/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Indian-Border-jpg.webp)
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నుంచి సరిహద్దుల్లో అలజడి కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాల మధ్యా ఉద్రిక్తతల నడుమ పాక్ ఆర్మ దుందుడుకు చర్యలు చేపడుతోంది. దాడి జరిగిన దగ్గర నుంచి ఎల్వోసీ దగ్గర వరుసగా కాల్పులు జరుపుతూనే ఉంది. వరుసగా ఆరో రోజు కూడా ఫైరింగ్ చేసింది పాక్ ఆర్మీ. జమ్మూ, కాశ్మీర్ నాలుగు సరిహద్దు జిల్లాల్లో సలు సెక్టార్ల లో భారత సైన్యం మీదికి దాడి చేస్తూనే ఉంది. అయితే వీటిని భారత ఆర్మీ కూడా తిప్పి కొడుతోంది.
అర్ధరాత్రి కాల్పులు..
నిన్న అర్ధరాత్రి జమ్మూ జిల్లాలోని సరిహద్దు ప్రాంతమైన పరగ్వాల్ సెక్టార్ తో పాటూ రాజౌరీ జిల్లాలోని సుందర్బనీ, నౌషెరా సెక్టార్లలో పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. మరోవైపు బారాముల్లా, కుప్వారా జిల్లాల్లోనూ ఇవి జరిగాయి. గత ఐదు రోజులుగా పాక్ సైన్యం దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉంది.
సరిహద్దుల్లో పైన్యం కవ్విస్తూంటే..ఆ దేశ సమాచార మంత్రి అతుల్లా తరార్ మాత్రం నీతి సూత్రాలు చెప్పారు. భారత్ నిష్పాక్షిక దర్యాప్తు చేయకుండా యుద్ధానికి కాలు దువ్వుతోందని ఆయన ఆరోపించారు. ఇది ఇరు దేశాల శాంతిని భగ్నం చేస్తుందని నీతి వాక్యాలు పలికారు. పహల్గామ్ దాడిపై తమ ప్రభుత్వం అంతర్జాతీయ నిపుణులతో కూడిన దర్యాప్తును ప్రతిపాదించిందని...దానిని భారత్ అంగీకరించలేదని చెప్పుకొచ్చారు. భారత్ కావాలనే యుద్ధాన్ని చేస్తోందని అతుల్లా తరార్ విమర్శించారు.
today-latest-news-in-telugu | india | PAK Army | border | firing
Also Read: CJI: సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ గా బి. ఆర్ . గవాయి