🔴 Pahalgam Terror Attack Live Updates: సరిహద్దుల్లో హై టెన్షన్.. ఏ క్షణమైనా వార్.. లైవ్ అప్డేట్స్!

Pahalgam Terror Attack: సరిహద్ధుల్లో హైటెన్షన్.. ఏ క్షణమైనా వార్.. ఈ ఘటనకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ తెలుసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇంటర్నేషనల్

author-image
By Lok Prakash
New Update
India vs Pakistan

India vs Pakistan

Pahalgam Attack: పహల్గామ్ దాడి ఖచ్చితంగా పాక్ సైన్యం పనే.. ఇదిగో ప్రూఫ్స్!

పహల్గామ్ దాడికి తమకు ఏం సంబంధం లేదని పాకిస్తాన్ బుకాయిస్తోంది. కానీ అది చేయించింది పాక్ సైన్యమే అన్న ఫ్రూఫ్ ను భారత దర్యాప్తు బృందాలు కనుగొన్నాయి. ఉగ్రవాదుల్లో ఒకడైన హషిమ్ మూసా పాక్‌ సైన్యంలో ప్రత్యేక దళమైన పారా కమాండో అని తేలింది. 

terrorist
Hashim Musa, Terrorist

 పహల్గామ్ దాడి వెనుక కచ్చితంగా పాకిస్తాన్ సైన్యం హస్తం ఉంది అంటున్నాయి భారత దర్యాప్తు బృందాలు. పహల్గాం దాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదుల్లో ఒకడైన హషిమ్‌ మూసా పాక్‌ సైన్యంలో ప్రత్యేక దళమైన పారా కమాండో అని తమ దర్యాప్తులో తేలింది అంటూ ప్రూవ్స్ చూపిస్తున్నారు. అయితే అతను ప్రస్తుతం ఉగ్రవాదిగా మారిపోయాడని...పాక్ కు చెందిన లష్కరే తోయిబాతో కలిపి పని చేస్తున్నాడని చెప్పారు. టీఆర్ఎఫ్ మాస్టర్ మైండ్లు హషీమ్ ను ప్రత్యేకంగా ఎంపిక చేసి మరీ కాశ్మీర్ దాడికి పంపించారని తెలిపాయి. 

ఇది కూడా చూడండి: Waqf Board Assets: వక్ఫ్‌ ఆస్తులు ఆ రాష్ట్రంలోనే ఎక్కువ.. కేంద్రం కీలక ప్రకటన

పక్కా ఆధారాలు లభించాయి..

కాశ్మీర్ లో ఉగ్రవాదులకు అనుకూలంగా పని చేస్తున్నారన్న అనుమానంతో భారత సైన్యం అక్కడి స్థానికులను వందల మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో చాలా మందికి హషీమ్ మూసా తెలుసు. ఉగ్రవాద ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్స్‌, మూసాకు ఉన్న సైనిక నేపథ్యాన్ని కాశ్మీరీలు ధృవీకరించారని దర్యాప్తు బృందాలు తెలిపాయి. పాక్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ లో పని చేసిన మూసా తరువాత లష్కరేలోకి సహాయకారిగా వచ్చి..కరడుకట్టిన ఉగ్రవాదిగా మారాడని దర్యాప్తు బృందాల్ో అధికారి ఒకరు తెలిపారు. దీన్ని బట్టి పాక్ సైన్యానికి, ఉగ్రవాద సంస్థలకు మధ్య ఉన్న అనుబంధాన్ని అంచనా వేయొచ్చని చెప్పారు. 

ఇది కూడా చూడండి: Russia: రష్యా సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ ప్రకటన

పహల్గాంకు చేరుకునేందుకు ఉగ్రవాదులు  22 గంటల పాటు ట్రెక్కింగ్ చేశారు.  దాడులు జరిపేందుకు కోకెర్నాగ్‌ అడవుల నుంచి బైసరన్‌ లోయ వరకు నడుచుకుంటూ వచ్చారని దర్యాప్తు బృందాలు చెబుతున్నాయి. ఇదంతా చేయాలంటే ఉగ్రవాదులకు కఠిన శిక్షణ అవసరం. పాక్ పారా కమాండోలు ఈ రకమైన శిక్షణ పొందుతారు.   వీరు సంప్రదాయేతర యుద్ధతంత్రం, కోవర్ట్‌ ఆపరేషన్లలో దిట్టలు. వీరు శారీరకంగా, మానసికంగా బలోపేతం అయేందుకు ట్రైన్ చేస్తారు. అత్యాధునిక ఆయుధాలు, చేతులతో పోరాటం వంటివి నేర్పిస్తారు. దాడిలో పాల్గొన్న హషీమ్, మరో ఇద్దరు ఉగ్రవాదులు జునైద్‌భట్‌, అర్బాజ్‌ మిర్‌ కూడా ఇటువంటి శిక్షణ పొందారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారత సైన్యం శాయశక్తులా ప్రయత్నిస్తోందని దర్యాప్తు బృందాలు తెలిపాయి. ఇప్పటికే నాలుగుసార్లు దొరికినట్టే దొరికి తప్పించుకున్నారని చెప్పారు.

