🔴Live Breakings: కొత్త పార్టీ పెడుతున్నా.. జాగృతి నేతలతో కవిత సంచలన భేటీ!

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
LIVE BREAKING

LIVE BREAKING

Covid Cases: ఏపీలో మరో మూడు కరోనా కేసులు..ఒకరి పరిస్థితి విషమం

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకూ ఎక్కువ అవుతున్నాయి. తాజాగా ఆంధ్రాలో మరో మూడు కరోనా కేసులు నమొదయ్యాయి. ఏలూరులో ఇద్దరు, తెనాలిలో ఒకరికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. 

ఏపీలో కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే రెండు కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో మూడు కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఏలూరుకు చెందిన ఇద్దరు భార్యాభర్తలకు, తెనాలిలో ఓ 83 ఏళ్ళ వృద్ధుడికి కరోనా సోకింది. ఇందులో వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉంది. అంతకు ముందు కడపలో ఇద్దరికి, వైజాగ్ లో మరొకరికి కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. 

Also Read : Spirit Movie: దీపికా ఔట్.. యానిమల్ బ్యూటీ ఇన్.. ప్రభాస్‌తో రొమాన్స్‌కి బోల్డ్ బ్యూటీ

Also Read :  BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే

భయపడాల్సిన అవసరం లేదు..

మళ్లీ కరోనా మరణాలు మొదలయ్యాయి. కరోనాతో ఇప్పటివరకు ఏడుగురు మృతిచెందినట్లు ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్‌ కేసులు ఇప్పటికే వెయ్యి దాటాయి. దేశ రాజధానిలో కరోనా కేసుల సంఖ్య వందకు చేరింది. అదే సమయంలో తెలుగు రాష్ర్టాల్లో ముగ్గురికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. అయితే దేశవ్యాప్తంగా కరోనా కేసులు పుంజుకుంటున్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక దేశ రాజధాని ఢిల్లీని కరోనా వణికిస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ వందమందికి పైగా వైరస్‌ బాధితులను ఇంట్లో క్వారంటైన్‌ చేసినట్లు వైద్యులు వెల్లడించారు.-- కేరళ, మహారాష్ట్రలో కరోనా డేంజర్ బెల్స్‌మోగిస్తోంది. ఇక్కడ 430 కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్య, ఆరోగ్య శాఖాధికారులు అప్రమత్తమయ్యారు. దానితో పాటు మహారాష్ర్టలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి.209 యాక్టివ్ కేసులు ఆ రాష్ట్రంలో నమోదయ్యాయి. వీటితో పాటు ఢిల్లీ 104, గుజరాత్‌లో 83,  ఉత్తరప్రదేశ్ లో 15, పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 12 కేసులు, కర్ణాటకలో 57 మందికి పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

Also Read : Pawan : మీకో దండంరా బాబు.. టాలీవుడ్ పై పవన్ ఫైర్!

Also Read : Cinema News: పవన్‌పై కుట్రతోనే థియేటర్ల మూసివేత.. ఆ నలుగురే ఇదంతా చేస్తున్నారా!?

 

Live Breakings

  • May 27, 2025 21:55 IST

    AP High Court Recruitment 2025: ఏడవ తరగతి అర్హతతో ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి!

    ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకై ఏపీ సర్కార్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 1620 పోస్టులను భర్తీ చేయనున్నారు. మే 13 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. జూన్ 2 వరకు అప్లై చేసుకోవచ్చు.

    AP High Court Recruitment 2025
    AP High Court Recruitment 2025

     



  • May 27, 2025 21:54 IST

    LSG Vs RCB: ఉతికారేసిన పంత్.. ఆర్సీబీ ముందు 228 టార్గెట్

    ఆర్సీబీతో మ్యాచ్‌లో లక్నో జట్టు భారీ స్కోర్ చేసింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ఆర్సీబీ ముందు 228 భారీ టార్గెట్ ఉంది. కెప్టెన్ రిషబ్ పంత్ చెలరేగిపోయాడు. సెంచరీతో విజృంభించాడు. 118 స్కోర్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.

    Lucknow against RCB



  • May 27, 2025 20:11 IST

    BIG BREAKING: 'జూన్ 2న కవిత కొత్త పార్టీ.. ఆ తర్వాత పాదయాత్ర'

    జూన్ 2న కవిత కొత్త పార్టీ ప్రకటించే అవకాశం ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఈ మేరకు తనకు సమాచారం ఉందన్నారు. బీసీ బిడ్డ ఈటెల రాజేందర్ ను అర్ధరాత్రి బయటకు గెంటేస్తే బీసీల హక్కులు ఎందుకు గుర్తు రాలేదని కవితపై ఫైర్ అయ్యారు రఘునందన్. 

    Kavitha
    Kavitha

     



  • May 27, 2025 20:10 IST

    BIG BREAKING: కాళేశ్వరం కమిషన్ విచారణకు KCR

    కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతారని తెలిపారు. ఈ అంశంపై ఇప్పటికే న్యాయనిపుణులతో ఆయన చర్చించినట్లు సమాచారం. జూన్ 5న విచారణకు రావాలని కాళేశ్వరంపై కేసీఆర్‌కు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. తొలిసారి ఆయన పీసీ ఘోష్ కమిషన్ ముందుకు వెళ్లనున్నారు.

    KCR
    KCR

     



  • May 27, 2025 20:09 IST

    Ap Crime News: చిటికెలో మోసం.. పెళ్లి కొడుకు బైక్‌పై వెళ్లి - ప్రియుడితో లేచిపోయిన పెళ్లికూతురు!

    ఏపీలోని సత్యసాయి జిల్లా ధర్మవరం టౌన్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. పెళ్లైన మరుసటి రోజే పెళ్లికూతురు తన ప్రియుడితో పారిపోయింది. దాదాపు 50 గ్రాముల బంగారు ఆభరణాలు, పెళ్ళికొడుకు మొబైల్‌తో జంప్ అయిపోయింది. ఈ ఘటనతో సత్యసాయి జిల్లా హాట్ టాపిగా మారింది.

    bride ran away with her boyfriend day after her wedding
    bride ran away with her boyfriend day after her wedding Photograph: (bride ran away with her boyfriend day after her wedding)

     



  • May 27, 2025 12:59 IST

    జార్ఖండ్‌లో మరో ఎన్‌కౌంటర్‌.. దళ కమాండర్‌ మృతి

    జార్ఖండ్‌లో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు దళ కమాండర్‌ తులసి భూనియన్‌ మృతిచెందారు. ఈ క్రమంలో నితేశ్‌ యాదవ్‌ అనే మావోయిస్టు గాయపడ్డారని, అతనిపై రూ.15 లక్ష రివార్డు ఉందని అధికారులు చెప్పారు.

    Encounter
    Encounter

     



  • May 27, 2025 12:59 IST

    కొత్త పార్టీ పెడుతున్నా.. జాగృతి నేతలతో కవిత సంచలన భేటీ!

    కొత్త పార్టీ వార్తల నేపథ్యంలో.. MLC కవిత ఈ రోజు సింగరేణి ప్రాంత తెలంగాణ జాగృతి నేతలతో సమావేశం అయ్యారు. తన లేఖ బయటకు రావడంతో పాటు ప్రస్తుత పరిస్థితులపై కవిత వారితో చర్చిస్తున్నారు. కొత్త పార్టీపై వారి అభిప్రాయాలను కవిత తెలుసుకుంటారన్న చర్చ సాగుతోంది.

    MLC Kavitha New Party News
    MLC Kavitha New Party News

     



  • May 27, 2025 12:25 IST

    మేడిగడ్డ బ్యారేజీ లో బిగ్‌ ట్విస్ట్‌.. NDSA రిపోర్టుపై L&T సంచలన లేఖ

    మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బ్యారేజీ నాణ్యతపై రిపోర్టు ఇచ్చిన నేషనల్ డమ్ సేఫ్టీ అథారిటీ (NDSA)కి నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ సంచలన లేఖ రాసింది. మేడిగడ్డపై ఆ సంస్థ ఇచ్చిన నివేదికను పూర్తిగా తిరస్కరిస్తున్నామని స్పష్టం చేసింది.

     Medigadda Barriage
    Medigadda Barriage

     



  • May 27, 2025 12:24 IST

    దేశానికి ద్రోహం చేసిన జవాన్.. పహల్గాం దాడికి పాక్‌తో కలిసి స్కెచ్.. షాకింగ్ నిజాలు!

    సీఆర్పీఎఫ్ జవాన్ మోతీ రామ్ 2023 నుంచి సున్నితమైన సమాచారాన్ని పాక్‌కు లీక్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పహల్గాం ఉగ్రదాడికి ముందు మోతీ రామ్ అక్కడే విధులు నిర్వర్తించాడు. సరిగ్గా వారం రోజుల తర్వాత దాడి జరుగుతుందంటే బదిలీ అయినట్లు దర్యాప్తులో తేలింది.

    NIA court
    NIA court

     

     



  • May 27, 2025 12:23 IST

    నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు.. వెంటాడుతున్న కరోనా భయం?

