/rtv/media/media_files/2025/04/29/MIDf1ec9MeM0qG59zr9o.jpg)
పాక్, భారత్ హై టెన్షన్ వాతావరణంలో జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. బుద్గామ్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. CRPF జవాన్లు ప్రయాణిస్తున్న వ్యాన్ మంగళవారం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో పది మంది దాకా జవాన్లు గాయపడ్డారు. లోయలోపడ్డ వాహనం 181 బెటాలియన్కు సంబంధించిందిగా తెలుస్తోంది. తంగనర్ కొండ ప్రాంతంలో వాహనం వెళుతూ ఉండగా అదుపు తప్పింది. లోయలోకి దొర్లుకుంటూ వెళ్లిపోయింది. గాయపడ్డ వారిలో 8 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు కాగా.. మిగిలిన ఇద్దరు జమ్మూకాశ్మీర్ పోలీస్ శాఖకు చెందిన స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు.
CRPF vehicle met with an accident at Tangnar area of Doodhpathri in Khansahib tehsil of #Budgam.#CRPF @crpfindia @indiatvnews pic.twitter.com/q0x56aX3ig
— Manish Prasad (@manishindiatv) April 29, 2025
Also Read: సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నా, ఏకిపారేయ్యండి .. ప్రధాని మోదీ సంచలనం
గాయపడ్డ 10 మందిలో 9 మంది స్పెషల్ క్విక్ యాక్షన్ టీమ్కు చెందిన వారిగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వాహనం బోల్తా పడిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి పరుగులు తీశారు. గాయపడ్డ వారిని బయటకు తీసుకురావటానికి సాయం చేశారు. వారిని మొదటగా ఖాన్సాహిబ్లోని సబ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అయితే, గాయాలు తీవ్రంగా ఉండటంతో వారిని శ్రీనగర్లోని 92 బేస్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడ వారికి ప్రత్యేక చికిత్స అందుతోంది.
Also Read: పాకిస్థాన్కు షాక్.. ఇజ్రాయెల్ సాయంతో భారత్ సరికొత్త ప్లాన్ !
(Jammu and Kashmir | crpf-constable | vehicle | road-accident | indian-army | latest-telugu-news)