ఇది కూడా చూడండి: Pak-India:భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!

Pahalgam terror attack 2025

  • Apr 30, 2025 20:11 IST

    యుద్ధానికి సిద్ధమవుతోన్న పాకిస్తాన్

    --- యుద్ధానికి సిద్ధమవుతోన్న పాకిస్తాన్
    --- బోర్డర్‌లో హై అలర్ట్ ప్రకటించిన పాకిస్తాన్
    --- ఇప్పటికే బంకర్లలో భారత సరిహద్దు గ్రామాల ప్రజలు
    --- 24 గంటల్లో భారత్ దాడి చేసే అవకాశం ఉందని...
    --- పాకిస్తాన్‌ను హెచ్చరించిన ఇంటెలిజెన్స్ వర్గాలు



  • Apr 30, 2025 20:10 IST

    మోదీ కుల గణన నిర్ణయంపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..

    కేంద్ర ప్రభుత్వం వచ్చే జనాభా లెక్కలతో కులగణన కూడా చేస్తామని ప్రకటించడంతో రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి తాము మద్దతిస్తున్నారు. అలాగే 50 శాతం ఉన్న రిజర్వేషన్‌ను ఎత్తివేయాలంటూ డిమాండ్ చేశారు.



  • Apr 30, 2025 18:58 IST

    Central cabinet Meeting: పహల్గాం ఉగ్రదాడి ప్రస్తావన లేకుండానే కేంద్ర కేబినెట్ మీటింగ్

    బుధవారం ఉదయం కేంద్ర కేబినెట్‌ జరిగిన సంగతి తెలిసిందే. రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణన్‌ ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 



  • Apr 30, 2025 18:57 IST

    POK: భారత్ పీవోకేను స్వాధీనం చేసుకోవాలి.. బ్రిటన్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

    పహల్గాం ఉగ్రదాడిపై భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఎంపీ లార్డ్ మేఘనాథ్ దేశాయ్ స్పందించారు. కశ్మీర్‌ వివాదానికి స్వస్తి పలకాలంటే భారత్‌ పీవోకేను పూర్తిగా స్వాధీనం చేసుకోవలన్నారు. ఇదే అన్ని సమస్యలకు పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు.
    Full Article



  • Apr 30, 2025 18:56 IST

    పాకిస్తాన్‌ - ఇండియా మధ్య హైటెన్షన్ వాతావరణం

    • పాకిస్తాన్ సరిహద్దులోకి 4 ఇండియన్ రాఫెల్‌ విమానాలు
    • కొద్దిసేపు LOC వెంట పెట్రోలింగ్ నిర్వహించిన రాఫెల్‌
    • రాఫెల్ యుద్ధ విమానాలు చూసి పాక్ ఆర్మీ అలర్ట్‌ 
    • మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు సమాచారం
    • ఈ మేరకు పాకిస్తాన్‌కు చెందిన జియో న్యూస్‌ మీడియాలో కథనం
    • ఇండియా నిఘా డ్రోన్లు సైతం LOCలో సంచరించినట్లు కథనం
    • సరిహద్దులో ఉద్రిక్తత కారణంగా..
    • గిల్గిట్, POKకు అన్ని విమానాలు రద్దు చేసిన పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్‌
    • ఎయిర్‌ఫోర్స్‌ను అలర్ట్ చేసిన పాకిస్తాన్



  • Apr 30, 2025 17:24 IST

    బరితెగించిన పాక్.. పహల్గామ్ ప్రధాన నిందితుడికి ప్రభుత్వ బలగాలతో సెక్యూరిటీ!

    పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది ది రిసెస్టెన్స్ ఫ్రంట్ (TRF) తీవ్రవాదులే అన్న సంగతి తెలిసిందే. కానీ ఈ ఉగ్రదాడికి ప్లాన్ వేసిన సూత్రధారి మాత్రం లష్కరే తోయిబా చీఫ్, భారత మోస్ట్‌ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్‌ సయీద్ అని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా హఫీజ్‌కు సంబంధించి ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. అతడు పాకిస్థాన్‌లోని ప్రభుత్వ భద్రత మధ్య బహిరంగంగానే ఉన్నట్లు సమాచారం.  



  • Apr 30, 2025 17:24 IST

    CM Siddaramaiah : 'పాకిస్తాన్‌ జిందాబాద్'...సీఎం సిద్ధరామయ్య సంచలన కామెంట్స్!

    పాకిస్తాన్‌కు అనుకూలంగా ఎవరైనా మాట్లాడితే అది తప్పు అని, అలాంటి నినాదాలు ఇస్తే అది దేశద్రోహమేనని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. మంగళూరులో ఒక వ్యక్తిని కొట్టి చంపిన సంఘటన నేపథ్యంలో సిద్ధరామయ్య తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

     



  • Apr 30, 2025 13:49 IST

    BIG BREAKING: పాక్ తో యుద్ధం.. భారత్ మరో సంచలన నిర్ణయం!

    కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజరీ (NSA) బోర్డును పునరుద్ధరించింది. RAW (రీసెర్చ్ అండ్ అనలైసిస్ వింగ్) మాజీ చీఫ్‌ అలోక్‌ జోషీని ఛైర్మన్‌గా నియమించింది.ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ఈ నిర్ణయం తీసుకుంది.

    Central Govt Revamps National Security Advisory Board After Pahalgam Attack
    Central Govt Revamps National Security Advisory Board After Pahalgam Attack

     



  • Apr 30, 2025 13:48 IST

    Pahalgam Attack: కేంద్రం సంచలనం.. పహల్గాం ఉగ్రదాడి వీడియో విడుదల !

    పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన వీడియోను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు గతంలో పాకిస్థాన్ ఉగ్రవాదులు భారత్‌లో దాడులు చేసిన దృశ్యాలను కూడా బయటపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.

    Indian Army at Terror Attack Site
    Indian Army at Terror Attack Site

     



  • Apr 30, 2025 13:46 IST

    జాతీయభద్రతా సలహా బోర్డును పునర్వ్యవస్థీకరణకిరించిన భారత ప్రభుత్వం..

    చైర్మన్ గా..R&AW మాజీ చీఫ్ అలోక్ జోషి 

    సభ్యులుగా 

    • ఎయిర్ మార్షల్ పిఎం సిన్హా (మాజీ వెస్ట్రన్ ఎయిర్ కమాండర్)
    • జనరల్ ఎకె సింగ్(మాజీ సదరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్)
    • రియర్ అడ్మిరల్ మాంటీ ఖన్నా
    • బి వెంకటేష్ వర్మ (రిటైర్డ్ IFS)
    • రాజీవ్ రంజన్ వర్మ(రిటైర్డ్ IPS)
    • మన్మోహన్ సింగ్(రిటైర్డ్ IPS)



  • Apr 30, 2025 13:38 IST

    మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర కేబినెట్ నిర్ణయాలపై ప్రెస్‌మీట్



  • Apr 30, 2025 13:38 IST

    ముగిసిన కేంద్ర మంత్రి వర్గ సమావేశం



  • Apr 30, 2025 13:13 IST

    BIG BREAKING: పాక్‌కు భారత్ మరో ఊహించని షాక్.. అప్పు ఇవ్వొద్దని IMFకు కంప్లైంట్!

    పాక్‌పై భారత్ ఆర్థిక యుద్ధం ప్రకటించింది. పాకిస్థాన్‌కు అప్పు ఇవ్వొద్దని అంతర్జాతీయ ద్రవ్య నిధిని భారత్ సూచించింది. పాక్‌కు నిధులు ఇస్తుంటే.. ఉగ్రవాదులకు ఇస్తుందని భారత్  IMFకు తెలిపింది. పాక్‌కు అప్పు ఇచ్చే అంశంపై మే 9న ఐఎంఎఫ్ బోర్డు చర్చించనుంది.

    IMF
    IMF

     



  • Apr 30, 2025 13:13 IST

    Mariyam Nawaz: మనకు అణ్వాయుధాలున్నాయి..మనల్నేం చేయలేరు....మరియం నవాజ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

    యుద్ధవాతవరణంలోనూ బలుపు మాటలు మాట్లాడుతున్న పాకిస్థాన్‌ మంత్రుల జాబితాలో మరొకరు చేరారు. తాజాగా పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ అణ్వాయుధ శక్తిని కలిగి ఉన్నందున ఎవరూ అంత సులభంగా దాడి చేయలేరని వ్యాఖ్యానించారు.

    Mariyam Nawaz
    Mariyam Nawaz

     



  • Apr 30, 2025 13:12 IST

    BIG BREAKING: భారత్ పై మరో ఉగ్రదాడికి కుట్ర!

    పహల్గామ్ దాడి సరిపోలేదన్నట్టు ఇప్పుడు టీఆర్ఎఫ్ మరో కుట్రకు ప్లాన్ వేస్తోంది. పాక్ ఆర్మీ ఛీఫ్ అసిమ్ మునీర్ సూచనలతోనే ఈసారి కూడా దాడి చేయడానికి ఉగ్రవాదులు రెడీ అవుతున్నారని సమాచారం. 

    pak
    Pak Army Chief Asif Munir, Terrorists

     



  • Apr 30, 2025 11:55 IST

    Pahalgam Attack: వీసాల రద్దుతో భారత్ నుంచి పాక్ కు వెళ్లిపోతున్న అక్కడి పౌరులు



  • Apr 30, 2025 11:24 IST

    Pahalgam Attack: ఆ టెర్రరిస్టుల వళ్ల మాకు ఇబ్బందులు.. వీసాల రద్దుతో పాక్ కు వెళ్లిపోతున్న వారి ఆందోళన



  • Apr 30, 2025 11:19 IST

    Pahalgam Attack: పహల్గామ్ దాడికి ముందు సోషల్ మీడియాలో ఉగ్రవాదుల పోస్ట్ లు...తుపాకీ కావాలంటూ..

    పహల్గామ్ లో దాడి చేసిన ఉగ్రవాదుల గురించి ఎన్ఐఏ తీవ్ర దర్యాప్తు చేస్తోంది. ఇందులో అనేక ముఖ్య విషయాలను కనుగొంది. దాడికి ముందు ఉగ్రవాదులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారని..రెసిస్టెన్స్ టైమ్ అనే ఒక గ్రూప్ తో కనెక్ట్ అయ్యారని చెబుతోంది. 

    Pahalgam attack terrorists
    Pahalgam attack terrorists

     



  • Apr 30, 2025 11:18 IST

    BREAKING: రాసి పెట్టుకోండి.. మరో 24 గంటల్లో భారత్-పాక్ యుద్ధం ప్రారంభం

    పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. మరో 24 గంటల్లో ఏ క్షణమైనా భారత్ పాక్‌పై దాడి చేయనున్నట్లు తెలుస్తోంది. తమ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందని పాక్ సమాచార మంత్రి తరార్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

    India Pakistan War Tension🔴LIVE : ఈ రాత్రే పాక్‌పై యుద్ధం | PM Modi | Pahalgam Attack | Kasmir | RTV



  • Apr 30, 2025 11:18 IST

    BIG BREAKING: మమ్మల్ని కాపాడండి...ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించిన పాక్

    మరో ఒకటి లేదా రెండు రోజుల్లో తమ పై భారత్ దాడి చేస్తుందనే భయంతో పాకిస్తాన్ వణికిపోతోంది. దీని నుంచి తప్పించుకునేందుకు ఆ దేశం ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించింది. పాక్ పీఎంషాబాజ్ షరీఫ్ యూఎన్ సెక్రటరీ జనరల్ గుటెర్రెస్‌ను తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు.

    pak
    Pakistan PM Shabaz Sharif

     



