Ayodhya: అయోధ్య రామ మందిరం సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలోని అయోధ్యలో ఈ రామమందిరం 2024 జనవరి 22 అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అయితే మొదటి ఆరు నెలల్లో.. 11 కోట్ల మంది యాత్రికులు, పర్యాటకులు అయోధ్యను సందర్శించారు. అయోధ్యతో పాటు ఉత్తరప్రదేశ్లోని వివిధ ప్రాంతాలను మొత్తం 33 కోట్ల మంది పర్యాటకులు సందర్శించినట్లు అధికారులు తెలిపారు. అయోధ్యను సందర్శించిన భక్తుల సంఖ్య ఇందులో ( 33 కోట్లలో 3 వంతుగా నిలిచిందని చెప్పారు. ఇక మందిరంలో రామ్ లల్లా (Ram Lalla) ప్రాణప్రతిష్ట ప్రారంభోత్సం ప్రధాని మోడీ చేతుల మీదుగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆరు వేల మంది ప్రముఖుల రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రాణ ప్రతిష్ట జరిగిన రెండు వారాల తర్వాత రామ భక్తులకు అయోధ్య ప్రధాన ఆలయంలోకి అనుమతించారు. దీంతో నాటి నుంచి నేటి వరకు దీనిని ఈ రోజు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ అధికారికంగా విడుదల చేసింది.
Search Results for: Ayodhya
Balapur Ganesh In Ayodhya Ram Mandir Temple Set | Ganesh Chaturthi 2024 | RTV
Ayodhya: అయోధ్యలో దంచికొట్టిన వానలు.. ఇబ్బందుల్లో భక్తులు
అయోధ్యలో వర్షం బీభత్సం సృష్టించింది. గత రెండు రోజులుగా వానలు దంచికొట్టాయి. దీంతో రోడ్లపై మోకాళ్ల వరకు నీరు నిలిచిపోయింది. అయోధ్య రాముని దర్శనానికి వెళ్లిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. స్వామివారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది. రామమందీర్ సమీపంలోని జల్వాన్పురాలో ఇళ్లలోకి మురుగునీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామమందిరం చుట్టూ హడావిడిగా నిర్మాణ పనులు చేపట్టడంతోనే ఇళ్లలోకి నీళ్లు వచ్చాయని స్థానికులు అంటున్నారు. ఆలయం రూఫ్ నుంచి కూడా నీరు లీకయ్యాయి. అయితే మరో మూడు రోజుల పాటు అయోధ్యకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Also Read: ముగిసిన ఉమ్మడి రాజధాని కాలపరిమితి.. వాటా కావాలంటున్న ఏపీ
Ayodhya: అయోధ్యలో భారీ వర్షాలు.. జలమయమైన రామమందిరం!
Ayodhya rains : అయోధ్యలో శనివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నయి. దీంతో అనేక చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. కొత్తగా నిర్మించిన రామ్ పథ్ రోడ్డు కుంగిపోయింది. అంతేకాదు రామ్ పథ్ కు దారి తీసే 13 రోడ్లు జలమయం అయ్యాయి. అనేక ఇళ్లల్లోకి డ్రైనేజ్ నీరు చేరుకుంది. వెంటనే చర్యలు చేపట్టిన అధికారులు.. డ్రైనేజ్ నీటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అనేక బృందాలను ఇంటింటికీ పంపిస్తున్నామని, ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అయోధ్య మేయర్ గిరీశ్ పాటి త్రిపాఠి తెలిపారు.
ఇదిలాఉంటే.. అయోధ్య రామమందిర నిర్మాణంలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. గర్భగుడి పైకప్పు లీక్ అయినట్లు పూజారులు తెలిపారు. చిన్న వర్షానికే పైనుంచి నీరు కారుతుందని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ చెప్పారు. ఈ మేరకు మందిరాన్ని ప్రారంభించిన తర్వాత మొదటిసారి శనివారం రాత్రి భారీ వర్షం పడటంతో లీకేజీ సమస్య వెలుగులోకి వచ్చిందన్నారు. రామ్లల్లా విగ్రహానికి ఎదురుగా పూజారి కూర్చునే, వీఐపీలు దర్శనం చేసుకునే చోట నీరు కారుతున్నట్లు దాస్ చెప్పారు.
ఇది కూడా చదవండి: Afghanistan in Semis: సెమీస్ లో ఆఫ్ఘనిస్తాన్.. సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ!
ఈ మేరకు ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహారించారని, ఆలయ ప్రాంగణం నుంచి వర్షపు నీరు పోయేందుకూ సరైన ఏర్పాట్లు లేవంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు ఈ సమస్యపై స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు. అయితే ఈ విషయం తెలియగానే ఆలయానికి చేరుకున్న ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర.. పైకప్పుని వాటర్ప్రూఫ్గా మార్చేలా మరమ్మతు పనులు చేయాలని సూచించినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. మొదటి అంతస్తు పనులు జులై వరకూ, మొత్తం ఆలయ నిర్మాణం డిసెంబరు నాటికి పూర్తిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.
Ayodhya: బాలరాముడి గర్భగుడిలోకి వర్షం నీరు!
