/rtv/media/media_files/2025/04/30/5yukyrDq10HN05r5bqY4.jpg)
Pak Army Chief Asif Munir, Terrorists
ఇంత జరిగినా పాకిస్తాన్ కు ఇంకా బుద్ధి రాలదు. ఒకవైపు యుద్ధం ఆపించాలంటూ పాక్ ప్రధాని యూఎన్ దగ్గరకు పరుగులు పెడుతున్నారు. మరోవైపు ఆ దేశ ఆర్మీ ఛీఫ్ మాత్రం లష్కరే తోయిబా ఫ్రంట్ ఉగ్రవాద సంస్థ రెసిస్టెన్స్ ఫోర్స్ తో కలిసి మరో ఉగ్రదాడికి కుట్ర పన్నుతున్నారు. అసీమ్ మునీర్ సూచనల మేరకు టీఆర్ఎఫ్ మరో ఉగ్రదాడికి రెడీ అయిందని భారత భద్రతా సంస్థలు చెబుతున్నాయి. అయితే పహల్గామ్ దాడి తర్వాత భారత నిఘా, భద్రతా సంస్థలు చాలా చురుగ్గా ఉన్నాయి. దాంతో పాటూ జమ్మూ, కాశ్మీర్ అంతా భద్రతా దళాలను మోహరించారు. సున్నితమైన ప్రాంతాల్లో క్విక్ రెస్పాన్స్ టీం ను ఏర్పాటు చేశారు. దీంతో ఈ సారి ఉగ్రవాదులు దాడులు చేయడం అంత ఈజీ ఏమీ కాదు.
పహల్గామ్ దాడి ముందు కూడా..
పహల్గామ్ లో లష్కరే తోయిబా ఫ్రంట్ టీఆర్ఎఫ్ దాడికి పాల్డడ్ానికి కూడా కారణం పాక్ ఆర్మీ ఛీప్ అసిఫ్ మునీరే. దాడికి ముందు ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లనే ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారని అందరికీ తెలిసన విషయమే. ఇప్పుడు కూడా మళ్ళీ అదే పని చేస్తున్నారు అసిమ్. ఇప్పుడు నిఘా సంస్థల హెచ్చరికతో కాశ్మీర్ లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈసారి దాడులు కాశ్మీరీ పండిట్లు లేదా వలస కార్మికులను టార్గెట్ గా చేసుకునే అవకాశం ఉందని నిఘా సంస్థలు చెబుతున్నాయి.
today-latest-news-in-telugu | pak army chief asim munir | terrorists | attack