  • Apr 30, 2025 11:15 IST

    సరిహద్దుల్లో భద్రతా చర్యలపై సమీక్షించనున్న కేంద్ర మంత్రులు



  • Apr 30, 2025 11:14 IST

    ప్రధాని నివాసానికి చేరుకున్న హోమంత్రి అమిత్ షా



  • Apr 30, 2025 11:12 IST

    పాకిస్తాన్ పై భారత్ ఆర్థిక యుద్ధం

    పాకిస్తాన్ కు ఐఎంఎఫ్ లోన్ పై భారత్ అభ్యంతరం



  • Apr 30, 2025 10:06 IST

    భారత్‌- పాక్ యుద్ధానికి సమయం ఆసన్నం

     -- 24 గంటల్లో ఏ క్షణమైనా పాకిస్తాన్‌పై భారత్‌ దాడి
    -- 24 నుంచి 36 గంటల్లో భారత్‌ దాడి చేయబోతోందని..  
    -- స్వయంగా ప్రకటించిన పాక్‌ సమాచార మంత్రి తరార్
    -- భారత్‌ దాడిపై తమకు ఇంటలిజెన్స్‌ రిపోర్ట్‌ ఉందన్న పాక్ మంత్రి
    -- అర్ధరాత్రి 12.30 గంటలకు పాకిస్తాన్ అత్యవసర సమావేశం
    -- దాదాపు 2.30 గంటల పాటు పాక్ ఎమర్జెన్సీ మీటింగ్



  • Apr 30, 2025 10:04 IST

    J&K: ఒకవైపు నీతి కబుర్లు...మరోవైపు సరిహద్దుల్లో కాల్పులు..ఈరోజు కూడా..

    భారత్ కావాలనే యుద్ధానికి కాలు దువ్వుతోందని పాక్ అంటోంది. కానీ మరోవైపు నుంచి సరిహద్దుల్లో కాల్పులకు తెగ బడుతోంది. ఈరోజు కూడా ఎల్వోసీ, అంతర్జాతీయ సరిహద్దుల దగ్గర పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. వీటిని భారత సైన్యం సమర్ధవంతంగా ఎదుర్కొంటోంది. 

     India likely to Attack on Pakistan with help of Israel Technology

     



  • Apr 30, 2025 08:58 IST

    J&K: ఒకవైపు నీతి కబుర్లు...మరోవైపు సరిహద్దుల్లో కాల్పులు..ఈరోజు కూడా..

    భారత్ కావాలనే యుద్ధానికి కాలు దువ్వుతోందని పాక్ అంటోంది. కానీ మరోవైపు నుంచి సరిహద్దుల్లో కాల్పులకు తెగ బడుతోంది. ఈరోజు కూడా ఎల్వోసీ, అంతర్జాతీయ సరిహద్దుల దగ్గర పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. వీటిని భారత సైన్యం సమర్ధవంతంగా ఎదుర్కొంటోంది. 

    Indian Army: మరో ముందడుగు వేసిన కేంద్రం.. భారత సరిహద్దులో పటిష్ఠమైన నిఘా వ్యవస్థ..



  • Apr 30, 2025 08:03 IST

    Pakistan: యుద్ధానికి ప్రధాని ఫుల్ పర్మిషన్..పాకిస్తాన్ కు మొదలైన దడ

    పహల్గామ్ దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ప్రస్తుతం ఇవి తారస్థాయికి చేరుకున్నాయి. దీనికి తోడు నిన్న ప్రధాని మోదీ భారత సైన్యానికి ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. దీంతో ప్రస్తుతం పాకిస్తాన్ లో భయం మొదలైంది. 

    pak
    Atullah Tarar, pakistan information minister

     



  • Apr 30, 2025 08:03 IST

    Pahalgam Attack: పహల్గామ్ దాడి...భారత్ కు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ వార్నింగ్

    పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పహల్గామ్ దాడిపై స్పందించారు. ఉగ్రవాద దాడిని ఖండించిన ఆయన..దానికి కారణమైన పాకిస్తాన్ మీద మాత్రం భారత్ అనవసరంగా నిందలు వేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

    Imran Khan
    Imran Khan

     



  • Apr 30, 2025 06:59 IST

    Jammu and Kashmir: లోయలో పడిపోయిన CRPF జవాన్ల వాహనం

    జమ్మూ కశ్మీర్ బుద్గామ్ జిల్లాలో CRPF జవాన్లు ప్రయాణిస్తున్న వ్యాన్ అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో పది మంది జవాన్లు గాయపడ్డారు. లోయలోపడ్డ వాహనం 181 బెటాలియన్‌కు సంబంధించిందిగా తెలుస్తోంది. తంగనర్ కొండ ప్రాంతంలో వాహనం వెళుతూ ఉండగా అదుపు తప్పింది.

    CRPF vehicle skidded



  • Apr 29, 2025 21:47 IST

    Pahalgam Attack: పహల్గామ్ దాడి ఖచ్చితంగా పాక్ సైన్యం పనే.. ఇదిగో ప్రూఫ్స్!