Water Leakage At Ayodhya Ram Mandir: వర్షం కురిసినప్పుడు అయోధ్య రామమందిర మొదటి అంతస్తు నుంచి వర్షపు నీరు గర్భగుడిలోకి వస్తున్నట్లు అయోధ్య రామ మందిర ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ వెల్లడించారు.
అసలు ‘‘ఇలా ఎందుకు వర్షపు నీరు (Rain Water) లోపలికి వస్తుంది.. గుడి పైకప్పును ఎలా నిర్మించారు.. నీరు లీక్ కాకుండా ఏం చేయాలి ?’’ అనే అంశాలపై ఇప్పుడు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో వర్షాలు తీవ్రరూపు దాలిస్తే అయోధ్య రామాలయంలో నీటి లీకేజీ కారణంగా భక్తులు పూజలు చేయడం కష్టమవుతుందని సత్యేంద్ర దాస్ అన్నారు.
సత్యేంద్రదాస్ (Satyendra Das) వ్యాఖ్యలతో అయోధ్య శ్రీ రామ మందిర నిర్మాణ కమిటీ చైర్పర్సన్ నృపేంద్ర (Nripendra) ఏకీభవించారు. పైకప్పు నుంచి నీటి లీకేజీ సమస్య ఉన్న మాట నిజమేనన్నారు. త్వరలోనే ఆలయం పైకప్పు మరమ్మతులు, వాటర్ఫ్రూఫింగ్ చేయిస్తామన్నారు. ‘‘ప్రాచీన ఆలయ నిర్మాణ శైలిలో భాగంగానే గురు మండపాన్ని ఓపెన్గా వదిలినట్లు ఆయన వివరించారు.
ఆలయ గోపురం నిర్మాణ పనులు పూర్తయ్యాక.. ఈ ఓపెన్ ప్రదేశాన్ని కవర్ చేస్తుంది. ఆలయం గర్భగుడి లోపల డ్రైనేజీ వ్యవస్థ లేదు. మ్యానువల్గా ఆ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉందని, పైకప్పు నుంచి నీటి లీకేజీకి ఆలయ డిజైన్ సమస్య కానీ, ఆలయ నిర్మాణ సమస్య కానీ కారణం కాదు’’ అని నృపేంద్ర స్పష్టం చేశారు.
Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరంలో కలకలం.. తుపాకీతో కాల్చుకుని జవాన్ మృతి
Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిరం భద్రత కోసం మోహరించిన ఎస్ఎస్ఎఫ్ జవాన్ కాల్పుల్లో మరణించాడు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున 5.25 గంటలకు చోటుచేసుకుంది. ఆ సైనికుడి పేరు శత్రుఘ్న విశ్వకర్మ. 25 ఏళ్ల శతృఘ్న అంబేద్కర్ నగర్ నివాసి. ఉదయం రామమందిరం కాంప్లెక్స్లో కాల్పుల శబ్ధం వినిపించడంతో తోటి భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అక్కడ శతృఘ్న రక్తపు మడుగులో పడి ఉండడం చూశారు. తుపాకీ తూటా తగిలినట్లు గమయించారు. తోటి సైనికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఇక్కడి నుంచి గాయపడిన సైనికుడిని ట్రామా సెంటర్కు తరలించారు. అయితే అక్కడి వైద్యులు అతడు చనిపోయినట్లు నిర్ధారించారు.
Ayodhya Ram Mandir: సైనికుడి మృతితో అయోధ్య ఆలయ ప్రాంగణంలో కలకలం రేగింది. సంఘటనా స్థలానికి ఐజీ, ఎస్పీలు చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని వారు స్వయంగా పరిశీలించారు. ఫోరెన్సిక్ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించింది. ప్రాథమిక విచారణలో ఆత్మహత్యగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. రిపోర్టు వచ్చిన తర్వాత మృతికి అసలు కారణం తేలనుంది.
కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబం..
శత్రుఘ్న విశ్వకర్మ 2019 బ్యాచ్కి చెందినవాడు. అతను అంబేద్కర్ నగర్లోని సమ్మన్పూర్ పోలీస్ స్టేషన్లోని కాజ్పురా గ్రామంలో నివాసి. SSFలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆలయ భద్రత కోసం యోగి ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం SSF దళాన్ని ఏర్పాటు చేసింది. ఘటనకు ముందు శత్రుఘ్న మొబైల్ చూస్తున్నాడని మృతుడి సహోద్యోగులు తెలిపారు. అయితే, అతను కూడా కొన్ని రోజులుగా ఏదో ఆందోళనలో ఉన్నట్టు కనిపించేవాడని తోటి సిబ్బంది చెబుతున్నారు. పోలీసులు అతని మొబైల్ను కూడా విచారణ కోసం స్వాధీనం చేసుకున్నారు. మృతుడి కుటుంబీకులకు పోలీసులు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శతృఘ్న ఈ లోకంలో లేడని కుటుంబ సభ్యులు నమ్మలేకపోతున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
మూడు నెలల క్రితం కూడా
మూడు నెలల క్రితం కూడా రామమందిరం భద్రత కోసం మోహరించిన ఓ సైనికుడి దగ్గర తుపాకీ పెళ్లి ప్రమాదం జరిగింది. ఆ సందర్భంలో, సైనికుడు స్వయంగా తన రైఫిల్ను శుభ్రం చేస్తున్నపుడు అది పొరపాటున పేలింది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు.