Kolkata: ఆందోళన విరమించిన జూడాలు..శనివారం నుంచి విధుల్లోకి

కోలకత్తా ట్రైనీ డాక్టర్ హత్యాచారం తర్వాత దాదాపు నెల రోజులుగా నిరసనలు చేస్తూ విధులకు దూరంగా ఉన్న జూనియర్ డాక్టర్లు మొత్తానికి తమ ఆందోళనను విరమించారు. శనివారం నుంచి డ్యూటీలో జాయిన్ అవుతామని ప్రకటించారు.

Pesticide: తెలంగాణలో మితిమీరిన పురుగు మందుల వాడకం.. ఎన్‌ఐఎన్‌ ఆందోళన!

దేశంలోనే తెలంగాణలో పెస్టిసైడ్స్ అతిగా వినియోగిస్తున్నట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది. ప్రమాదకరమైన 11 మందులు వాడుతున్నట్లు జాతీయ పోషకాహార సంస్థ వెల్లడించింది. రైతుల రక్తం, మూత్ర నమూనాల్లో వ్యాధుల బారినపడే లక్షణాలు కనిపించినట్లు స్పష్టం చేసింది.

మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దు

సంచలనం సృష్టించిన ట్రైనీ డాక్టర్ రేప్‌ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ చుట్టు ఉచ్చు బిగుస్తోంది.అతని మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తూ పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.

Watch Video: నిలబడి మూత్రం పోస్తున్నారా ? అయితే ప్రమాదంలో పడ్డట్లే..!

వాష్‌రూంలో ఉండే టాయిలెట్లలో మగవారు నిలబడి మూత్రం పోశాక ఫ్లష్ చేస్తారు. దీనివల్ల హానికరమైన క్రిములతో కూడుకున్న యూరిన్ డ్రాప్స్ గాల్లో కలిసిపోయి వాష్‌రూంలో ఉండే టూత్‌బ్రష్, టవల్స్‌, టిష్యూ పేపర్‌లకి వ్యాపిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఉద్యోగులకు షాక్ ఇచ్చిన యాక్సెంచర్.. కంపెనీలో అసలేం జరుగుతోంది?

యాక్సెంచర్ కంపెనీ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ప్రమోషన్లతో పాటు వేతన పెంపును ఆరు నెలల పాటు ఆలస్యం చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ఉద్యోగులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Ravneet: రాహుల్ గాంధీపై ఆరోపణలు.. కేంద్ర మంత్రిపై ఎఫ్‌ఐఆర్ నమోదు!

రాహుల్ గాంధీ ఉగ్రవాది అంటూ ఆరోపణలు చేసిన కేంద్ర మంత్రి రవనీత్ సింగ్‌ బిట్టుపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. దేశంలో నెం.1 టెర్రరిస్టు రాహుల్ గాంధీ అంటూ బిట్టు ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలపై కర్ణాటక కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు ఆ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు.

Web Stories
web-story-logo 'బిగ్‌బాస్‌' లో మొదటి వారమే ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్స్‌ వీళ్లే! వెబ్ స్టోరీస్

'బిగ్‌బాస్‌' లో మొదటి వారమే ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్స్‌ వీళ్లే!

web-story-logo చీరలో మెరిసిపోతున్న మిత్రవింద..! వెబ్ స్టోరీస్

చీరలో మెరిసిపోతున్న మిత్రవింద..!

web-story-logo బిగ్ బాస్ సీజన్ 8లో ఆర్జీవీ హీరోయిన్.! వెబ్ స్టోరీస్

బిగ్ బాస్ సీజన్ 8లో ఆర్జీవీ హీరోయిన్.!

web-story-logo సంయుక్త అందాల అరాచకం.. చీరలో అదుర్స్! వెబ్ స్టోరీస్

సంయుక్త అందాల అరాచకం.. చీరలో అదుర్స్!

web-story-logo పింక్ లెహంగాలో మిల్కీ బ్యూటీ అందాలకు ఫిదా..! వెబ్ స్టోరీస్

పింక్ లెహంగాలో మిల్కీ బ్యూటీ అందాలకు ఫిదా..!

web-story-logo ఉర్ఫీ మ్యాజికల్ ఫ్యాషన్ ..  చూస్తే ఫిదా.! వెబ్ స్టోరీస్

ఉర్ఫీ మ్యాజికల్ ఫ్యాషన్ .. చూస్తే ఫిదా.!

web-story-logo ఒళ్లు నొప్పులు వేధిస్తున్నాయా..? వెబ్ స్టోరీస్

ఒళ్లు నొప్పులు వేధిస్తున్నాయా..?

web-story-logo టైగర్ నట్స్ డైట్‌లో చేర్చుకుంటున్నారా..? వెబ్ స్టోరీస్

టైగర్ నట్స్ డైట్‌లో చేర్చుకుంటున్నారా..?

web-story-logo రెస్టారెంట్‌లో పచ్చి ఉల్లిపాయ క్రంచీగా ఎలా ఉంటుంది? వెబ్ స్టోరీస్

రెస్టారెంట్‌లో పచ్చి ఉల్లిపాయ క్రంచీగా ఎలా ఉంటుంది?

web-story-logo 10 నిమిషాలు వ్యాయామాలతో కళ్లు పదిలం వెబ్ స్టోరీస్

10 నిమిషాలు వ్యాయామాలతో కళ్లు పదిలం

విరుచుకుపడిన ఇజ్రాయెల్‌...1000 రాకెట్లు ధ్వంసం!

లెబనాన్‌ లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్ల నేపథ్యంలో పశ్చిమాసియాలో మరోసారి యుద్దమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటి వరకు దాదాపు వంద రాకెట్‌ లాంఛర్లలో ఉన్న 1000 రాకెట్లను తమ యుద్ద విమానాలను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్‌ వెల్లడించింది.

Hezbollah :  హెజ్బుల్లా స్థావరాల మీద విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్

ఎలక్‌ట్రానిక్ పరికరాల మీద దాడ అయిపోయింది ఇప్పుడు ప్రత్యక్ష దాడులతో హెజ్బుల్లా మీద విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్. హెజ్బుల్లా ఉగ్ర కార్యకలాపాలు, మౌలిక సదుపాయాల నాశనమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ చెప్పింది.

Lebanon: లెబనాన్ కీలక నిర్ణయం.. పేజర్లు, వాకీటాకీలు నిషేధం

లెబనాన్, సిరియాలో వందల సంఖ్యలో పేజర్లు పేలిన ఘటనలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. దీంతో లెబనాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి తమ దేశం నుంచి వెళ్లే విమానాల్లో పేజర్లు, వాకీటాకీలు తీసుకెళ్లకుండా నిషేధం విధించింది.

USA: ట్రంప్ ర్యాలీలో పాల్గొన్నవారికి వింత జబ్బు?

ఒకపక్క అమెరికా అధ్యక్ష పదవి రేస్‌లో ఉన్న ట్రంప్‌ మీద వరుస హత్యాప్రయత్నాలు జరుగుతున్నాయి మరోవైపు ట్రంప్ ర్యాలీలో పాల్గొన్న మద్దతు దారులు వింత రోగాలబారిన పడుతున్నారు. దీంతో ట్రంప్ ర్యాలీలో రసాయన దాడి జరిగిందేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

US Fed : యూఎస్‌ ఫెడరల్ రిజర్వ్ సంచలన ప్రకటన

50 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్ కమిటీ ప్రకటించింది. ఈ నిర్ణయంతో 2020 తరువాత తొలిసారిగా వడ్డీరేట్లు తగ్గాయి.5.25- 5.50 శాతంతో 22 ఏళ్ల గరిష్ఠ స్థాయిలో ఉన్న వడ్డీ రేట్లు తాజాగా 4.75-5.0 శాతానికి చేరాయి.

Lebanon: పేలిన రేడియో, వాకీటాకీలు.. 20మంది మృతి, 450మందికి గాయాలు

లెబనాన్‌లో పేజర్లను పేల్చి విధ్వంసం సృష్టించిన మరుసటి రోజే వాకీటాకీల పేలుళ్లు కలకలం రేపాయి. బుధవారం బీరుట్‌తోపాటు పలు ప్రాంతాల్లో వాకీటాకీలను హ్యాక్‌ చేసి పేల్చేశారు. ఈ ఘటనల్లో 20మంది మృతిచెందగా.. 450 మంది గాయపడ్డారు.

Apollo Gold : ఆ పేజర్లు మేం తయారు చేయలేదు!

