నెంబర్‌తో వాట్సప్ చాట్‌బాట్ మేధా సేవలు అందించనుంది. ఆస్తుల క్రయవిక్రయాల్లో అవినీతిని నివారించేందుకు దీన్ని తీసుకొచ్చారు.

BIG BREAKING: కవిత తగ్గేదేలే.. మరో కమిటీ ప్రకటన.. ఆ నేతకు ఛాన్స్!

తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థగా యునైటెడ్‌ ఫూలే ఫ్రంట్‌‌ పని చేస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆదివారం యూపీఎఫ్‌ నాయకులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యూపీఎఫ్‌ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.

Occult Worship: మహబూబ్‌నగర్‌లో క్షుద్ర పూజల కలకలం.. మూఢనమ్మకాల మాయలో మరుగున పడిన మానవత్వం

మహబూబ్‌నగర్ జిల్లా అప్పన్నపల్లిలో రహస్యంగా నిర్వహించిన క్షుద్ర పూజలు కలకలం రేపింది. పవన్ కుమార్ అనే వ్యక్తి కుమారుడు గణేష్ ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అతను ఆరోగ్యం మెరుగవుతుందని పెంటోజితోపాటు మరో వ్యక్తి సహాయంతో ఈ పూజలను నిర్వహించాడు.

Covid Effect: కరోనా ఎఫెక్ట్.. చికెన్ కి భారీ డిమాండ్!

తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో చికెన్ డిమాండ్ పెరిగింది. చికెన్ ధరలు ఒక్కసారిగా రూ. 30 వరకు పెరిగాయి. ప్రజలు రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనే ఉద్దేశంతో ప్రోటీన్ ఫుడ్‌ అయిన చికెన్, గుడ్ల వైపు మొగ్గుచూపుతున్నారు.

Advertisment

Nellore: అమ్మవారికి దిష్టి తీసిన పూజారి అక్కడికక్కడే మృతి (VIDEO)

ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కావమ్మ తల్లి ఉత్సవాల్లో అపశృతి చేటుచేసుకుంది. తిరునాళ్లు 2వరోజు శనివారం రాత్రి అమ్మవారిని పురవీధుల్లో ఉరేగిస్తున్నారు. ఉత్సవ నిర్వాహకుడు కావమ్మ తల్లికి దిష్టి తీస్తూ తాండవం చేశాడు. తర్వాత అక్కడికక్కడే మృతి చెందాడు.

AP Crime: ఏపీలో దారుణం.. పంపు బాయ్ ఫకృద్దీన్‌ను స్తంభానికి కట్టేసి కొట్టిన మేనేజర్లు

శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కుమ్మరవాండ్లపల్లిలో ఉన్న పెట్రోలు బంకులో పని చేస్తున్న పంపు బాయ్ బాబా ఫకృద్దీన్‌ రూ.23 వేలు తీసుకున్నాడని మేనేజర్లు అతని దుస్తులు ఊడదీసి టెలిఫోన్‌ స్తంభానికి కట్టేసి శారీరకంగా దాడి చేశారు.

Covid Effect: కరోనా ఎఫెక్ట్.. చికెన్ కి భారీ డిమాండ్!

తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో చికెన్ డిమాండ్ పెరిగింది. చికెన్ ధరలు ఒక్కసారిగా రూ. 30 వరకు పెరిగాయి. ప్రజలు రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనే ఉద్దేశంతో ప్రోటీన్ ఫుడ్‌ అయిన చికెన్, గుడ్ల వైపు మొగ్గుచూపుతున్నారు.

AP Crime: ఏపీలో విషాదం.. అనుమానంతో భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త

కడప జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చెన్నూరుకు చెందిన నిత్యానంద్ అనే వ్యక్తి తన భార్య లక్ష్మీ కుమారిని అనుమానంతో ఉరేసి చంపాడు. అనంతరం తానే ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ కృష్ణారెడ్డి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

AP 10th RESULTS MISTAKES : ఏపీ పదవ తరగతి ఫలితాల్లో భారీ అక్రమాలు

ఏపీ పదవతరగతి ఫలితాల్లో భారీ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. రోజు రోజుకు అవకతవకలు బయటపడుతున్నాయి.రివాల్యుయేషన్‌లోనూ తప్పులు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఓఎంఆర్ షీట్‌లో, విద్యాశాఖ ప్రకటించిన మార్కుల్లో భారీ తేడా ఉన్నట్లు గుర్తించారు.

AP Crime: తిరుపతిలో విషాదం.. విహారయాత్రలో విద్యార్థి మృతి.. అసలేమైందంటే?

తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీలో విషాదం చోటు చేసుకుంది. విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో హైవోల్టేజ్ రైల్వే తీగలు తగిలి విద్యుత్ ఘాతుకానికి విద్యార్థి గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డైరీ టెక్నాలజీ చదువుతున్న జాకేష్‌ మృతి.

Tirumala Tirupati Devasthanams : తిరుమలలో మరో అపచారం.. ఆలయంపైన ఎగిరిన విమానం

తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారం జరిగింది.  తిరుమల శ్రీవారి ఆలయం పై నుంచి మరోసారి విమానం  వెళ్లడంతో కలకలం రేగింది. ఆదివారం ఉదయం స్వామివారి ఆలయ గోపురం పైనుంచి అతి తక్కువ ఎత్తులో విమానం ఎగురుతూ వెళ్లడాన్ని భక్తులు గమనించారు.

Advertisment

Stock Market:  నిన్న చివర్లో తేరుకున్న సూచీలు ఇవాళ మళ్ళీ నష్టాల్లోకి..

అంతర్జాతీయంగా, దేశీయంగా కూడా ట్రేడ్ మార్కెట్లు నష్టాల్లో నడుస్తున్నాయి. ఈరోజు ఉదయం నుంచే భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో పరుగులు పెడుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్లు తగ్గి 81,500 స్థాయిలో..నిఫ్టీ కూడా 30 పాయింట్లు తగ్గి 24,800 స్థాయిలో ఉంది.

US President Trump: భారతీయులపై పగబట్టిన ట్రంప్.. 6 షాకింగ్ నిర్ణయాలు!

ట్రంప్ షాకింగ్ నిర్ణయాలతో ఇండియా ఆర్థిక వ్యవస్థ, అక్కడ చదువుకుంటున్న ఇండియన్స్‌కు కష్టాలు వచ్చాయి. అయితే కఠిన నిబంధనలు లేదంటే సుంకాలుతో ఇండియాని అమెరికా ఎదగనివ్వడం లేదు. అందుకు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ 6 నిర్ణయాలే సాక్ష్యాలు.

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment