తెలంగాణ కోసం 1200 మంది ప్రాణ త్యాగం చేసి చనిపోతే ఒక్క కుటుంబం అధికారం అనుభవించిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ధ్వజమెత్తారు. కల్వకుంట్ల కుటుంబంలో అధికారం కోసం తగాదా వస్తే తెలంగాణ ప్రజలకు ఏం సంబంధమని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి అందరూ వెళ్ళిపోతుంటే కాపాడుకోవడానికి కవిత వ్యవహారం ఓ డ్రామా అని అభివర్ణించారు. కవిత జూన్ 2 న పార్టీ పెట్టడం ఖాయం అని తన వద్ద సమాచారం ఉందన్నారు. షర్మిల మాదిరిగా పాదయాత్ర కూడా చేసే ఛాన్స్ ఉందన్నారు. ఐదేళ్లు ఎంపీగా ఉన్న కవితకు మహిళా హక్కులు గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు. పదేళ్ల పాటు బీసీల హక్కులు, ఫూలే విగ్రహం పెట్టించలేక పోయారా? అంటూ ధ్వజమెత్తారు. బీసీ బిడ్డ ఈటెల రాజేందర్ ను అర్ధరాత్రి బయటకు గెంటేస్తే బీసీల హక్కులు ఎందుకు గుర్తు రాలేదని ఫైర్ అయ్యారు.
BIG BREAKING: 'జూన్ 2న కవిత కొత్త పార్టీ.. ఆ తర్వాత పాదయాత్ర'
జూన్ 2న కవిత కొత్త పార్టీ ప్రకటించే అవకాశం ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఈ మేరకు తనకు సమాచారం ఉందన్నారు. బీసీ బిడ్డ ఈటెల రాజేందర్ ను అర్ధరాత్రి బయటకు గెంటేస్తే బీసీల హక్కులు ఎందుకు గుర్తు రాలేదని కవితపై ఫైర్ అయ్యారు రఘునందన్.
తెలంగాణ కోసం 1200 మంది ప్రాణ త్యాగం చేసి చనిపోతే ఒక్క కుటుంబం అధికారం అనుభవించిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ధ్వజమెత్తారు. కల్వకుంట్ల కుటుంబంలో అధికారం కోసం తగాదా వస్తే తెలంగాణ ప్రజలకు ఏం సంబంధమని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి అందరూ వెళ్ళిపోతుంటే కాపాడుకోవడానికి కవిత వ్యవహారం ఓ డ్రామా అని అభివర్ణించారు. కవిత జూన్ 2 న పార్టీ పెట్టడం ఖాయం అని తన వద్ద సమాచారం ఉందన్నారు. షర్మిల మాదిరిగా పాదయాత్ర కూడా చేసే ఛాన్స్ ఉందన్నారు. ఐదేళ్లు ఎంపీగా ఉన్న కవితకు మహిళా హక్కులు గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు. పదేళ్ల పాటు బీసీల హక్కులు, ఫూలే విగ్రహం పెట్టించలేక పోయారా? అంటూ ధ్వజమెత్తారు. బీసీ బిడ్డ ఈటెల రాజేందర్ ను అర్ధరాత్రి బయటకు గెంటేస్తే బీసీల హక్కులు ఎందుకు గుర్తు రాలేదని ఫైర్ అయ్యారు.