/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ap-teachers-jobs-jpg.webp)
AP 10th RESULTS MISTAKES
AP 10th RESULTS MISTAKES : ఏపీ పదవతరగతి ఫలితాల్లో భారీ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. రోజు రోజుకు అవకతవకలు బయటపడుతున్నాయి.రివాల్యుయేషన్లోనూ తప్పులు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఓఎంఆర్ షీట్లో, విద్యాశాఖ ప్రకటించిన మార్కుల్లో భారీ తేడా ఉన్నట్లు గుర్తించారు. రివాల్యుయేషన్లోనూ తప్పులుండటంపై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంపై పేరెంట్స్ మండిపడుతున్నారు.
Also Read: ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ రిలీజ్.. ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్స్ ఎప్పుడంటే?
కాగా పదవతరగతి ఫలితాల్లో జరిగిన అక్రమాలపై మాజీ సీఎం వైఎస్సార్సీపీ నేత జగన్ స్పందించారు.ప్రభుత్వం, బోర్డు అధికారుల తీరుపై జగన్ ట్వీట్ చేశారు.విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ఫెయిల్ అయ్యారని జగన్ ట్వీట్ చేశారు. దీంతో మంత్రి లోకేష్ జగన్కు కౌంటర్ ట్వీట్ చేశారు.ప్రజా జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ..జగన్ ఫెయిల్ అంటూ రీట్వీట్ చేశారు.
Also Read: గాంధీ, అబ్దుల్ కలాంతో మల్లారెడ్డి భేటి.. సంచలన వీడియో
ప్రధానంగా, కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల ఫలితాలను మెరుగుపరిచేందుకు అక్రమ మార్గాలను అనుసరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా ప్రశ్నాపత్రాల లీకేజీ, మార్కుల మోసాలు వంటివి ఉన్నాయి. కొందరు ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు, తమ విద్యార్థులకు పరీక్షల ముందుగానే ప్రశ్నాపత్రాలను లీక్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.మరికొన్ని పాఠశాలలు విద్యార్థుల మార్కులను తారుమారు చేస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. పది తరగతి ఫలితాల్లో అక్రమాలు జరుగుతున్నాయని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ అక్రమాలపై విచారణ జరపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ రిలీజ్.. ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్స్ ఎప్పుడంటే?