    పహల్గామ్ దాడికి తమకు ఏం సంబంధం లేదని పాకిస్తాన్ బుకాయిస్తోంది. కానీ అది చేయించింది పాక్ సైన్యమే అన్న ఫ్రూఫ్ ను భారత దర్యాప్తు బృందాలు కనుగొన్నాయి. ఉగ్రవాదుల్లో ఒకడైన హషిమ్ మూసా పాక్‌ సైన్యంలో ప్రత్యేక దళమైన పారా కమాండో అని తేలింది. 

    terrorist
    Hashim Musa, Terrorist

     



  • Apr 29, 2025 19:31 IST

    Modi headless: మోదీ తల తీసిన ఫొటో‌ షేర్ చేసిన పాకిస్తాన్.. కాంగ్రెస్ ఏం చేసిందంటే..?

    పాక్ మాజీ మంత్రి ఫవాద్ అహ్మద్ హుస్సేన్ తలలేని మోదీ ఫొటో Xలో షేర్ చేశారు. ఆ పోస్ట్‌ను కాంగ్రెస్ ఉగ్రదాడిపై ఆల్ పార్టీ మీటింగ్ ప్రధాని రాలేదని ‘గాయబ్’ అని రీట్వీట్ చేసింది. కాంగ్రెస్ పాకిస్తాన్‌కు సపోర్ట్ చేస్తోందని బీజేపీ లీడర్లు ఫైర్ అవుతున్నారు.

    Modi headless photo



  • Apr 29, 2025 18:52 IST

    Indian Army: పాకిస్థాన్‌కు షాక్.. ఇజ్రాయెల్ సాయంతో భారత్ సరికొత్త ప్లాన్ !

    పాకిస్థాన్‌లో ఉన్న అణుస్థావరాలే లక్ష్యంగా భారత్‌ వ్యూహాలు రచిస్తోంది. ఇజ్రాయెల్ టెక్నాలజీ సాయంతో ఆ దేశంలో న్యూక్లియర్‌ స్థావరాలను గుర్తించినట్లు తెలుస్తోంది. కరాచీ, చస్మా, లాహోర్‌, సర్గోదా, రావల్పిండిలో పాక్‌ న్యూక్లియర్ స్థావరాలు గుర్తించినట్లు సమాచారం.

     India likely to Attack on Pakistan with help of Israel Technology
    India likely to Attack on Pakistan with help of Israel Technology



  • Apr 29, 2025 18:20 IST

    Pakistan: పాకిస్థాన్ దొంగబుద్ధి.. భారత్‌పై సైబర్‌ దాడికి యత్నం..

    పాకిస్థాన్‌ సైబర్ నేరగాళ్లు.. భారత సైబర్‌ నెట్‌వర్క్‌పై దాడి చేయడంలో విఫలమయ్యారు. ఇంటర్నెట్ ఆఫ్‌ ఖలీఫా (IOK) అనే గ్రూప్.. భారత ఆర్మీ వెబ్‌సైట్లను హ్యాక్‌ చేయాలని ప్రయత్నించింది. కానీ భారత సైబర్ సెక్యూరిటీ వాళ్ల ప్రయత్నాలను తిప్పికొట్టింది.

    cyber crime



  • Apr 29, 2025 18:20 IST

    Narendra Modi : పాక్ పని ఖతం.. మోడీ నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం!

    ఢిల్లీలోని  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది.  రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశంలో  పాల్గొన్నారు.  దేశ  భద్రతపై క్యాబినెట్ కమిటీ ఏడు రోజుల్లో రెండవసారి సమావేశం కావడం విశేషం.

    India Pakistan War🔴LIVE Updates : 4 కోట్ల ఆర్మీని తెచ్చుకో | Shehbaz Sharif | Modi | Pahalgam | RTV



  • Apr 29, 2025 17:34 IST

    Pahalgam terror attack: ఉగ్రదాడిపై కొత్త అనుమానం రేపిన UP సీఎం యోగి

    పహల్గామ్ టెర్రర్ అటాక్‌పై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆథిత్య నాథ్ కొత్త అనుమానాలు రేకెత్తించారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్తాన్ నుండి వచ్చారో లేదా భారతదేశంలోని వారో నాకు అర్థం కావడం లేదన్నారు. పరోక్షంగా సమాజ్ వాదీని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడారు.

    Up CM Yogi: మహిళలకు గుడ్ న్యూస్‌ చెప్పిన సీఎం!



  • Apr 29, 2025 17:33 IST

    Pakistan Zindabad : పాకిస్థాన్ జిందాబాద్ అన్నాడని కొట్టి చంపేశారు.. ఎక్కడంటే?

    పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తరువాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వ్యక్తిని కొంతమంది కొట్టి చంపేశారు. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటుచేసుకుంది.

    attack Karnataka
    attack Karnataka

     



  • Apr 29, 2025 16:25 IST

    AAP MLA : వ్యవస్థను మెరుగుపరచడానికి లష్కర్ అవసరం... ఆప్ ఎమ్మెల్యే కీలక కామెంట్స్!

    జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఏకైక ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మెహ్రాజ్ మాలిక్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. వ్యవస్థను మెరుగుపరచడానికి లష్కర్ అవసరమని చెబుతున్న  వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

    aap-mla
    aap-mla

     



  • Apr 29, 2025 16:11 IST

    పాకిస్తాన్‌కు మరో బిగ్ షాక్.. ఇటుగా విమానం ఎగిరితే పేల్చపడేస్తాం!

    పాకిస్తాన్‌ ఎయిర్‌లైన్స్‌కు గగనతలం మూసివేయాలని ఇండియా నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్‌కు చెందిన విమానాలను ఇండియా మీదుగా వెళ్లడాన్ని నిషేదించింది. దీంతో పాకిస్తాన్‌ విమానాలు చైనా, శ్రీలంక మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    India-PAK War Thumb 125



  • Apr 29, 2025 16:10 IST

    BSF jawan : మీ బుద్ది మారులేదు కదరా.. BSF జవాన్ ను అడ్డం పెట్టుకుని పాక్ ఆర్మీ దొంగదెబ్బ!

    ఏప్రిల్ 23న పంజాబ్‌లో విధి నిర్వహణలో ఉన్నప్పుడు అనుకోకుండా సరిహద్దు దాటి పాకిస్తాన్ కస్టడీలో ఉన్న భారత బిఎస్‌ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షా రిలీజ్ పై ఉత్కంఠ నెలకొంది. ఈ జవాన్ ను కవచంగా ఉపయోగించుకోవాలని పాక్ చూస్తుందని ఇండియన్ ఆర్మీ అనుమానిస్తోంది. 

    bsf-jawan
    bsf-jawan

     



  • Apr 29, 2025 16:10 IST

    వామ్మో భారత్‌తో పెట్టుకోం.. పాకిస్తాన్ నుంచి టర్కీ ఫ్లైట్ పరుగో పరుగు..!

    పాకిస్తాన్‌కు టర్కీ ఆయుధాలు సరఫరా చేసిందన్న వార్తలపై టర్కీ అధ్యక్ష కార్యాలయం స్పందించింది. ఇంధనం నింపుకోడానికి కార్గో విమానం పాకిస్తాన్‌లో ల్యాండ్ అయ్యిందని తెలిపారు. అది తిరిగి టర్కీ వచ్చిందని చెప్పారు. 2023లో టర్కీలో భూకంపం వస్తే భారత్‌ సాయం చేసింది.

    Türkiye weapons



  • Apr 29, 2025 15:13 IST

    Eknath Shinde : రక్తానికి రక్తంతోనే ప్రతీకారం... ఆ నా కొడుకులను మోడీ వదలడు.. ఏక్ నాథ్ షిండే సంచలన కామెంట్స్

    ఉగ్ర దాడిపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కీలక ప్రకటన చేశారు. ఈ దాడి చాలా దురదృష్టకరమని; ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పొరుగు దేశం పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని రక్తానికి రక్తంతో ప్రతీకారం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు.  

    attack ekanth
    attack ekanth

     



  • Apr 29, 2025 15:12 IST

    BIG BREAKING: భారత్ సర్జికల్ స్ట్రైక్స్.. స్పాట్‌లో 200 మంది టెర్రరిస్టులు!

    ఇండియన్ ఆర్మీ దాదాపు 150 నుంచి 200 మంది టెర్రరిస్టులు POKలో ఉన్నట్లు గుర్తించింది. హిజ్బుల్ ముజాహిదీన్, జైషె మొహమ్మద్, లష్కరే తోయిబా సహా 17 యాక్టీవ్‌ టెర్రర్ సంస్థలు ఉన్నట్లు భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. సర్జికల్ స్ట్రైక్ చేసే ఆలోచనలో ఇండియన్ ఆర్మీ.

