LSG Vs RCB: ఉతికారేసిన పంత్.. ఆర్సీబీ ముందు 228 టార్గెట్

ఆర్సీబీతో మ్యాచ్‌లో లక్నో జట్టు భారీ స్కోర్ చేసింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ఆర్సీబీ ముందు 228 భారీ టార్గెట్ ఉంది. కెప్టెన్ రిషబ్ పంత్ చెలరేగిపోయాడు. సెంచరీతో విజృంభించాడు. 118 స్కోర్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.

New Update
Lucknow against RCB

లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ఆర్సీబీ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగుతోంది. ఇందులో భాగంగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో జట్టు భారీ స్కోర్ చేసింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. దీంతో ఆర్సీబీ ముందు 228 భారీ టార్గెట్ ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రిషబ్ పంత్ చెలరేగిపోయాడు. సెంచరీతో విజృంభించాడు. 61 బంతుల్లో 118 స్కోర్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిచెల్ మార్ష్ 37 బంతుల్లో 67 పరుగులు, మాథ్యూ బ్రీట్జ్కే 12 బంతుల్లో 14 పరుగులు, నికోలస్ పూరన్ 10 బంతుల్లో 13 పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో తుషారా 1 వికెట్, భువనేశ్వర్ కుమార్ 1 వికెట్, షెపర్డ్ 1 వికెట్ తీశారు. 

Also Read: అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

ఇకపోతే ఈ మ్యాచ్‌ ఆర్సీబీకి చాలా కీలకం. ఇందులో RCB గెలిస్తే 19 పాయింట్లతో టాప్-2లో నిలుస్తుంది. ఆపై తొలి క్వాలిఫయర్‌లో పంజాబ్‌ కింగ్స్ జట్టును ఢీ కొడుతుంది. ఒకవేళ లక్నో చేతిలో RCB ఓడితే ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ, ముంబయి తలపడనున్నాయి. 

Also Read: అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

కోహ్లీ ముందు రెండు రికార్డులు

ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీని మరో రెండు రికార్డులు ఊరిస్తున్నాయి. ఇంకో 24 పరుగులు చేస్తే టీ20ల్లో ఆర్సీబీ తరఫున 9వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా నిలుస్తాడు. అలాగే మరో హాఫ్ సెంచరీ చేస్తే డేవిడ్ వార్నర్ (62) రికార్డు బద్దలు కొట్టి ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక అర్ధశతకాలు చేసిన బ్యాటర్‌గా నిలవనున్నాడు. 

Also Read: అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

ఇప్పటికే ఈ సీజన్‌లో ఆడిన 12 ఇన్నింగ్స్‌ల్లో 548 పరుగులు చేసిన కోహ్లీ ఆర్సీబీలోనూ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అయితే మరో 24 పరుగులు చేస్తే టీ20ల్లో ఆర్సీబీ తరఫున 9వేల రన్స్ చేసిన తొలి బ్యాటర్‌గా నిలుస్తాడు. ఐపీఎల్‌లో 256 ఇన్నింగ్స్‌లో 8,552 పరుగులు చేసిన కోహ్లీ, సీఎల్‌టీ20 (ఛాంపియన్‌ లీగ్‌ టీ20)లో 14 ఇన్నింగ్స్‌లో 424 రన్స్‌ చేశాడు. మొత్తంగా ఆర్సీబీ తరఫున 270 ఇన్నింగ్స్‌ల్లో 8,976 రన్స్ కొట్టాడు. ఇక మరో హాఫ్ సెంచరీ చేస్తే ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక అర్ధశతకాలు చేసిన బ్యాటర్‌గా నిలుస్తాడు. 

Also Read: వారెవ్వా అదిరిపోయింది.. iQOO నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్ - ఫీచర్లు హైక్లాస్!

62 అర్ధశతకాలతో  డేవిడ్‌ వార్నర్‌తో పేరిటవున్న రికార్డును బద్దలు కొడతాడు. అయితే ఈ సీజన్ లోనే ఈ రెండు రికార్డులు బద్ధలు కొడతాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక 2025 సీజన్‌లో ఆర్సీబీ 17 పాయింట్లో 3వ స్థానంలో కొనసాగుతోంది. తదుపరి మ్యాచ్ లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌తో  జరగనుండగా నెట్‌రన్‌ రేట్‌తో విజయం సాధిస్తే ఆర్సీబీ మొదటి ప్లేస్ లో నిలుస్తుంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు