Pakistan Zindabad : పాకిస్థాన్ జిందాబాద్ అన్నాడని కొట్టి చంపేశారు.. ఎక్కడంటే?

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తరువాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వ్యక్తిని కొంతమంది కొట్టి చంపేశారు. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటుచేసుకుంది.

author-image
By Krishna
New Update
attack Karnataka

attack Karnataka

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తరువాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వ్యక్తిని కొంతమంది కొట్టి చంపేశారు. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటుచేసుకుంది. 2025 ఏప్రిల్ 27న కుడుపు ప్రాంతంలోని భత్రా కల్లుర్తి ఆలయం సమీపంలో స్థానిక క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఓ వ్యక్తి పాక్ కు మద్దతుగా స్లోగన్స్ చేశారు. ఆగ్రహంతో మిగతావారు అతడిని కొట్టి చంపేశారు.

15 మంది అరెస్ట్

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న  పోలీసులు 15 మందిని అరెస్ట్ చేశారు. అయితే బాధితుడు ఎవరనే దానిపై విచారణ చేపడుతున్నామని కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హింస ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పది జట్లు, 100 మందికి పైగా ఆటగాళ్లు పాల్గొన్న క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా ఈ సంఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం ముందుగా బాధితుడికి, సచిన్ అనే వ్యక్తికి మధ్య గొడవ జరిగిందని.. అనంతరం అది సామూహిక దాడిగా మారిందని తెలిపారు.  

కాగా పహల్గామ్ ఉగ్రవాద దాడికి నిరసనగా రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శనలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశాడనే ఆరోపణలతో బీహార్‌లోని ఒక సీపీఐ నాయకుడిని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు