/rtv/media/media_files/2025/05/27/8pz4H6OGq38hZbrXZ0Sb.jpg)
kollam customs Container
High alert Kerala coast : ఇటీవల ప్రమాదవశాత్తు కేరళ తీరానికి సమీపంలో నీట మునిగిన లైబీరియా ఓడ నుంచి ఇంకా ప్రమాదం పొంచే ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. నీటమునిగిన ఓడలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయన్న సమాచారంతో భారత తీరప్రాంత అధికారులు అప్రమత్తమయ్యారు. కాగా నీటి మునిగిన ఓడ నుంచి చమురు లీకేజీ కొనసాగుతోంది. అంతేకాక ఓడలోని కంటెయినర్లు అలల తాకిడికి ఒడ్డుకు కొట్టుకు వస్తున్నాయి. ఇప్పటికే తొమ్మిది కంటెయినర్లు కొల్లం, అలప్పుఝలోని తీరానికి కొట్టుకు వచ్చాయని అధికారులు తెలిపారు. కొట్టుకు వచ్చిన కంటెయినర్ల నుంచి ఆయిల్ లీకవుతున్నందున తీర ప్రాంత జిల్లాల్లో హైఅలెర్ట్ ప్రకటించారు. మరోవైపు ఈ విషయమై సంబంధిత అధికారులతో కేరళ సీఎం విజయన్ సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: సంచలన అప్డేట్.. పుతిన్ హెలికాప్టర్పై ఉక్రెయిన్ బాంబు దాడి
తీరానికి కొట్టుకు వస్తున్న కంటెయినర్ల విషయంలో ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) హెచ్చరించింది. ఆదివారం సముద్రంలో మునిగిన ఈ ఓడలో 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్, 367.1 మెట్రిక్ టన్నుల ఫర్నేస్ ఆయిల్ ఉన్నట్లు భారత తీర రక్షణ దళం(ఐసీజీ) తెలిపింది. కొన్ని కంటెయినర్లలో ప్రమాదకరమైన కాల్షియం కార్బైడ్ ఉందన్న వార్తలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ రసాయనం లీకై సముద్ర జలాలతో కలిస్తే మండే స్వభావమున్న ఎసిటలీన్ వాయువుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓడ నుంచి లీకవుతున్న చమురు గంటకు మూడు కిలోమీటర్ల మేర వ్యాపిస్తూ సముద్ర పర్యావరణానికి ప్రమాదకరంగా మారిందని అధికారులు తెలిపారు. ఇప్పటికే 9 కంటెయినర్లు ఒడ్డుకు చేరాయి. మరో నాలుగు కంటెయినర్లు శక్తికులంగర హార్బర్ సమీపంలో, మూడు చావర సమీపంలో, ఒకటి చరియాజికల్ వద్ద, మరోటి త్రిక్కున్నపుఝ వద్ద కనిపించాయని అధికారులు వెల్లడించారు.
Also Read: ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం
అదే సమయంలో ఆయిల్ లీకేజీని అరికట్టేందుకు ఐసీజీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. చమురు తెట్టు ఏర్పడకుండా డార్నియర్ విమానం సాయంతో రసాయనాలను వెదజల్లుతున్నారు. ఈ ఘటన టయర్–2 కేటగిరీకి చెందినది కావడంతో ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు జాతీయ స్థాయి వనరులను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. కాగా మరికొన్ని కంటెయినర్లు తీరానికి కొట్టుకు వచ్చే అవకాశముందని అధికారులు వెల్లడించారు.ఆ కంటెయినర్లు, ఇతర అసాధారణ వస్తువులను తాకవద్దని, వాటి సమీపంలో గుమికూడవద్దని ప్రజలను, మత్స్యకారులను తీరప్రాంత రక్షణ దళం హెచ్చిరించింది.
Also Read: అమెరికాలో పాక్ పౌరుల అరెస్ట్.. వాళ్లు ఏం చిల్లర పని చేశారో తెలుసా?