/rtv/media/media_files/2025/06/01/Gd8jxorYXwlogMXY3Z6a.jpg)
Corona Cases In India
Corona Cases in India: దేశంలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. రోజు రోజుకూ భారీ సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఈ కరోనా మహమ్మారి మళ్ళీ ప్రజలను వణికిస్తుంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో కేసులు పెరిగిపోతున్నాయి. ఢిల్లీ, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కరోనాతో చాలా మంది మృత్యువాత పడ్డారు. గడిచిన 48గంటల్లో దాదాపు తొమ్మిది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.
Also Read : ‘కన్నప్ప’ హార్డ్ డిస్క్పై మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్
Corona Cases
కేరళలో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. అక్కడ సుమారు 1400 కరోనా పాజిటివ్ కేసులు యాక్టివ్గా ఉన్నాయి. అలాగే మహారాష్ట్రలో467 కేసులు, ఢిల్లీలో 375 కేసులు, గుజరాత్లో 265 కేసులు, కర్ణాటకలో 234 కేసులు, పశ్చిమ బెంగాల్లో 205 కేసులు, తమిళనాడులో 185 కేసులు, యూపీలో 117 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Also Read : ఓరి దుర్మార్గుడా.. మేక కోసం వస్తే మానభంగం చేశావ్ కదరా - పోలీస్ స్టేషన్ మెస్లోనే రేప్!
కాగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ క్రమక్రమంగా విస్తరిస్తుంది. తెలంగాణలో ఇప్పటి వరకు ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. అదే సమయంలో ఏపీలో ఒక్కరోజే నలుగురికి వైరస్ సోకింది. దీంతో ఏపీలో మొత్తం పాజిటివ్ కేసులు 23కు చేరింది. కాగా వైరస్ వ్యాప్తిపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Also Read : ఇరాన్ లో ముగ్గురు ఇండియన్స్ కిడ్నాప్..పాకిస్తాన్ నంబర్ నుంచి డబ్బులు?
కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకారం.. మే 30వ తేదీన 1,828 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే ఆ కేసుల సంఖ్య మే31వ తేదీకి 2,710 వరకు చేరింది. అప్పటికి అత్యధికంగా కేరళలో 1,147 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఆ తర్వాత మహారాష్ట్రలో 424 కేసులు, ఢిల్లీలో 494 కేసులు, గుజరాత్లో 223 కేసులు, కర్ణాటక - తమిళనాడులో 148 కేసులు, పశ్చిమ బెంగాల్లో 116 కేసులు నమోదయ్యాయి. అదే రోజుకు గడిచిన 24 గంటల్లో కొవిడ్ బారిన పడి దాదాపు ఏడుగురు మరణించినట్లు సమాచారం. అయితే ఇవాళ్టికి (జూన్1) కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగాయి.
Also Read: ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ రిలీజ్.. ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్స్ ఎప్పుడంటే?