/rtv/media/media_files/2025/04/29/931PJJU03FCb61H2Z9m2.jpg)
Pahalgam Terror Attack
Pahalgam Terror Attack : పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించి మరో వీడియో బయటకు వచ్చింది. ఏప్రిల్ 22న ఉగ్రవాదులు దాడి చేసిన రోజు గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన పర్యాటకుడు రిషిభట్ పహల్గామ్లోని ప్రసిద్ధ బైసరన్ వ్యాలీని సందర్శించాడు. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, థ్రిల్ కోసం జిప్లైన్ రైడ్ చేశాడు. ఈ సమయంలో గాల్లో వేగంగా ప్రయాణిస్తూ, తన అనుభూతిని సెల్ఫీ వీడియో రూపంలో చిత్రీకరించుకున్నాడు. తాను కేరింతలు కొడుతూ రైడ్ను ఆస్వాదిస్తున్న దృశ్యాలను రికార్డు చేస్తుండగా, అదే సమయంలో దిగువ ప్రాంతంలో ఉగ్రదాడి జరిగింది.
Also Read: వాడో జోకర్.. మోదీజీ పాకిస్తాన్ను FATF బ్లాక్లిస్ట్లో చేర్చండి: అసదుద్దీన్ ఒవైసీ
Pahalgam Terror Attack 2025
పర్యాటకుడు రిషి భట్ జిప్ లైన్ పై వేలాడుతూ తీసుకున్న వీడియోలో.. బైసరన్ లోయను ఉగ్రవాదులు తమ ఆధీనంలోకి తీసుకుంటున్న విజువల్స్ ను అందులో చూపించాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ఉగ్రవాదులు అమాయక ప్రజలపై కాల్పులు జరిపిన సమయంలో తాను జిప్ లైన్లో ఉన్నానని తెలిపాడు.. ఆ వీడియోలో, నా వెనుక ఉన్న ఒక వ్యక్తి ‘అల్లాహు అక్బర్’ అని అరుస్తున్నట్లు మీరు చూడవచ్చు.. ఆ వెంటనే కాల్పులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నాడు.
Also Read: భారత్, పాక్ మధ్య అణు యుద్ధం.. ఎవరి బలం ఎంత?
అయితే, తాను జిప్లైన్లోకి రాకముందే, తన భార్య, కొడుకు, మరో నలుగురు ముందుకు వెళ్లిపోయారు.. అప్పుడు నా భార్య పక్కనే మరో రెండు జంటలు ఉండే.. ఓ ఉగ్రవాది వచ్చి, వారి పేర్లు, మతం అడిగి, ఆ తర్వాత వారిపై కాల్పులు జరిపాడు.. నేను రోప్వేలో ఉన్నందున, నా ప్రాణాలు రక్షించుకోగలిగాను.. నేను నా భార్యతో ఉండి ఉంటే ఇప్పటికే చనిపోయి ఉండే వాడినని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ టెర్రరిస్టు అక్కడ నుంచి వెళ్లిపోయిన వెంటనే.. నేను నా జిప్లైన్ తాడును ఆపి, దాదాపు 15 అడుగుల ఎత్తు నుంచి క్రిందికి దూకి, నా భార్య- కొడుకుతో అక్కడ నుంచి పారిపోయాను అని టూరిస్టు రిషి భట్ తెలిపాడు. అప్పుడు, నేను నా కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడుకోవడం గురించి మాత్రమే ఆలోచించానని పేర్కొన్నారు. ఆ కాల్పుల తర్వాత ఉగ్రవాదులు అడవిలోకి పారిపోయారని వెల్లడించాడు.
Also Read: Dhanush 56: పుర్రెతో ధనుష్ కొత్త సినిమా పోస్టర్.. నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ అదే డైరెక్టర్ తో
ఇదిలా ఉండగా, ఈ ఘటనకు ముందు జిప్లైన్ ఆపరేటర్ వ్యవహార శైలిపై కూడా అతను అనుమానాలు వ్యక్తం చేశాడు. జిప్ లైన్ ఆపరేటర్ అల్లాహు అక్బర్ అని మూడు సార్లు అరిచాడని, ఆ తర్వాత వెంటనే ఉగ్రవాదులు కాల్పులు జరపడం ప్రారంభించారని చెప్పాడు. ఒకవైపు కాల్పులు జరుగుతున్నా జిప్లైన్ ఆపరేటర్ పర్యాటకులు వారించే ప్రయత్నం చేయకపోవడం పట్ల అనుమానం వ్యక్తం చేశాడు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై ఎన్ఐఏ ఇప్పటికే విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో జిప్లైన్ ఆపరేటర్కు సైతం ఎన్ఐఏ నోటీసులు జారీ చేసింది.
Also Read: ఇండియాతో యుద్ధం వద్దు.. పాక్ మాజీ ప్రధాని కీలక సూచనలు
nia | breaking news pahalgam | attack in Pahalgam