/rtv/media/media_files/2025/04/29/gr4CmmLCule2h6VzmOTb.jpg)
attack ekanth
జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఉగ్రదాడికి ధీటుగా భారత్ ఎప్పుడైనా దాడి చేయగలదని పాకిస్తాన్ భయపడుతోంది. ఇదిలా ఉండగా ఉగ్ర దాడిపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కీలక ప్రకటన చేశారు. ఈ దాడి చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు. దీనితో పాటు, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పొరుగు దేశం పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అమాయక టూరిస్టులను చంపిన ఉగ్రవవాదులను ఏ ఒక్కర్ని కూడా వదలకూడదని.. రక్తానికి రక్తంతో ప్రతీకారం తీర్చుకోవాలని షిండే పిలుపునిచ్చారు.
Also read : Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్
దేశంపై జరిగిన దాడి
ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ, "పహల్గామ్ దాడి చాలా విచారకరం, దురదృష్టకరం. ఇది ఒక వ్యక్తిపై కాదు, దేశంపై జరిగిన దాడి. దేశస్థులందరూ దీనిని తీవ్రంగా పరిగణించారు. దీనిపై రాజకీయాలు చేయడం పనికిరానిది. ఇది రాజకీయాలకు సమయం కాదు" అని అన్నారు. "మన సైనిక సిబ్బంది దేశ సరిహద్దుల్లో ఉన్నారు. వారికి మద్దతుగా నిలబడాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మద్దతుగా నిలబడాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయడం తప్పు," అని అన్నారు. మన ప్రజలపై దాడి చేసిన ఉగ్రవాదుల ఇళ్లను బాంబులతో పేల్చివేశారు. రక్తానికి రక్తంతోనే ప్రతీకారం తీర్చుకోవాలి. పాకిస్తాన్ను విడిచిపెట్టవద్దు. దేశంలోని ప్రతి పౌరుడు పాకిస్తాన్ను తుడిచిపెట్టాలని కోరుకుంటాడు, ప్రధాని మోడీ ఈ కోరికను నెరవేరుస్తారని తాను ఆశిస్తున్నానని షిండే చెప్పుకొచ్చారు.
Also read: కాంగ్రెస్ వాళ్లను ఉరికిచ్చి కొడతా... ఎర్రబెల్లి దయాకర్ రావు ఫుల్ ఫైర్
Also Read : కాంగ్రెస్ నేతలు పాక్ ప్రేమికులు.. పహల్గామ్ ఘటనపై పవన్ సంచలన వ్యాఖ్యలు!