Kannappa Movie: మంచు విష్ణుకు షాక్‌...కన్నప్ప హార్డ్‌డ్రైవ్‌ మాయం

ఓ వైపు కుటుంబ గొడవలు, మరోవైపు సినిమా విడుదల విషయంలో వరుస వివాదాలతో పరేషాన్‌ అవుతున్న మంచువిష్ణుకు మరో షాక్‌ తగిలింది. త్వరలోనే విడుదల కానున్న కన్నప్ప చిత్రానికి సంబంధించిన హార్డ్‌డ్రైవ్‌ మిస్‌ అయింది. ఈ మేరకు ఫిలింనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

New Update
Kannappa Movie

Kannappa Movie

Kannappa Movie :  ఓ వైపు కుటుంబ గొడవలు, మరోవైపు సినిమా విడుదల విషయంలో వరుస వివాదాలతో పరేషాన్‌ అవుతున్న మంచువిష్ణుకు మరో షాక్‌ తగిలింది. త్వరలోనే విడుదల కానున్న కన్నప్ప చిత్రానికి సంబంధించిన హార్డ్‌డ్రైవ్‌ మిస్‌ అయింది. కన్నప్ప మూవీకి సంబంధించిన విలువైన సమాచారంతో కూడిన హార్డ్‌ డ్రైవ్‌ మాయమైనట్లు ఫిలింనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కాగా ఈ మేరకు అనుమతి లేకుండా హార్డ్‌డ్రైవ్‌ తీసుకెళ్లినట్లుఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Also Read: కరోనా పని ఖతం.. నో టెన్షన్.. గుడ్ న్యూస్ చెప్పిన నిపుణులు!

Manchu Vishnu Kannappa's Hard Drive Disappears

పోలీసుల కథనం ప్రకారం కోకాపేటకు చెందిన రెడ్డి విజయ్‌కుమార్‌ ట్వంటీ ఫోర్‌ ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. కాగా  కన్నప్ప చిత్రానికి కీలకమైన కంటెంట్‌ ఉన్న హార్డ్‌డ్రైవ్‌ను ముంబైకి చెందిన వీఎఫ్‌ఎక్స్‌ విక్రేతల్లో ఒకరు (హైవ్‌ స్టూడియోస్‌) డీటీడీసీ కొరియర్‌  ద్వారా ఫిలింనగర్‌లోని ట్వంటీ ఫోర్‌ ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కార్యాలయానికి పంపించారు. కాగా డెలివరీ రికార్డుల ప్రకారం పార్శిల్‌ ఈ నెల 25న కార్యాలయానికి చేరుకుంది. డీటీడీసీ కొరియర్‌ వచ్చిన సమయంలో ఆఫీస్‌బాయ్‌ రఘు దాన్ని అందుకున్నాడు. అయితే అతను దాన్ని చరిత అనే మహిళకు అప్పగించాడు.

Also Read: భారత్ ప్రధాన శత్రువు పాకిస్తాన్ కాదు.. అమెరికా నిఘా సంస్థ సంచలన రిపోర్ట్!

కాగా హార్డ్‌ డ్రైవ్‌ వచ్చిన విషయం తెలుసుకున్న కార్యాలయ సిబ్బంది క్రాంతి హార్డ్‌డ్రైవ్‌ విషయమై రఘును ప్రశ్నించగా తాను చరితకు ఇచ్చినట్లు చెప్పాడు. అయితే చరిత హార్డ్‌డ్రైవ్‌ తీసుకున్నప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా, చరిత, రఘులు కావాలనే కొంతమంది ప్రమేయంతో తమ  సినిమా ప్రాజెక్టుకు నష్టం కలిగించాలనే ఉద్దేశంతోనే కనిపించకుండా తిరుగుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. కాగా ఎన్నిసార్లు వారిని సంప్రదించిన లాభం లేకపోవడంతో ట్వంటీ ఫోర్‌ ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన రెడ్డి విజయ్‌కుమార్‌ ఫిలింనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read : మేడ్చల్‌లో విషాదం.. కరెంట్ వైర్ ప్రమాదంలో యువతి మృతి

Also Read :  ఆ దేశాల్లో భారీ భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు

 

kannappa-movie | bhakta kannappa movie | Manchu Vishnu | manchu vishnu movies | Film Nagar Hyderabad

Advertisment
Advertisment
తాజా కథనాలు