    PoK for surgical strike



  • Apr 29, 2025 14:33 IST

    PM Modi: పహల్గాం ఉగ్రదాడి.. ప్రధాని మోదీ సంచలన నిర్ణయం

    పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో బుధవారం క్యాబినెట్ కమిటీ ఆన్‌ సెక్యూరిటీ (CCS) సమావేశం కానుంది. దీనికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించనున్నారు. ఈ భేటిలో దేశ భద్రతపై ప్రధాని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

    PM Modi to chair second CCS meeting tomorrow
    PM Modi to chair second CCS meeting tomorrow

     



  • Apr 29, 2025 14:20 IST

    -- భారత్‌తో యుద్ధానికి సిద్ధమైన పాకిస్తాన్

    • భారత్‌ సరిహద్దుల్లోకి పాక్ యుద్ధ ట్యాంకర్లు
    • 40 లక్షల మంది రిటైర్డ్‌ ఆర్మీ జవాన్లు..
    • వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు 
    • భారత్‌తో యుద్ధ భయంతో 4500 మంది.. 
    • ఆర్మీ అధికారులు, సైనికుల రాజీనామాలు
    • 10-15ఏళ్లుగా పాక్‌ ఆర్మీలోకి చేరని యువత
    • ఇండియన్‌ ఆర్మీ ర్యాంక్-4, పాక్ ర్యాంక్-12
    • తగినంత బలం లేకపోవడంతో రిటైర్డ్‌ జవాన్లకు కబురు
    • చైనా అండ చూసుకుని రెచ్చిపోతున్న పాకిస్తాన్



  • Apr 29, 2025 13:53 IST

    పహల్గామ్ అమరులకు డిప్యూటీ సీఎం పవన్ ఘన నివాళి

    మంగళగిరిలో జనసేన పార్టీ నిర్వహించిన పహల్గాం అమరులకు నివాళి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలతో కలిసి అమరులకు నివాళులర్పించారు.

    AP Deputy CM Pawan Tributes to Pehalgam Terror Attack Victims



  • Apr 29, 2025 13:51 IST

    యుద్ధానికి సిద్ధం !.. 40 లక్షల రిటైర్ట్‌ సైనికులను పిలిస్తున్న పాక్ ఆర్మీ

    పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే పాక్ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. సైన్యం నుంచి రిటైర్ట్ అయిన వాళ్లని మళ్లీ పిలుస్తోంది. 40 లక్షల మంది మాజీ సైనికులను తిరిగి సైన్యంలోకి చేర్చుకోనున్నట్లు తెలుస్తోంది.

    Pakistan Army Recalls Ex Army Soldiers
    Pakistan Army Recalls Ex Army Soldiers

     



  • Apr 29, 2025 13:25 IST

    పాక్ జర్నలిస్టులకు షాక్ ఇచ్చిన భారత్.. కేంద్రం సంచలన నిర్ణయం



  • Apr 29, 2025 13:06 IST

    హర్యానాలో ఐస్ క్రీంలు అమ్ముకుంటున్న పాక్ ఎంపీ.. ఆయన కన్నీటి కథ ఇదే!

    పాక్ ఎంపీ దాబా రామ్ 25 ఏళ్ల క్రితం హర్యానా వచ్చి సెటిల్ అయ్యారు. ఇక్కడ ఐస్‌ క్రీంలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. దాబాతో పాటు అతని ఉమ్మడి కుటుంబం 35 మందితో ఇండియాకి వచ్చారు. దాబా రామ్ ఎందుకు ఇండియా రావాల్సి వచ్చిందో తెలియాలంటే ఆర్టికల్ చదవండి.

    Dabi Ram
    Dabi Ram

     



  • Apr 29, 2025 11:55 IST

    ఏపీలో ఎన్ కౌంటర్.. హోరాహోరీగా కాల్పులు!

    ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా ఏజెన్సీలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈక్రమంలో కాకులమామిడి, కంటారం దగ్గర పోలీసులకు తారపడిన మావోయిస్టులు కాల్పులు జరిపారు.

    Encounter in AP
    Encounter in AP

     



  • Apr 29, 2025 11:31 IST

    పాకిస్థానీయులకు నేడే చివరిరోజు

    కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ లో నివసిస్తున్న పాకిస్తానీయుల వీసాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిర్దేశిత‌ గడువులోపు దాయాది దేశ పౌరులు భారత్ విడిచి వెళ్లాలని తెలిపింది. వారు భారత్ ను వీడేందుకు ఈ రోజు చివరి రోజు..

    attari wagah border
    attari wagah border

     



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు