భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్పై భారత్ ఒత్తిడి పెంచుతోంది. దీంతో ఇరు దేశాల మధ్య టెన్షన్ వాతావరణం ఉంది. అయితే పాకిస్థాన్లో ఉన్న అణుస్థావరాలే లక్ష్యంగా భారత్ వ్యూహాలు రచిస్తోంది. ఇజ్రాయెల్ టెక్నాలజీ సాయంతో ఆ దేశంలో న్యూక్లియర్ స్థావరాలను గుర్తించినట్లు తెలుస్తోంది. కరాచీ, చస్మా, లాహోర్, సర్గోదా, రావల్పిండిలో పాక్ న్యూక్లియర్ స్థావరాలు గుర్తించినట్లు సమాచారం.
Also Read: పాకిస్థాన్ దొంగబుద్ధి.. భారత్పై సైబర్ దాడికి యత్నం..
పాకిస్థాన్ ఏ మాత్రం తోక జాడించిన న్యూక్లియర్ బేస్పై ఇండియన్ ఆర్మీ దాడి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇండియాకు టెక్నాలజీ విషయంలో ఇజ్రాయెల్ పూర్తి మద్దతిస్తోంది. పాకిస్థాన్ నుంచి మిస్సైల్ దాడి చేసినా కూడా వాటిని తట్టుకునేలా ఇండియాకు డోమ్ సిస్టమ్ అందించనున్నట్లు సమాచారం.
Also Read: పాకిస్థాన్ జిందాబాద్ అన్నాడని కొట్టి చంపేశారు.. ఎక్కడంటే?
ఇదిలాఉండగా ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశ భద్రతపై క్యాబినెట్ కమిటీ ఏడు రోజుల్లో రెండవసారి సమావేశం కావడం విశేషం. పాకిస్థాన్పై చర్యలు తీసుకునేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేదానిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
Also Read: ప్రైవేట్ స్కూల్స్లో ఫీజుల దోపిడీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం