Tirumala Tirupati Devasthanams : తిరుమలలో మరో అపచారం.. ఆలయంపైన ఎగిరిన విమానం

తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారం జరిగింది.  తిరుమల శ్రీవారి ఆలయం పై నుంచి మరోసారి విమానం  వెళ్లడంతో కలకలం రేగింది. ఆదివారం ఉదయం స్వామివారి ఆలయ గోపురం పైనుంచి అతి తక్కువ ఎత్తులో విమానం ఎగురుతూ వెళ్లడాన్ని భక్తులు గమనించారు.

New Update
Tirupati temple

Tirupati temple

Tirumala Tirupati Devasthanams : తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారం జరిగింది.  తిరుమల శ్రీవారి ఆలయం పై నుంచి మరోసారి విమానం  వెళ్లడంతో కలకలం రేగింది. ఆదివారం ఉదయం స్వామివారి ఆలయ గోపురం పైనుంచి అతి తక్కువ ఎత్తులో విమానం ఎగురుతూ వెళ్లడాన్ని భక్తులు గమనించారు. దాన్ని వారు తమ మొబైల్స్‌లో రికార్డ్ చేశారు.. కొందరు భక్తులు ఈ విషయాన్ని టీటీడీ విజిలెన్స్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. ఆలయం మీదుగా వెళ్లిన విమానం ఎక్కడి నుంచి వచ్చింది. ఎక్కడికి వెళ్లిందో అనే వివరాలను టీటీడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఆగమశాస్త్రం ప్రకారం తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు, హెలికాప్టర్లు ఎగరడం విరుద్ధం. అందుకే తిరుమలను నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని గత కొంతకాలంగా కేంద్రాన్ని టీటీడీ కోరుతోంది. కేంద్ర పౌరవిమానయాన శాఖ మాత్రం ఈ నిబంధన అమలు చేయడం వీలుకాదని తెలపడంతో ఏం చేయలేని పరిస్థితి నెలకొంది.

Also Read: పాకిస్తాన్ గేమ్ క్లోస్.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిమాండ్ ఏంటంటే?

 ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయం ఆలయంపై ఎటువంటి రాకపోకలు సాగకూడదని చెబుతున్నప్పటికీ తరచూ స్వామి ఆలయంపై నుంచి విమానాలు, హెలీకాఫ్టర్లు వెళుతున్నాయి. ఈ విషయంలో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  తిరుమలను నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలన్న తిరుపతితిరుమల దేవస్థానం చేస్తున్న విజ్ఞప్తిని కేంద్ర విమానాయన శాఖ పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రామ్మోహన్‌ నాయుడు ఉన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ, జనసేన భాగస్వామ్యంగా ఉంది. కనుక ఆయన ఈ విషయంలో కేంద్రాన్ని ఒప్పించి నో ఫ్లైయింగ్‌ జోన్‌గా ప్రకటింప జేసే అవకాశం ఉన్నా ఆ ప్రయత్నం చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీనిపై శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్నారు. 

Also Read: జూన్ 2025లో భారీగా సెలవులు.. ఫుల్ లిస్ట్ ఇదే

గత రెండు, మూడేళ్లుగా శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు, హెలికాప్టర్లు యధేచ్ఛగా  ఎగిరిన సందర్భాలు ఉన్నాయి. గతంలో అలాంటి ఘటనలు జరిగిన సమయంలో భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ స్పందించింది. కొంతకాలంగా తరచూ విమానాలు, హెలికాప్టర్లు స్వామివారి ఆలయం మీదుగా వెళుతుండటం ఆందోళన కలిగిస్తుందని టీటీడీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Also Read: గాంధీ, అబ్దుల్ కలాంతో మల్లారెడ్డి భేటి.. సంచలన వీడియో

Advertisment
Advertisment
తాజా కథనాలు