BIG BREAKING: కవిత తగ్గేదేలే.. మరో కమిటీ ప్రకటన.. ఆ నేతకు ఛాన్స్!

తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థగా యునైటెడ్‌ ఫూలే ఫ్రంట్‌‌ పని చేస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆదివారం యూపీఎఫ్‌ నాయకులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యూపీఎఫ్‌ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.

New Update
United Phule Front

తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థగా యునైటెడ్‌ ఫూలే ఫ్రంట్‌‌పని చేస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆదివారం యూపీఎఫ్‌ నాయకులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యూపీఎఫ్‌ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. యూపీఎఫ్‌ కన్వీనర్‌‌గా బొల్లా శివశంకర్‌, కో ఆర్డినేటర్‌‌గా ఆలకుంట హరి, అడ్వైజర్‌గా గట్టు రామచందర్‌ రావు, మరో 50 మందిని కో కన్వీనర్లుగా నియమించారు. 

అనేక పోరాటాలతో సాధించుకున్న బీసీ రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చే వరకు తెలంగాణ జాగృతి, యూపీఎఫ్‌ ఉద్యమాలను కొనసాగుతాయని ఆమె అన్నారు. త్వరలోనే బీసీ బిల్లులు సాకారం అయ్యేందుకు కవిత కార్యచరణ ప్రకటిస్తామన్నారు. బీసీల రిజర్వేషన్లను అమల్లోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా తెలంగాణ జాగృతి, యూపీఎఫ్‌ ఆధ్వర్యంలో ఐక్య ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. పెంచిన రిజర్వేషన్లను అమలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయో ప్రజలకు విడమరిచి చెప్తామన్నారు. బీసీలందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చి రిజర్వేషన్లను సాధించి తీరుతామన్నారు.

brs mlc kavitha | kavitha | Telangana Jagruthi | United Phule Front | telangana | latest-telugu-news | brs

Advertisment
Advertisment
తాజా కథనాలు