/rtv/media/media_files/2025/01/17/IxT6HGrSl1xfIPLJnqxe.jpg)
Maoists
ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను అందరినీ ఏరిపారేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే చాలా మందిని హతమార్చారు. ఇప్పుడు మిగిలున్నవారిని కూడా పట్టుకోవడానికి కూడా తీవ్ర గాలింపు చేస్తున్నారు. అయితే తాజాగా పోలీసులు కాల్పులు ఆపితే వచ్చి లొంగిపోతామని చెబుతున్నారు. కానీ దానికి పోలీసులు దానికి అవకాశం ఇవ్వడం లేదని..మావోయిస్టు లొంగుబాటు ప్రయత్నాలు ఫలించడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే ముసలివారు అయిన నాయకులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అవకాశం లేకపోవడం, పోరాడే పరిస్థితీ కనిపించకపోవడంతో మావోయిస్టులు సతమతమవుతున్నారని సమాచారం. అందుకే మధ్యే మార్గంగా ఎలా అయినా లొంగిపోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Also Read : మాజీ ఎమ్మెల్యే సోదరుడు టార్గెట్.. మావోయిస్టుల పేరుతో లేఖ..
స్పందించని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు..
అగ్రనేతలు దీని కోసం కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నప్పటికీ అవేవీ ఫలించడం లేదు. ఛత్తీస్ ఘడ్, కేంద్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే వచ్చే ఏడాది మార్చి 31కల్లా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు. దీనిని పోలీసులు, భద్రతా అధికారులు కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను ఏరిపారేస్తున్నారు. గతేడాది ఏకంగా 290 మంది మావోయిస్టులు పోలీసు కాల్పుల్లో చనిపోగా, దాదాపు 1,000 మంది అరెస్టయ్యారు. 881 మంది లొంగిపోయారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 180 మంది వరకు చనిపోయారు. దీంతో దండకారణ్యంలోని మూడొంతుల భాగం భద్రతా బలగాల అధీనంలోకి వచ్చింది. అందుకే ఇప్పుడు భద్రతా బలగాలతో పోరాడలేమని తెలుసుకున్న మావోయిస్టు పార్టీ... తొలుత శాంతి చర్చలకు పిలుపునిచ్చింది. తర్వాత స్వచ్ఛందంగా కాల్పుల విరమణ కూడా ప్రకటించింది. కానీ ప్రభుత్వాలే స్పందించడం లేదని తెలుస్తోంది.
today-latest-news-in-telugu | chattisghar | maoists | operation kagar
Also Read: Covid Cases: ఏపీలో మరో మూడు కరోనా కేసులు..ఒకరి పరిస్థితి విషమం
Also Read : మంచు విష్ణుకు షాక్...కన్నప్ప హార్డ్డ్రైవ్ మాయం