    ఈరోజు స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. ఉదయం ప్రారంభం నుంచే సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల భయం స్టాక్ మార్కెట్ ను కూడా ప్రభావితం చేస్తోంది.  సెన్సెక్స్‌ 750 పాయింట్లు,నిఫ్టీ 183 పాయింట్ల నష్టంతో 24,818 వద్ద ఉన్నాయి.

    business
    Stock Market On Monday

     



  • May 27, 2025 11:51 IST

    గోంగూర చికెన్, దోసకాయ మటన్.. మహానాడులో మైమరపించే వంటకాలు.. ఫుల్ మెనూ ఇదే!

    మహానాడు కోసం టీడీపీ వెజ్, నాన్‌వెజ్‌ వంటకాలతో మెనూను సిద్ధం చేసింది. మూడు రోజుల పాటూ భోజనాల్లో 20 రకాల వంటకాలకు రెడీ చేస్తున్నారు. తాపేశ్వరం కాజా, గోంగూర చికెన్, వెజిటబుల్ బిర్యానీతో పాటు దోసకాయ మటన్, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ ప్రధాన మెనూగా ఉండనున్నాయి.

    TDP Mahanadu 2025



  • May 27, 2025 11:50 IST

    ప్రపంచ రికార్డు సృష్టించిన సూర్య కుమార్ యాదవ్

    ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డును సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో వ‌రుస‌గా 14 సార్లు 25 ప్లస్ స్కోర్ చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. గ‌తంలో ఈ రికార్డు ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు టెంబా బ‌వుమా పేరు మీద ఉండేది.

    Surya Kumar Yadav
    Surya Kumar Yadav

     



  • May 27, 2025 11:49 IST

    Pinaka MK 3: భారత్ అమ్ముల పొదిలో మరో సూపర్ మిస్సైల్.. పరీక్షించనున్న డీఆర్డీవో

    భారత్ దగ్గర ఇప్పటికే శక్తివంతమై ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరో  ఆయుధాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇండియా పినాక ఎంకే 3 అనే పవర్ ఫుల్ రాకెట్ ను లాంఛ్ చేయనుంది. దీనిని తొందరలోనే డీఆర్డీవో పరీక్షించనుంది. 

    india
    PInaka MK 3

     



  • May 27, 2025 11:48 IST

    నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

    నైరుతి రుతుపవనాల కారణంగా ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. మూడు రోజుల పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.



  • May 27, 2025 11:02 IST

    ట్రంప్ పేరుతో మోసం.. కోట్లరూపాయలు యాప్ లో పెట్టుబడులు

    మోసం జరిగింది కర్ణాటకలో..కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరుతో. కర్ణాటకలో హవేరీలో ట్రంప్ యాప్ పేరుతో కోట్లాది రూపాయలకు టోకరా వేశారు. తరువాత ఆ భారీ మొత్తంతో పరారయ్యారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

    Pakistani Hackers Fail To Breach Indian Cyber Defences As LoC Tensions Escalate
    Pakistani Hackers Fail To Breach Indian Cyber Defences As LoC Tensions Escalate

     



  • May 27, 2025 11:00 IST

    మాజీ ఎమ్మెల్యే సోదరుడు టార్గెట్‌.. మావోయిస్టుల పేరుతో లేఖ..

    మేడ్చల్‌ జిల్లాలోని షాపూర్‌నగర్‌లో మావోయిస్టు పేరుతో బెదిరింపు లేఖ రావడం స్థానికంగా కలకలం సృష్టించింది. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌ సోదరుడి కుటుంబాన్ని బెదిరిస్తూ లేఖ రాశారు. రూ.50 లక్షలు ఇవ్వకపోతే కూన రాఘవేందర్‌ గౌడ్‌ను చంపుతామని పేర్కొన్నారు.

    Maoists Letter



  • May 27, 2025 10:36 IST

    ఆ దేశాల్లో భారీ భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు

    మయన్మార్, టిబెట్, పిలిప్పిన్స్‌లో మంగళవారం తెల్లవారు జామున భారీ భూకంపం సంభవించింది. మయన్మార్‌, టిబెల్‌లో 3.4, పిలిప్పిన్స్‌లో 5.1 తీవ్రతతో భూప్రకంపనాలు సృష్టించింది. దీంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.

    మెక్సికో భూప్రకంపనలు, రిక్టర్ స్కేలుపై 6.3తీవ్రత...!!

