/rtv/media/media_files/2025/05/27/iDtFWtZ7jW4rdHRirFfi.jpg)
Pakistan PM Shabaz Sharif
షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ప్రస్తుతం నాలుగు దేశాల పర్యటనలో ఉన్నారు. ప్రసతుతం ఇరాన్ లో ఉన్న ఆయ ఈరోజు ఆ దేశాధ్యక్షుడు ఖమేనీని కలవనున్నారు. అంతకు ముందు అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్తో కలిసి షెహబాజ్ షరీఫ్ సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు. అందులో భారత్ తో ఉన్న సమస్యల గురించి ఫెహబాజ్ మాట్లాడారు. తాము భారత్ తో చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కాశ్మీర్, సింధు జలాలు, ఉగ్రవాదంపై చర్చించేందుకు రెడీ అని తెలిపారు. అన్ని సమస్యలకు చర్చలే పరిష్కారమని అన్నారు. అలాగే భారత్ తో వాణిజ్యం గురించి మాట్లాడాలని పాక్ ప్రధాని అన్నారు. ఆ దేశంలో తాము ఎప్పుడూ శాంతి కోసమేప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. భారత్ కూడా అదే కోరుకుంటే బావుంటుందని షరీఫ్ అన్నారు.
Also Read : నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు.. వెంటాడుతున్న కరోనా భయం?
Also Read : గోంగూర చికెన్, దోసకాయ మటన్.. మహానాడులో మైమరపించే వంటకాలు.. ఫుల్ మెనూ ఇదే!
బుల్లెట్ దిగుతుంది..మోదీ హెచ్చరిక..
మరోవైపు నిన్న గుజరాత్ లో పర్యటించిన ప్రధాని మోదీ పాకిస్తాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్ శాంతిని కోరుకోకపోతే భారత సైన్యం మళ్ళీ దాడులు చేస్తుందని చెప్పారు. ప్రశాంతమైన జీవితంతో రోటీ తినండి లేదా బుల్లెట్ దిగుతుంది అంటూ విరుచుకుపడ్డారు.
పహల్గాం దాడి తరువాత భారత్, పాకిస్తాన్ ల మధ్య సంబంధాలు చెడిపోయాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వారి స్థావరాలను ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ సైన్యం కూల్చేసింది. అందుకు ప్రతిగా పాకిస్తాన్ దాడులు చేపట్టింది. వాటన్నింటినీ భారత్ సమర్ధవంతంగా ఎదుర్కోవడమే కాక పాక్ ఆర్మీ, ఎయిర్ బేస్ లను నాశనం చేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది. ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చి కాల్పులు విరమణ ఒప్పందం చేసుకున్నాయి.
today-latest-news-in-telugu | pakistan | pm shehbaz sharif
Also Read: UK: ఫుట్ బాల్ ప్రీమియర్ లీగ్ పరేడ్ లోకి దూసుకెళ్ళిన కారు..పలువురికి గాయాలు
Also Read : నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన