BIG BREAKING: ఏపీలో ఎన్ కౌంటర్.. హోరాహోరీగా కాల్పులు!

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా ఏజెన్సీలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈక్రమంలో కాకులమామిడి, కంటారం దగ్గర పోలీసులకు తారపడిన మావోయిస్టులు కాల్పులు జరిపారు.

New Update
Encounter in AP

Encounter in AP

BIG BREAKING:  ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా ఏజెన్సీలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో ఏజెన్సీలో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈక్రమంలో కాకులమామిడి, కంటారం దగ్గర పోలీసులకు తారపడిన మావోయిస్టులు కాల్పులు జరిపారు.  ప్రతిగా భద్రతా బలగాలు కూడా కాల్పులు జరపడంతో వారు అక్కడి నుంచి తప్పించుకున్నారు. దీంతో మావోయిస్టుల కోసం జల్లడపడు తున్నారు. కాకుల మామిడి, కంటారం వంటి రెండు ప్రాంతాల్లో ఈ ఎదురుకాల్పులు జరిగ్గా.. మావోయిస్టు నేతలు బలగాల నుంచి తృటిలో తప్పించుకొని పారిపోయినట్లు సమాచారం అందుతుంది. దీంతో బలగాలు మావోయిస్టుల కోసం అడవిని జల్లెడ పడుతున్నారు. 

ఇది కూడా చూడండి: Russia: రష్యా సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ ప్రకటన

మరోవైపు ఛ‌త్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య సోమవారం సాయంత్రం ఎదురు కాల్పులు జరిగాయి. గత వారం రోజులుగా తెలంగాణ- ఛ‌త్తీస్‌గఢ్ సరిహద్దుల్లో వేల సంఖ్యలో భద్రతా దళాలు మావోయిస్టుల కోసం కూంబింగ్‌ ఆపరేషన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఛ‌త్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా నడిపల్లి-గల్గామ్ గ్రామాల మధ్య గల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడి జవాన్లపై కాల్పులు జ‌రిపారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులకు దిగారు. కాగా, భ‌ద్రతా బ‌ల‌గాలు వారం రోజులుగా కర్రెగుట్టలను జల్లెడ పడుతున్నాయి. ఐదు రోజుల క్రితం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు హ‌త‌మయ్యారు.

ఇది కూడా చూడండి:Waqf Board Assets: వక్ఫ్‌ ఆస్తులు ఆ రాష్ట్రంలోనే ఎక్కువ.. కేంద్రం కీలక ప్రకటన

కాగా మావోయిస్టు అగ్ర నేతలు ఉన్నారనే పక్కా సమాచారంతో ఆపరేషన్ కగార్  చేపట్టిన బలగాలకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. తీవ్ర ఎండతాపం కారణంగా బలగాలు ముందుకు కదలలేక పోతున్నట్లు తెలుస్తుంది. అలాగే అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ట్రాప్‌లను, ఐఈడీ బాంబులను ఏర్పాటు చేశారు. దీంతో వాటిని గుర్తించి నిర్వీర్యం చేసుకుంటూ బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఇప్పటి వరకు 130కి పైగా ఐఈడీ బాంబులను బలగాలు గుర్తించి నిర్వీర్యం చేశారు.

ఇది కూడా చూడండి: Pak-India:భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నక్సలైట్ల ను పూర్తిగా అంతమొందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఈ మేరకు డెడ్ లైన్ పెట్టుకొని మరి నక్సలైట్లపై ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్ కాగర్ పేరుతో కర్రె గుట్టలను చుట్టుముట్టిన భద్రతా దళాలు. మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు. ఎనిమిది రోజులుగా కర్రె గుట్టల్లో ఈ ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ప్రస్తుతం భద్రతా బలగాలు పూజారి కాంకేర్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 25 వేల మంది భద్రతా బలగాలను కేంద్రం మోహరించి ఈ గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే కూంబింగ్ లో భాగంగా ఈ రోజు ఉదయం.. అల్లూరి ఏజెన్సీలో పోలీసులకు మవోయిస్టులు కంట పడ్డారు. దీంతో అప్రమత్తమైన బలగాలు.. వారిపై కాల్పులు జరిపగా.. మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
 ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం ఉగ్రదాడిలో కీలక పరిణామం..జిప్ లైన్ ఆఫరేటర్ పై ఎన్ఐఏ ఫోకస్

Advertisment
Advertisment
తాజా కథనాలు