Pakistan: పాకిస్థాన్ దొంగబుద్ధి.. భారత్‌పై సైబర్‌ దాడికి యత్నం..

పాకిస్థాన్‌ సైబర్ నేరగాళ్లు.. భారత సైబర్‌ నెట్‌వర్క్‌పై దాడి చేయడంలో విఫలమయ్యారు. ఇంటర్నెట్ ఆఫ్‌ ఖలీఫా (IOK) అనే గ్రూప్.. భారత ఆర్మీ వెబ్‌సైట్లను హ్యాక్‌ చేయాలని ప్రయత్నించింది. కానీ భారత సైబర్ సెక్యూరిటీ వాళ్ల ప్రయత్నాలను తిప్పికొట్టింది.

New Update

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పాకిస్థాన్‌ సైబర్ నేరగాళ్లు.. భారత సైబర్‌ నెట్‌వర్క్‌పై దాడి చేయడంలో విఫలమయ్యారు.  ఇంటర్నెట్ ఆఫ్‌ ఖలీఫా (IOK) అనే గ్రూప్ ఈ సైబర్‌ దాడికి యత్నించింది. భారత ఆర్మీకి సంబంధించిన ఆర్మీ వెల్ఫేర్ హౌసింగ్ ఆర్గనైజేషన్ డేటాబేస్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్లేస్‌మెంట్ పోర్టల్‌, అలాగే పబ్లిక్ వెబ్‌సైట్లను హ్యాక్‌ చేయాలని ప్రయత్నించింది. కానీ భారత సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ పాక్‌ సైబర్‌ నేరగాళ్ల కుట్రను గుర్తించింది. వాళ్ల ప్రయత్నాలను తిప్పికొట్టింది. 

Also Read: యుద్ధానికి సిద్ధం !.. 40 లక్షల రిటైర్ట్‌ సైనికులను పిలిస్తున్న పాక్ ఆర్మీ

ఇదిలాఉండగా ఉగ్రదాడి అనంతరం పాక్‌ తన వక్రబుద్ధిని చూపించింది. ఎల్‌ఓసీ వెంబడి కాల్పుల విరమణను ఉల్లంఘించి.. ఏప్రిల్ 25, 26 తేదీల్లో కాల్పులకు పాల్పడింది. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు పాక్‌ కాల్పులను తిప్పికొట్టాయి.  ఆ తర్వాత  ఏప్రిల్ 28-29న రాత్రి ఎల్‌ఓసీ వెంట అక్నూర్ సెక్టార్‌లో కూడా పాకిస్థాన్‌ కాల్పులకు దిగింది. ఈ ప్రయత్నాలు కూడా ఇండియన్ ఆర్మీ ముందు బెడిసికొట్టాయి. 

Also Read: ఇంకా దిగజారకు.. పాక్‌ మాజీ కెప్టెన్‌‌కి ధావన్ దిమ్మతిరిగే కౌంటర్!

పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య హై టెన్షన్ వాతావరణం నెలకొంది.  ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం వరుసగా భేటీలు నిర్వహిస్తోంది. అయితే తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బుధవారం క్యాబినెట్ కమిటీ ఆన్‌ సెక్యూరిటీ (CCS) సమావేశం కానుంది. దీనికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించనున్నారు. ఈ భేటిలో దేశ భద్రతపై ప్రధాని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఇప్పటికే ఓసారి ఈ కమిటీ భేటీ అయిన సంగతి తెలిసిందే. 

Also Read: పాక్ జర్నలిస్టులకు షాక్ ఇచ్చిన భారత్.. కేంద్రం సంచలన నిర్ణయం

 

telugu-news | rtv-news | india pakistan war 2025 | hacking

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు