పహల్గామ్లోని బైసరన్ లోయలో అమాయక పర్యాటకులను ఊచకోత ప్రతి ఒక్క భారతీయుడిని ఉలిక్కిపడేలా చేసింది. అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధం లాంటి వాతావరణం నెలకొంది. ఈ ఉగ్రదాడికి పాల్పడిన దోషులకు ఖచ్చితంగా శిక్ష పడుతుందని, బాధితులకు న్యాయం జరుగుతుందని దేశ ప్రధాని మోదీ ప్రకటించారు. ఇదిలావుంటే జమ్మూ కశ్మీర్కు చెందిన ఏకైక ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మెహ్రాజ్ మాలిక్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. వ్యవస్థను మెరుగుపరచడానికి లష్కర్ అవసరమని చెబుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వ్యవస్థను మెరుగుపరచడానికి ఒక శక్తి ఉండటం చాలా ముఖ్యమని ఆయన అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన దోడా ఎమ్మెల్యే మెహ్రాజ్ చేసిన ఈ ప్రకటన వివాదాన్ని సృష్టించింది.
AAP MLA : వ్యవస్థను మెరుగుపరచడానికి లష్కర్ అవసరం... ఆప్ ఎమ్మెల్యే కీలక కామెంట్స్!
జమ్మూ కశ్మీర్కు చెందిన ఏకైక ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మెహ్రాజ్ మాలిక్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. వ్యవస్థను మెరుగుపరచడానికి లష్కర్ అవసరమని చెబుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
New Update
తాజా కథనాలు