     

     

     



  • May 27, 2025 10:23 IST

    మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. జార్ఖండ్‌లో భీకర ఎన్‌కౌంటర్.. టాప్ కమాండర్ మృతి

    వరుస ఎన్‌కౌంటర్లతో అగ్ర నాయకులను కోల్పోతున్న మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగలింది. జార్ఖండ్‌ లోని లాటేహార్ జిల్లాలో మహుడనే పోలీస్ స్టేషన్ పరిధిలోని కరంఖర్, ధోవ్నా గ్రామాల మధ్య దట్టమైన అడవుల్లో మావోయిస్టు అగ్రనేత ఒకరు మృత్యువాతపడ్డారు.

    Naxali Commander Manish Yadav
    Naxali Commander Manish Yadav

     



  • May 27, 2025 10:23 IST

    ఛీ ఏం మనిషివిరా.. 16 ఏళ్ల బాలికను బలవంతంగా పెళ్లి చేసుకున్న 60 ఏళ్ల వ్యక్తి!

    60ఏళ్ల వ్యక్తి బలవంతంగా 16 ఏళ్ల అమ్మాయిని వివాహం చేసుకున్న ఘటన అనంతపురంలో జరిగింది. రామాజంనేయులు అనే వ్యక్తి మైనర్ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకుని కాపురానికి తీసుకెళ్లాడు. ఇష్టం లేని ఆ అమ్మాయి తప్పించుకుని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

     marriage
    marriage

     



  • May 27, 2025 09:48 IST

    ఒడ్డుకు కొట్టుకొస్తున్న కంటెయినర్లు.. కేరళ తీరం వెంబడి హై అలెర్ట్‌

    ఇటీవల ప్రమాదవశాత్తు కేరళ తీరానికి సమీపంలో నీట మునిగిన లైబీరియా ఓడ నుంచి ఇంకా ప్రమాదం పొంచే ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. నీటమునిగిన ఓడలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయన్న సమాచారంతో భారత తీరప్రాంత అధికారులు అప్రమత్తమయ్యారు.

    kollam customs Container
    kollam customs Container

     



  • May 27, 2025 09:47 IST

    పహల్గాంలో కేబినెట్ భేటీ.. అజెండా ఇదే..

    జమ్మూ, కాశ్మీర్  సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఈరోజు పహల్గాంలో కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఇక్కడ మొదటిసారిగా మంత్రి వర్గ సమావేశం జరుగుతోంది. ఉగ్రవాదం, హింసకు వ్యతిరేకంగా ఒక శక్తివంతమైన సందేశాన్ని ఇచ్చేందుకే మీటింగ్ అని తెలుస్తోంది. 

    omar abdullah
    omar abdullah

     



  • May 27, 2025 09:46 IST

    కోనేరు కోనప్ప యూటర్న్‌... కేసీఆర్‌ నా దేవుడు అంటూ..

    కాంగ్రెస్ వర్గ పోరు తట్టుకోలేక కొందరు నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప యూటర్న్ తీసుకున్నారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తాను కానీ కాంగ్రెస్ పార్టీలోకి మాత్రం వెళ్లనని చెప్పారు.

    Koneru Konappa
    Koneru Konappa

     



  • May 27, 2025 09:46 IST

    ఆ మూడింటిని భారత్ తో చర్చించేందుకు సిద్ధం.. పాక్ ప్రధాని

    పాడిన పాటే మళ్ళీ మళ్ళీ పాడుతున్నారు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. కాశ్మీర్, సింధు జలాలు, ఉగ్రవాదంపై భారత్ చర్చించేందుకు సిద్ధమని చెబుతున్నారు. ప్రస్తుతం ఇరాన్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడ మీడియా సమావేశంలో ఈ విషయాన్ని చెప్పారు. 

    pak
    Pakistan PM Shabaz Sharif

     



  • May 27, 2025 09:45 IST

    లవ్ బ్రేకప్‌తో డ్యాన్స్ మాస్టర్ ఆత్మహత్మ

    యూపీకి చెందిన వాసి సాగర్ మియాపూర్‌లోని డెలాయిట్ డ్యాన్స్ స్టూడియోలో మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. యజమాని పరమేశ్ స్టూడియోకు వెళ్లి చూడగా అక్కడే ఉరేసుకుని సాగర్ మృతి చెందాడు. గతంలో ఓ అమ్మాయిని ప్రేమించాడని విఫలమైన బాధలో చనిపోయినట్లు తెలుస్తోంది.

    Read More



  • May 27, 2025 09:44 IST

    లండన్, అమెరికా పర్యటనకు బయలుదేరిన KTR

    లండన్, అమెరికా పర్యటనకు BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR బయలుదేరారు. అమెరికాలో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబురాలతోపాటు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల్లో పాల్గొననున్న కేటీఆర్… అలాగే లండన్ లో జరిగే పలు కీలక కార్యక్రమాల్లో కూడా పాల్గొనున్నారు.

    KTR leaves for London and US tour



  • May 27, 2025 09:43 IST

    ఫుట్ బాల్ ప్రీమియర్ లీగ్ పరేడ్ లోకి దూసుకెళ్ళిన కారు..పలువురికి గాయాలు



  • May 27, 2025 09:43 IST

    గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్.. 54 మంది మృతి



  • May 27, 2025 09:43 IST

    రోడ్డు పక్కన పార్క్ చేసిన కారు...ఆ కారులో ఏడు మృతదేహాలు.. ఎవరివో తెలుసా?

    హర్యానాలోని పంచకులలో సంచలనం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన పార్క్ చేసిన కారులో ఏడు మృతదేహాలు లభించడం స్థానికంగా కలకలం సృష్టించింది. కాగా ఈ ఏడు మృతదేహాలు ప్రముఖ వ్యాపారి ప్రవీణ్‌ మిట్టల్‌ కుటుంబానికి చెందినవిగా పోలీసులు గుర్తించారు.

    crime news
    crime news

     



  • May 27, 2025 07:46 IST

    కాల్పులు వద్దు లొంగిపోతాం అంటున్న మావోయిస్టులు

    ఆపరేషన్ కగార్ దెబ్బ మావోయిస్టులు మీద చాలా గట్టిగానే పడింది. ఇప్పటికే చాలామందిని హతమార్చారు భద్రతా బలగాలు. అయితే ఇప్పటికే బలహీనంగా అయిపోయిన మావోయిస్టులు ఇక పోరాడలేమిన అంటున్నారు. కాల్పులు ఆపితే వచ్చి లొంగిపోతామని చెబుతున్నారని తెలుస్తోంది.

    Maoists
    Maoists

     



  • May 27, 2025 07:45 IST

    బైజూస్‌కి బిగ్ షాక్.. ప్లే స్టోర్ నుంచి తొలగింపు

     

    BYJU's
    BYJU's

     



  • May 27, 2025 07:40 IST

    మంచు విష్ణుకు షాక్‌... కన్నప్ప హార్డ్‌డ్రైవ్‌ మాయం

    ఓ వైపు కుటుంబ గొడవలు, మరోవైపు సినిమా విడుదల విషయంలో వరుస వివాదాలతో పరేషాన్‌ అవుతున్న మంచువిష్ణుకు మరో షాక్‌ తగిలింది. త్వరలోనే విడుదల కానున్న కన్నప్ప చిత్రానికి సంబంధించిన హార్డ్‌డ్రైవ్‌ మిస్‌ అయింది. ఈ మేరకు ఫిలింనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

    Kannappa Movie
    Kannappa Movie

     



  • May 27, 2025 07:39 IST

    బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

    బీఆర్ఎస్ నేత, వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్ లాల్ కన్నుమూశారు.  గుండెపోటుతో గచ్చిబౌలిలోని ఎఐజీ హాస్పిటల్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.  2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన మదన్ లాల్ అనంతరం బీఆర్ఎస్ లో చేరారు.

    Banoth Madanlal



  • May 27, 2025 07:39 IST

    ఏపీలో మరో మూడు కరోనా కేసులు..ఒకరి పరిస్థితి విషమం

    దేశంలో కరోనా కేసులు రోజు రోజుకూ ఎక్కువ అవుతున్నాయి. తాజాగా ఆంధ్రాలో మరో మూడు కరోనా కేసులు నమొదయ్యాయి. ఏలూరులో ఇద్దరు, తెనాలిలో ఒకరికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. 

    covid cases in india
    covid cases in india

     



  • May 27, 2025 07:38 IST

    మిస్ తెలుగు యూఎస్ఏ రన్నరప్ గా హైదరాబాద్ యువతి

    అమెరికా తెలుగు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మిస్‌ తెలుగు యూఎస్‌ఏ’ అందాల పోటీల్లో హైదరాబాద్ అమ్మాయి చూర్ణిక ప్రియా కొత్తపల్లి సత్తా చాటింది. ఈ పోటీల్లో రన్నరప్‌గా నిలిచిన చూర్ణిక, పీపుల్స్ ఛాయిస్ అవార్డును కూడా గెలుచుకుని రెండు కిరీటాలను సొంతం చేసుకుంది.

     Miss Telugu USA
    Miss Telugu USA

     



Advertisment
Advertisment
తాజా కథనాలు