లెబనాన్‌ లో పేలుళ్లకు కారణమైన హెజ్‌బొల్లా పేజర్లను తాము తయారు చేయలేదని గోల్డ్‌ అపోలో కంపెనీ వెల్లడించింది.ఆ పేజర్లు బుడాపెస్ట్‌ లోని ఓ కంపెనీలో తయారయ్యాయని తెలిపింది. వాటి పై తమ కంపెనీ పేర్లు వాడటానికి మాత్రమే అనుమతి ఇచ్చామని ఆ ప్రకటనలో చెప్పింది.

CM Revanth Reddy: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్‌కు బిగ్ రిలీఫ్

ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఈ కేసుపై విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం.. విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు నిరాకరించింది.   

Jani Master : పోలీసుల అదుపులో జానీ మాస్టర్.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ!

లైగింక వేధింపుల కేసులో జానీ మాస్టర్ ను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు నిన్న గోవాలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నేడు ఆయనను హైదరాబాద్‌ కి తీసుకురానున్నారు. నేడు ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు.

Rains: తెలంగాణలో మూడు రోజులు పాటు వానలు..అలెర్ట్‌ ప్రకటించిన ఐఎండీ!

తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

Note For Vote Case : నేడు సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ

ఓటుకు నోటు కేసుపై ఈరోజు సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు బదిలీ చేసేలా ఆర్డర్ ఇవ్వాలని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

Dasara Holidays : దసరా సెలవులు వచ్చేశాయి..మొత్తం ఎన్ని రోజులో తెలుసా!

తెలంగాణ ప్రభుత్వం పాఠశాల , కాలేజీ విద్యార్థులకు ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. అక్టోబర్‌ 2 నుంచి 14 వరకు దసరా సెలవులను ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana: కొత్త రేషన్‌ కార్డుదారులకు గుడ్‌ న్యూస్‌...!

కొత్త రేషన్‌ కార్డుల జారీకి అక్టోబర్‌ రెండో తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రేష‌న్ కార్డులు జారీకి ప‌టిష్ట కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని రేవంత్‌ అన్నారు.

TG : ఆసుపత్రిలో శిశువు మృతిపై స్పందించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

హుజూర్‌నగర్ ఏరియా ఆసుపత్రిలో నర్సుల నిర్లక్ష్యం వల్ల శిశువు మృతి చెందడంపై వచ్చిన వార్తా కథనాలపై మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందించారు. కమిషనర్ సమర్పించిన నివేదికలో పత్రికలో వచ్చిన వార్త కథనంలోని పలు అంశాలు నిరాధారమైనవిగా పేర్కొన్నారు.

Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ సంచలన నిర్ణయం!

తిరుమల లడ్డూ వ్యవహారంపై ఏపీ హైకోర్టును వైసీపీ ఆశ్రయించింది. తమపై టీడీపీ వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించి వాస్తవాలు బయటకు వచ్చేలా చూడాలని పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై వచ్చే బుధవారం వాదనలు వింటామని కోర్టు తెలిపింది.

Grandhi Srinivas: జగన్‌కు షాక్.. టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే!

AP: జగన్‌కు మరో షాక్ తగిలేలా ఉంది. వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో ఆయన టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌ను శ్రీనివాస్ ఓడించిన సంగతి తెలిసిందే.

Bandi Sanjay: హిందువుల మనోభావాలను గాయపర్చారు వారిని భగవంతుడు క్షమించడు

తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిపారంటూ వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. హిందువుల మనోభావాలను గాయపర్చిన వారిని భగవంతుడు ఎప్పటికీ క్షమించడంటూ ఆయన తన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.

Tenali: తెనాలిలో గంజాయి ముఠా అరెస్టు.. సీక్రెట్ గా ప్యాకెట్లలో..!

తెనాలిలో గంజాయి విక్రయాలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి గంజాయి కొనుగోలు చేసి ప్యాకెట్లుగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందుల వద్ద 30 వేల విలువగల కేజిన్నర గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

South Central Railway-Sankranti: సంక్రాంతికి 400 ప్రత్యేక రైళ్లు!

