/rtv/media/media_files/2025/06/01/TRUaDz75JJ36CSBgNchX.jpg)
Sheik Hasina
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగ్ షాక్ తగిలింది. ఆమెపై అక్కిడి ప్రాసిక్యూటర్లు మరో కేసు నమోదు చేశారు. సామాన్య పౌరులపై హసీనా క్రూరత్వం చూపించినట్లు ఆరోపించారు. గతేడాది బంగ్లాదేశ్లో జరిగిన విద్యార్థుల ఉద్యమాన్ని ఆమె క్రూరంగా అణిచివేయాలని చూసినట్లు తెలిపారు. భద్రతా దళాలు, అవామీ లీగ్ పార్టీ సభ్యులు ఈ ఉద్యమాన్ని అణిచివేసేలా చర్యలు తీసుకోవాలని హసీనానే ఆదేశించినట్లు విచారణలో గుర్తించామని చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లాం పేర్కొన్నారు.
Also Read: భారత్ బహిష్కరించిన వ్యక్తితో సన్నీ మీటింగ్.. పాక్ పర్యటనపై భయపెట్టే నిజాలు!
దీనికి సంబంధించి ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్లు, వీడియో ఆధారులు ఉన్నాయని.. దీనికి 81 మంది సాక్షులుగా ఉన్నారని తెలిపారు. దేశంలో సంక్షోభ సమయంలో భద్రతా దళాలు తీసుకొన్న చర్యలకు అప్పటి ప్రదాని హసీనాదే బాధ్యత అన్నారు. విద్యార్థుల ఉద్యమంపై ఆమె చేపట్టిన అణిచివేత వల్ల 1500 మంది మరణించారని.. 25 వేల మంది గాయాలపాలయ్యారని వెల్లడించారు.
Also Read: జ్యోతి మల్హోత్రా కేరళ టూర్కు సీఎం అల్లుడే స్పాన్సర్.. బీజేపీ సంచలన ఆరోపణలు
బంగ్లాదేశ్లో రిజర్వేషన్ అంశంపై షేక్ హసీనా ప్రభుత్వంపై తిరుగుబాటు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె దేశం విడిచి పారిపోయారు. దీంతో మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత హసీనాపై యూనస్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే ఆమెపై 100కు పైగా కేసులున్నాయి. ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ కూడా ఆమెపై అరెస్టు వారెంట్ జారీ చేసింది.
Also Read: వణుకు పుట్టిస్తున్న కరోనా.. తొమ్మిది మంది మృతి - అధికంగా ఆ రాష్ట్రంలో కేసులు!
Also Read: పాలు తాగడం వల్ల బరువు పెరుగుతారన్నది అపోహ.. పాల దినోత్సవం సందర్భంగా!!
rtv-news | bangladesh | sheik-hasina