Pinaka MK 3: భారత్ అమ్ముల పొదిలో మరో సూపర్ మిస్సైల్.. పరీక్షించనున్న డీఆర్డీవో

భారత్ దగ్గర ఇప్పటికే శక్తివంతమై ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరో  ఆయుధాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇండియా పినాక ఎంకే 3 అనే పవర్ ఫుల్ రాకెట్ ను లాంఛ్ చేయనుంది. దీనిని తొందరలోనే డీఆర్డీవో పరీక్షించనుంది. 

New Update
india

PInaka MK 3

తాజాగా జరిగిన ఆపరేషన్ సింధూర్ లో భారత్ తన శక్తి సామర్థ్యాలు ఏంటో ప్రపంచానికి చూపించింది. పాకిస్తాన్ లో ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు, తరువాత ఆ దేశం ప్రయోగించిన మిస్సైల్స్ ను తిప్పికొట్టడంలో సక్సెస్ అయింది. దీని కోసం భారత్ శక్తివంతమైన ఆయుధాలను వాడింది. ఇప్పుడు మరిన్ని ఆయుధాలను తమ అమ్ములపొదిలోకి చేర్చుకునేందుకు రెడీ అయింది. దీని కోసం పరీక్షలు నిర్వహించనుంది. 

పినాక ఎమ్కే 3..

భారత్ కు శక్తివంతమైన ఆయుధాలను సమకూర్చే డీఆర్డీవో మరో కొత్త ఆయుధంతో ముందు వచ్చేస్తోంది. పినాక ఎమ్కే 3 అనే పేరుతో పవర్ ఫుల్ క్షిపణిని లాంచ్ చేయబోతోంది. దీనిని తొందరలోనే పరీక్షించనున్నామని డీఆర్డీవో చెప్పింది. నిజానికి పినాక వేరియంట్ ఇంతకు ముందే ఉంది. ఇప్పుడు దాన్నే అప్ గ్రేడ్ చేసి తీసకురాబోతోంది. పినాక 1 పరిధి 40 కిలోమీటర్లు...పినాక 2 పరిధి 60 నుంచి 90 కిలోమీటర్లు..ఇప్పుడు కొత్తది పినాక 3 పరిధి 70 నుంచి 120 కిలోమీటర్లు అని తెలిపింది. అంతేకాదు ఈ ఆయుధం 250 కిలోల వార్ హెడ్ తో వస్తోంది. అలాగే ఇందులో లేజర్ గైరో నావిగేషన్, మైక్రోస్ట్రిప్ యాంటెన్నాలు అమర్చి ఉంటాయి. దీంతో  కేవలం 44 సెకెన్లలో 12 పినకాలను ప్రయోగించవచ్చును అని చెబుతోంది డీఆర్డీవో. దీనిని భవిష్యత్తులో 200 నుండి 300 కిలోమీటర్ల పరిధితో కూడా ప్రయోగించాలని యోచిస్తోంది. 

మరిన్ని కష్టాల్లోకి చైనా, పాకిస్తాన్ ...

పినాక ఎమ్కే 3 వలన పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనాలకు పరిస్థితి మరింత కష్టం కానుంది అని చెబుతోంది డీఆర్డీవో. కత్త ఆయధం వలన ఆ దేశాలు మన జాడకు రావడానికి కూడా భయపడతాయని అంటోంది. ఇప్పటికే భారత్ దగ్గర అగ్ని, బ్రహ్మోస్ లాంటి అత్యంత శక్తివంతమైన ఆయుధాలున్నాయి. వీటి సత్తా ఏంటో ప్రపంచం మొత్తం చూసింది. ఇప్పుడు పినాక 3 కూడా వచ్చి చేరిందంటే భారత్ ను ఢీకొట్టడం ఎవరి వల్లా కాదని తెలిపింది. 

 

today-latest-news-in-telugu | balistic-missiles 

Also Read: Karnataka:  ట్రంప్ పేరుతో మోసం..కోట్లరూపాయలు యాప్ లో పెట్టుబడులు

Advertisment
Advertisment
తాజా కథనాలు