/rtv/media/media_files/2025/06/01/GZHFeuYJ52zcJNv1ZuNP.jpg)
Jyothi Malhotra
భారత్కు చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్కు అందిస్తున్నారనే ఆరోపణలతో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె కేరళ పర్యటనకు సంబంధించి ఆ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కే. సురేంద్రన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జ్యోతి పర్యటనకు పర్యాటక శాఖ మంత్రి పీఏ.మహమ్మద్ రియాస్ నేతృత్వంలో టూరిజం డిపార్ట్మెంట్ స్పాన్సర్ చేసిందని ఆరోపించారు. రియాస్ కేరళ సీఎం పినరయి విజయన్ మేనల్లుడే.
Also Read: బిగ్ బ్రేకింగ్.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ప్రాంతాల వారీగా లిస్ట్ ఇదే
పాక్ గూఢచారి జ్యోతి మల్హోత్రా కన్నూర్ ట్రిప్ కోసం రియాస్ నేతృత్వంలో పర్యాటక శాఖ స్పాన్సర్ చేసింది. ఆమె అక్కడ ఎవరిని కలిసింది ? ఎక్కడికి వెళ్లింది ? ఆమె అంజెండా ఏంటి ? పాకిస్థాన్తో సంబంధాలు ఉన్న ఆమెకు కేరళలో రెడ్ కార్పెట్ ఎందుకు వేశారని'' సురేంద్రన్ ఎక్స్లో నిలదీశారు. ఇదిలాఉండగా ట్రావెల్ విత్ జో అనే పేరుతో జ్యోతి యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది. 2023లో ఆమె పాక్కు వెళ్లే సమయంలో పాక్ హైకమిషన్ ఉద్యోగి డానిష్తో పరిచయం ఏర్పడింది.
Pak-Spy Jyoti Malhotra’s Kannur trip was sponsored by Kerala Tourism, run by none other than Pinarayi Vijayan’s son-in-law.
— K Surendran (@surendranbjp) May 31, 2025
Who did she meet? Where did she go? What’s the real agenda?
Why is Kerala rolling out red carpets for a Pak-linked spy?@pinarayivijayan is turning…
ఆ తర్వాత ఆమె పాక్ గూఢచర్య సంస్థ ప్రతినిధులతో టచ్లోకి వెళ్లినట్లు... ఆపరేషన్ సిందూర్ జరిగిన సమయంలో కూడా జ్యోతి డానిష్తో మాట్లాడినట్లు తెలిసింది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. అయితే జ్యోతికి ఉగ్రవాదులతో సంబంధం లేదని, ఆమె ఉగ్రకార్యకలాపాల్లో పాలు పంచుకున్నట్లు ఆధారాలు లేవని పోలీసులు గుర్తించారు. కానీ ఆమె తెలిసి కూడా పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో మాత్రం సంప్రదింపులు కొనసాగించినట్లు పేర్కొన్నారు.
Also Read: వణుకు పుట్టిస్తున్న కరోనా.. తొమ్మిది మంది మృతి - అధికంగా ఆ రాష్ట్రంలో కేసులు!
మరోవైపు పాక్ నిఘా సంస్థ ఏజెంట్లకు భారతీయ మొబైల్ సిమ్కార్డులు సరఫరా చేస్తున్నాడనే ఆరోపణలతో ఖాసిం అనే వ్యక్తి కూడా ఇటీవల అరెస్ట్ అయ్యాడు. పాక్లో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన అతడి ఇంటర్వ్యూ వీడియో బయటపడింది. ఖాసిం కూడా పాకిస్థాన్లో పర్యటించినట్లు అధికారులు తెలిపారు.
telugu-news | Latest News | JYOTHI MALHOTRA | national-news | pakistan