/rtv/media/media_files/2025/06/01/rWmyoX0bRaxJjuXjaBE2.jpg)
Shehbaz Sharif
పాక్ ప్రధాని షెహబాద్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఇకపై భిక్షాటన చేస్తుందని ప్రపంచం ఆశించడం లేదన్నారు. తాము ఇప్పుడు వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని తెలపారు. మే 31న క్వెట్టాలో సైనిక సిబ్బందిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పాక్ ఆర్థిక స్వాలంబన వైపు పయనించాలని.. దేశ సహజ వనరులను పూర్తిగా ఉపయోగించుకోవాలని అన్నారు.
Also Read: జ్యోతి మల్హోత్రా కేరళ టూర్కు సీఎం అల్లుడే స్పాన్సర్.. బీజేపీ సంచలన ఆరోపణలు
పలు దేశాలతో పాక్కు ఉన్న సాన్నిహిత్యం గురించి కూడా షరీఫ్ మాట్లాడారు. చైనాకు పాక్తో మంచి స్నేహం ఉందని.. అలాగే సౌదీ అరేబియా అత్యంత విశ్వసనీయమైన భాగస్వామి అని అభివర్ణించారు. టర్కీ, ఖతార్, యూఏఈ కూడా తమకు మంచి మిత్ర దేశాలని పేర్కొన్నారు. మరోవైపు, శుక్రవారం తజికిస్తాన్ రాజధాని దుషాన్బేలో ఐక్యరాజ్యసమితి హిమానీనదాలపై జరిగిన మొదటి సమావేశంలో పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ మాట్లాడారు.
Also Read: బిగ్ బ్రేకింగ్.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ప్రాంతాల వారీగా లిస్ట్ ఇదే
సింధు జల ఒప్పందంపై సంతకం చేసినప్పటి నుంచి ప్రాథమిక మార్పులు వచ్చాయని.. దీంతో ఒప్పందంలోని నిబంధనలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మార్పుల్లో సాంకేతిక పురోగతి, జనాభా పెరుగుదల, వాతావరణ మార్పు, కొనసాగుతున్న సరిహద్దు ఉగ్రవాదం వంటి అంశాలున్నాయి. అయితే ఈ ఒప్పందాన్ని నిజాయతీగా అమలు చేయడం తప్పనిసరని పేర్కొన్నారు. ఇదలాఉండగా.. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ సిందూ జలాల ఒప్పందాన్ని నిలివేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పాకిస్థాన్.. భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఖండిస్తూనే ఉంది. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది.
Also Read: వణుకు పుట్టిస్తున్న కరోనా.. తొమ్మిది మంది మృతి - అధికంగా ఆ రాష్ట్రంలో కేసులు!
telugu-news | rtv-news | shehbaz-sharif | pakistan