Central cabinet Meeting: పహల్గాం ఉగ్రదాడి ప్రస్తావన లేకుండానే కేంద్ర కేబినెట్ మీటింగ్
బుధవారం ఉదయం కేంద్ర కేబినెట్ జరిగిన సంగతి తెలిసిందే. రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణన్ ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు. పూర్తి సమాచారం కోసం టైటిల్పై క్లిక్ చేయండి.
బుధవారం ఉదయం కేంద్ర కేబినెట్ జరిగిన సంగతి తెలిసిందే. రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణన్ ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు. '' రైతుల కోసం ప్రధాని మోదీ అనేక పథకాలు తీసుకొచ్చారు.చెరకు మద్దతు ధర క్వింటాల్కు రూ.355గా నిర్ణయించాం. రూ.22,800 కోట్లతో మిజోరం, త్రిపుర, మణిపూర్ అనుసంధానం చేస్తూ 4 లైన్ల జాతీయ రహదారి నిర్మాణం కానుంది. అసోం-మేఘాలయ మధ్య హైవే నిర్మించాలని నిర్ణయించామని'' అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అలాగే వచ్చే జనాభా లెక్కల్లో కులగణన చేపట్టాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
కేంద్ర కేబినెట్ మీటింగ్ తర్వాత అశ్విని వైష్ణవ్ ప్రెస్మీట్పై అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఆయన పాక్పై దాడికి సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని చెబుతారని ఆశించారు. కానీ అశ్వినీ వైష్ణన్ ఆచితూచి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. భారత్-పాక్ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మొత్తానికి పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి ఎలాంటి ప్రస్తావనా లేకుండానే కేబినెట్ మీటింగ్ జరిగినట్లు తెలుస్తోంది.
నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ (NSA) బోర్డును పునరుద్ధరించింది. RAW (రీసెర్చ్ అండ్ అనలైసిస్ వింగ్) మాజీ చీఫ్ అలోక్ జోషీని ఛైర్మన్గా నియమించింది. అలాగే ఈ బోర్డులో మాజీ ఎయిర్ కమాండర్ పీఎం సిన్హా, మాజీ ఆర్మీ కమాండర్ ఏకే సింగ్, నేవీ అడ్మిరల్ ఆఫీసర్ మాంటీ ఖన్నా, రిటైర్డ్ IPSలు రాజీవ్ రంజన్, మన్మోహన్ సింగ్, రిటైర్డ్ IFS బి.వెంకటేశ్ సభ్యులుగా ఉన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీన్నిబట్టి చూస్తే.. భారత్ ఏ క్షణమైనా పాకిస్థాన్పై ప్రతీకార చర్యలకు దిగనున్నట్లు తెలుస్తోంది.
Central cabinet Meeting: పహల్గాం ఉగ్రదాడి ప్రస్తావన లేకుండానే కేంద్ర కేబినెట్ మీటింగ్
బుధవారం ఉదయం కేంద్ర కేబినెట్ జరిగిన సంగతి తెలిసిందే. రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణన్ ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు. పూర్తి సమాచారం కోసం టైటిల్పై క్లిక్ చేయండి.
బుధవారం ఉదయం కేంద్ర కేబినెట్ జరిగిన సంగతి తెలిసిందే. రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణన్ ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు. '' రైతుల కోసం ప్రధాని మోదీ అనేక పథకాలు తీసుకొచ్చారు.చెరకు మద్దతు ధర క్వింటాల్కు రూ.355గా నిర్ణయించాం. రూ.22,800 కోట్లతో మిజోరం, త్రిపుర, మణిపూర్ అనుసంధానం చేస్తూ 4 లైన్ల జాతీయ రహదారి నిర్మాణం కానుంది. అసోం-మేఘాలయ మధ్య హైవే నిర్మించాలని నిర్ణయించామని'' అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అలాగే వచ్చే జనాభా లెక్కల్లో కులగణన చేపట్టాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
Also Read: 'పాకిస్తాన్ జిందాబాద్'...సీఎం సిద్ధరామయ్య సంచలన కామెంట్స్!
కేంద్ర కేబినెట్ మీటింగ్ తర్వాత అశ్విని వైష్ణవ్ ప్రెస్మీట్పై అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఆయన పాక్పై దాడికి సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని చెబుతారని ఆశించారు. కానీ అశ్వినీ వైష్ణన్ ఆచితూచి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. భారత్-పాక్ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మొత్తానికి పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి ఎలాంటి ప్రస్తావనా లేకుండానే కేబినెట్ మీటింగ్ జరిగినట్లు తెలుస్తోంది.
Also Read: బరితెగించిన పాక్.. పహల్గామ్ ప్రధాన నిందితుడికి ప్రభుత్వ బలగాలతో సెక్యూరిటీ!
నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ (NSA) బోర్డును పునరుద్ధరించింది. RAW (రీసెర్చ్ అండ్ అనలైసిస్ వింగ్) మాజీ చీఫ్ అలోక్ జోషీని ఛైర్మన్గా నియమించింది. అలాగే ఈ బోర్డులో మాజీ ఎయిర్ కమాండర్ పీఎం సిన్హా, మాజీ ఆర్మీ కమాండర్ ఏకే సింగ్, నేవీ అడ్మిరల్ ఆఫీసర్ మాంటీ ఖన్నా, రిటైర్డ్ IPSలు రాజీవ్ రంజన్, మన్మోహన్ సింగ్, రిటైర్డ్ IFS బి.వెంకటేశ్ సభ్యులుగా ఉన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీన్నిబట్టి చూస్తే.. భారత్ ఏ క్షణమైనా పాకిస్థాన్పై ప్రతీకార చర్యలకు దిగనున్నట్లు తెలుస్తోంది.
Also Read: పాక్కు భారత్ మరో ఊహించని షాక్.. అప్పు ఇవ్వొద్దని IMFకు కంప్లైంట్!
telugu-news | rtv-news | cabinet-meeting | national-news