Maoists: 10న మావోయిస్టుల భారత్‌ బంద్‌.. 11నుంచి స్మారక సభలు

ఆపరేషన్ కగార్‌ పేరుతో  ప్రభుత్వం మావోయిస్టుల పై చేస్తోన్న ఆపరేషన్ కు వ్యతిరేకంగా మావోయిస్ట్ పార్టీ భారత్ బంద్ కు పిలుపు నిచ్చింది. అగ్రనాయకుల ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ జూన్ 10న దేశవ్యాప్త బంద్‌కు మావోయిస్టులు పిలుపు నిచ్చారు.

author-image
By Madhukar Vydhyula
New Update
Maoist

Maoists

ఆపరేషన్ కగార్‌ పేరుతో  ప్రభుత్వం మావోయిస్టుల పై చేస్తోన్న ఆపరేషన్ కు వ్యతిరేకంగా మావోయిస్ట్ పార్టీ భారత్ బంద్ కు పిలుపు నిచ్చింది. అగ్రనాయకుల ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ జూన్ 10న దేశవ్యాప్త బంద్‌కు మావోయిస్టులు పిలుపు నిచ్చారు. కేంద్ర ప్రభుత్వతో పాటు రాష్ట్రాలు శాంతి చర్చలకు స్పందించకుండా హింసను కొనసాగిస్తున్నాయని దీనికి నిరసనగా 10న బంద్‌ కు పిలుపు నిస్తున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

Also Read: cinema: కన్నప్ప హార్డ్ డ్రైవ్ ను మనోజ్ ఇంట్లో పని వాళ్ళే దొంగిలించారు..విష్ణు

Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్

Maoists Bharat Bandh On June 10th

 ఆపరేషన్‌ కగార్‌లో భాగంగా వందలాదిమంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్లు చేస్తూ మానవ హక్కులను హరిస్తుందని అభయ్‌ లేఖలో ఆరోపించారు. దీనికి నిరసనగాజూన్‌ 10న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిస్తున్నామన్నారు. అదే సమయంలో జూన్‌ 11 నుంచి ఆగస్టు 3 వరకూ అమర వీరుల స్మారక సభలు నిర్వహించాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. శాంతి చర్చలకు సిద్ధమని తాము ప్రకటించడంతో పాటు ఆరునెలలు కాల్పుల విరమణకు పిలుపునిస్తే  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెవిన పెట్టి హింసను కొనసాగిస్తున్నాయని ఆరోపించారు. 2026 మార్చి 31నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామంటున్న ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా చర్యలను ఖండించాలని పిలుపునిచ్చారు.

Also Read: కరోనా పేషేంట్ ని చంపేయ్.. ఇద్దరు డాక్టర్లు మాట్లాడుకున్న ఆడియో వైరల్!

 తాము శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించినా.. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్‌ను ఆపడం లేదని విమర్శించారు. ప్రభుత్వంతో చర్చల కోసం గత రెండు నెలలుగా సంయమనం పాటించామన్నారు. కేంద్ర రాష్ట్ర ఫాసిస్ట్ వైఖరికి నిరసనగా జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపునిస్తున్నామని అభయ్‌ తెలిపారు. ఈ క్రమంలోనే కీలక నేత నంబాల కేశవరావు, దళ సభ్యులు మృతి చెదారని తెలిపారు. 2024 నుంచి ఇప్పటి వరకు 540 మంది మావోయిస్టులు భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో మృతి చెందారని వెల్లడించారు. వారి మృతికి నివాళిగా బంద్‌కు పిలుపునిస్తున్నట్లు పేర్కొన్నారు. 

Also Read :  రాష్ట్రంలో వాటిని అణిచివేయడానికి స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు

 

36 Maoists Killed | operation kagar | india maoism | stop opretation kagar | kagar | what is operation kagar | chhattisgarh maoist | chhasttisgarh maoist news

Advertisment
Advertisment
తాజా కథనాలు