Telangana cabinet: రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోకి MLCలు విజయశాంతి, అద్దంకి..?

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌ను ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, విజయశాంతిలు ఆదివారం కలిశారు. బీసీ కోటాలో విజయశాంతి మంత్రి పదవి ఇవ్వాలని అడిగినట్లు సమాచారం. కేబినెట్‌లో తనకు చోటు కల్పించాలని అద్దంకి దయాకర్ కూడా కోరినట్లు తెలుస్తోంది.

New Update

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలోకి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, విజయశాంతిలు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతోందని వార్తలు వస్తున్నాయి. దీంతో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌ను ఆదివారం వారిరువురూ కలిశారు. బీసీ కోటాలో విజయశాంతి ఆమెకు మంత్రి పదవి ఇవ్వాలని అడిగినట్లు సమాచారం. కేబినెట్‌లో తనకు చోటు కల్పించాలని అద్దంకి దయాకర్ కూడా కోరినట్లు తెలుస్తోంది.

మీనాక్షి నటరాజన్‌తో సమావేశం అయ్యారు కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె సరియైన సమయంలో సరియైన వ్యక్తులకే పదవులు వస్తాయని అన్నారు. ఏ పదవి ఎవరికి ఇవ్వాలో హై కమాండ్‌కి తెలుసని ఎమ్మెల్సీ చెప్పుకొచ్చారు. ఇటీవల ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీల్లో ఆమె పేరు లేదని.. ఇక ముందు ఏర్పాటు చేసే కమిటీలోనైనా ఆమెకు అవకాశం కల్పిస్తారేమోనని ఆశాభావం వ్యక్తం చేశారు విజయశాంతి.

vijaya-shanthi | Addanki Dayakar | addanki dayakar comments | Addanki Dayakar latest | | New Ministers in Telangana Cabinet | telangana cabinet ministers | telangana-cabinet | telangana-cabinet-expansion | latest-telugu-news | meenakshi natarajan

Advertisment
Advertisment
తాజా కథనాలు