సంక్రాంతి పండుగకు నాలుగు నెలల ముందే రెగ్యులర్​ రైళ్లన్నీ నిండిపోయాయి. రిజర్వేషన్​ ఓపెన్​ చేసిన నిమిషాల్లోనే ఖాళీ అయిపోయాయి.ఈ క్రమంలో ప్రయాణికుల కోసం 400 స్పెషల్ సర్వీసులు నడపాలనిదక్షిణ మధ్య రైల్వే అధికారులు భావిస్తున్నారు.

AP: తిరుమల లడ్డులో గొడ్డు కొవ్వు ఉంది: ఆనం వెంకటరమణా రెడ్డి

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కలిపే నెయ్యిలో సోయాబిన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బిన్, మొక్కజొన్న, పత్తి గింజల నూనె, ఫిష్‌ ఆయిల్, పామాయిల్ అలాగే గొడ్డు కొవ్వు వాడినట్లు ల్యాబ్‌ రిపోర్టులో తేలిందని టీడీపీ నేత ఆనం వెంకటరెడ్డి పేర్కొన్నారు.

జంతువుల నుంచి నూనె ఎలా తయారు చేస్తారో తెలుసా ?

వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ తయారీ చేసేందుకు నెయ్యికి బదులు జంతు నూనె వాడినట్లు తమ దృష్టికి వచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పడం దుమారం రేపుతోంది. అసలు జంతువుల నుంచి నూనె ఎలా తయారుచేస్తారో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి.

Stock Market: భారీ లాభాలతో దూసుకుపోతున్న స్టాక్‌ మార్కెట్లు!

శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్​ మొదటి సారి 84,000 మార్కును దాటింది. నిఫ్టీ సరికొత్త జీవనకాల గరిష్ఠాలను తాకింది. ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లు తగ్గించడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు లాభాలకు కారణంగా చెప్పొచ్చు.

Gold Prices: ఇదే మంచి ఛాన్స్‌...భారీగా దిగొచ్చిన ధరలు..!

బంగారం ధరలు గత కొద్ది రోజులుగా దిగి వస్తుండగా..ఈ రోజు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 68 వేల 250 కు పడిపోయింది. ఇక 24 క్యారెట్ల పసిడి రేటు పది గ్రాముల పై రూ.280 మేర తగ్గి రూ. 74 వేల 450 వద్దకు దిగివచ్చింది.

Laddu Auction: గణపతి లడ్డూలకు భారీ డిమాండ్.. గతేడాది రికార్డులివే!

హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు వందల సంఖ్యలో వేలంపాటలో పాల్గొంటూ లక్షల రూపాయలు పెంచేస్తున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

హమ్మయ్య మార్కెట్ మళ్ళీ లాభాల్లోకి.. !

నిన్న నష్టాలను మూటగట్టుకున్న దేశీ స్టాక్ మార్కెట్ ఈరోజు మాత్రం మళ్ళీ పుంజుకుంది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ 50 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో మన మార్కెట్‌లో జోష్ కనిపించింది.

Gold Price : హమ్మయ్యా…బంగారం ధర తగ్గిందోచ్‌..ఎంతో తెలుసా!

బంగారం ధరలు 4 రోజుల తర్వాత స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ.150 తగ్గి రూ. 68 వేల 650 వద్ద స్థిరంగా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు తులంపై రూ.160 మేర తగ్గడంతో ప్రస్తుతం రూ.74 వేల 890 పలుకుతోంది.

Stock Market: ఈరోజు కూడా లాభాల్లోనే స్టాక్ మార్కెట్లు

వరుసగా రెండో రోజు కూడా స్టాక్ మార్కెట్లు లాభాలతో క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 90, నిఫ్టీ 34 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచీ సానుకూల సంకేతాలు రావడంతో  దేశీ షేర్లు పైకి ఎగబాకాయి.

AP News: క్లీన్ ఎనర్జీ కోసం ఏపీలో గ్లోబల్ యూనివర్శిటీ ఏర్పాటు

క్లీన్ ఎనర్జీ కోసం ఏపీలో గ్లోబల్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తాం సీఎం చంద్రబాబు చెప్పారు. గుజరాత్‌లో ప్రధాని మోదీ ప్రారంభించిన 4వ గ్లోబల్ రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో చంద్రబాబు పాల్గొన్నారు.

తాజా కథనాలు
Image 1 Image 2
stocks