Telangana: పోలీసు సేవా పతకాలు ప్రకటించిన తెలంగాణ సర్కార్

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సర్కార్‌ పోలీసు సేవా పతకాలను ప్రకటించింది. 16 మందికి మహోన్నత సేవా పతకం, 92 మందికి ఉత్తమ సేవా పతకం, 47 మందికి కఠిన సేవా పతకం అలాగే 461 మంది సేవా పతకం అందుకోనున్నారు.

New Update
Telangana Police

Telangana Police

జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సర్కార్‌ పోలీసు సేవా పతకాలను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.  పోలీసుశాఖలో పనిచేసే గ్రేహౌండ్స్‌కు చెందిన 9 మందికి శౌర్య పతకం దక్కింది. 16 మందికి మహోన్నత సేవా పతకం, 92 మందికి ఉత్తమ సేవా పతకం, 47 మందికి కఠిన సేవా పతకం అలాగే 461 మంది సేవా పతకం అందుకోనున్నారు. 

Also Read: మమతా పాలనలో దారుణాలు.. బెంగాల్‌లో అధికారం మాదే: అమిత్ షా

ఇక అవినీతి నిరోధక శాఖలో చూసుకుంటే ఒకరికి మహోన్నత సేవా పతకం దక్కింది. నలుగురికి ఉన్నత సేవా.. అలాగే 17 మందికి సేవా పతకాలు దక్కాయి. ఇక విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖలో ఒకరికి ఉత్తమ సేవా.. ఐదుగురికి సేవా పతకాలు వచ్చాయి. డిజాస్టర్ రెస్పాన్స్ అండ్‌ ఫైర్‌ సర్వీస్ శాఖలో ఇద్దరికి శౌర్య పతకం, ఒకరికి మహోన్నత పతకం వచ్చింది. ముగ్గురికి ఉత్తమ సేవా, 14 మందికి సేవా పతకాలు దక్కాయి. ఇక స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో ఒకరికి మహోన్నత సేవా, ముగ్గురికి ఉత్తమ సేవా, 15 మందికి సేవా పతకాలను రేవంత్ సర్కార్ ప్రకటించింది.  

Also Read: రష్యాకు బిగ్ షాక్.. 40 విమానాలను నాశనం చేసిన ఉక్రెయిన్

 rtv-news | telangana-formation-day | police

 

Advertisment
Advertisment
తాజా కథనాలు