అగ్రరాజ్యం అమెరికాతో చైనా వివాదం ముదురుతుంది. రెండు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నిప్పుతో ఆడుకోవద్దంటూ తాజాగా అమెరికాకు చైనా వార్నింగ్ ఇచ్చింది. ఇండో పసిఫిక్లో చైనా దూకుడు ప్రదర్శిస్తే.. అమెరికా అడ్డుకుంటుందని ఆ దేశ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ అన్నారు. హెగ్సెత్ వ్యాఖ్యలపై చైనా ఫైర్ అయ్యింది. మమ్మల్ని అడ్డుకునేందుకు తైవాన్ అంశం తెరమీదకు తేవడం సరికాదని చైనా బదులిచ్చింది. తైవాన్ మ్యాటర్ మాకు సంబంధించిన అంశమే అని చైనా స్పష్టం చేసింది. ఇందులో మూడో దేశం జోక్యం అవసరం లేదని హెచ్చరించింది.
china | Taiwan issue | america | china-vs-taiwan | latest-telugu-news