/rtv/media/media_files/2025/04/30/I2g6ocOTex4S5HCfoSB0.jpg)
Indian Army at Terror Attack Site
పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఉగ్రదాడికి సంబంధించిన వీడియోను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు గతంలో పాకిస్థాన్ ఉగ్రవాదులు భారత్లో దాడులు చేసిన దృశ్యాలను కూడా బయటపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. పాకిస్థాన్ చేస్తున్న ఘోరాలను ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశంతోనే కేంద్రం.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: పాక్కు భారత్ మరో ఊహించని షాక్.. అప్పు ఇవ్వొద్దని IMFకు కంప్లైంట్!
ఇదిలాఉండగా మంగళవారం సాయంత్రం ప్రధాని మోదీ నివాసంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డొభాల్, త్రివిధ దళాల అధిపతులు సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గాం దాడికి ధీటైన జవాబు ఇస్తామన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేస్తామన్నారు. ఈ విషయంలో త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామన్నారు. దాడికి సమయం, తేదీని సైన్యమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. సైన్యంపై తనకు పూర్తిగా నమ్మకం ఉందని స్పష్టం చేశారు.
Also Read: మనకు అణ్వాయుధాలున్నాయి..మనల్నేం చేయలేరు....మరియం నవాజ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
ఇక దేశ భద్రతపై అత్యున్నత నిర్ణయాలు తీసుకొనే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ బుధవారం రెండోసారి సమావేశమయ్యింది. ఆ తర్వాత రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCPA) సమావేశం జరిగింది. బుధవారం సాయంత్రం క్యాబినెట్ సమావేశం కూడా నిర్వహించనున్నారు.
Also Read: పహల్గామ్ దాడికి ముందు సోషల్ మీడియాలో ఉగ్రవాదుల పోస్ట్ లు...తుపాకీ కావాలంటూ..
telugu-news | rtv-news | national-news