/rtv/media/media_files/2025/05/27/WlNtywt5db7DeN4yZXVD.jpg)
Encounter
Encounter : జార్ఖండ్లో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు దళ కమాండర్ మృతిచెందారు. సోమవారం రాత్రి పలాము జిల్లాలోని హైదర్నగర్-మహమ్మద్గంజ్ పోలీస్ స్టేషన్ల మధ్య ఉన్న సీతాచువాన్ అటవీ ప్రాంతంలో పోలీసులు గాలింపు చేపట్టారు.
Also Read: అమెరికాలో పాక్ పౌరుల అరెస్ట్.. వాళ్లు ఏం చిల్లర పని చేశారో తెలుసా?
Also Read: ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం
దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కొనసాగుతున్న ఆఫరేషన్ కగార్లో భద్రతా బలగాలు మరో విజయం సాధించాయి. జార్ఖండ్లో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు దళ కమాండర్ మృతిచెందారు. హైదర్నగర్-మహమ్మద్గంజ్ పోలీస్ స్టేషన్ల మధ్య ఉన్న సీతాచువాన్ అటవీ ప్రాంతంలో గత రాత్రి నుంచి పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో నిషేధిత సీపీఐ మావోయిస్టు అగ్ర కమాండర్ తులసి భూనియన్ మృతిచెందారు. ఈ ఎన్కౌంటర్లో నితేశ్ యాదవ్ అనే మావోయిస్టు గాయపడ్డారని, అతనిపై రూ.15 లక్ష రివార్డు ఉందని చెప్పారు. కాల్పుల అనంతరం ఘటనా స్థలంలో సెల్ఫ్ లోడింగ్ రైఫిల్తోపాటు భారీగా ఆయుధాలు స్వాధినం చేసుకున్నామని వెల్లడించారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: సంచలన అప్డేట్.. పుతిన్ హెలికాప్టర్పై ఉక్రెయిన్ బాంబు దాడి
Also Read: దేశ ప్రతిష్టను దిగజార్చారు..మాజీమంత్రి సబితారెడ్డి ఆగ్రహం
కాగా, జార్ఖండ్లోని లాతహోర్లో సోమవారం మరో ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో మావోయిస్టు సభ్యుడు మనీశ్ యాదవ్ మృతిచెందాడు. అతనిపై రూ.5 లక్షల రివార్డు ఉన్నదని అధికారులు వెల్లడించారు. రూ.10 లక్షల రివార్డున్న పార్టీ జోనల్ కమాండర్ కుందన్ సింగ్ ఖర్వర్ను అరెస్టు చేశామని భద్రతా బలగాలు వెల్లడించాయి.
ఇది కూడా చూడండి: సంచలన అప్డేట్.. పుతిన్ హెలికాప్టర్పై ఉక్రెయిన్ బాంబు దాడి !
ఇది కూడా చూడండి: బంగ్లాదేశ్ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు