/rtv/media/media_files/zhTJ1U1UZhj7CFiY8zXk.jpg)
నిన్న లాభాలతో కళకళలాడిన స్టాక్ మార్కెట్లు ఈరోజు ఢమాల్ అన్నాయి. ఉదయం మార్కెట్ ప్రారంభం నుంచే సూచీలు నేలచూపులు చూస్తున్నాయి. సెన్సెక్స్ దాదాపు 450 పాయింట్లు తగ్గి 81,725 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా దాదాపు 150 పాయింట్లు తగ్గి 24,850 స్థాయిలో ఉంది. మునుపటి ముగింపుతో చూస్తే 200 పాయింట్లకు పైగా పడిపోయింది. టాటా మోటార్స్, మహీంద్రా & మహీంద్రా, టిసిఎస్ వంటి స్టాక్స్ తీవ్ర క్షీణతను చవిచూశాయి. 30 సెన్సెక్స్ స్టాక్స్లో 22 నష్టపోగా 8 మాత్రమే పెరిగాయి. అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు 2.25% , ఎన్టిపిసి, మహీంద్రా షేర్లు 1% తగ్గాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ 2.26% పెరిగింది. ఇక నిఫ్టీలోని 50 స్టాక్స్లో 35 నష్టపోగా, 15 లాభాల్లో ఉన్నాయి. ఎన్ఎస్ఇ ఐటీ ఇండెక్స్ 0.93%, ఆటో 0.60%, ప్రైవేట్ బ్యాంక్ 0.73% తగ్గాయి. మీడియా, ఫార్మా, రియాల్టీలలో స్వల్ప పెరుగుదల ఉంది. స్టాక్ మార్కెట్ ఇంతలా కుదేలయి పోవడానికి కారణం కరోనా అంటున్నారు. దేశంలో ఇప్పటి వరకు వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. దీని ప్రభావం మార్కెట్ల మీద కూడా పడిందని నిపుణులు చెబుతున్నారు.
అంతర్జాతీయంగా మిశ్రమ ఫలితాలు..
మరోవైపు ఆసియా మార్కెట్లలోనూ జోరు తగ్గింది. ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ దాదాపు 100 పాయింట్లు తగ్గి 37,440 వద్ద, కొరియా కోస్పి 13 పాయింట్లు తగ్గి 2,631 వద్ద ట్రేడవుతున్నాయి. హాంకాంగ్కు చెందిన హాంగ్ సెంగ్ సూచీ 73 పాయింట్లు తగ్గి 23,209 వద్ద, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ 11 పాయింట్లు తగ్గి 3,335 వద్ద ముగిశాయి.ఇక అమెరికా విషయానికి వస్తే..మే 23న, US డౌ జోన్స్ 256 పాయింట్లు పడిపోయి 41,603 వద్ద ముగిసింది. నాస్డాక్ కాంపోజిట్ 188 పాయింట్లు పడిపోయి 18,737 వద్ద ఎండ్ అయింది. S&P 500 కూడా 39 పాయింట్లు పడిపోయి 5,802 వద్ద ముగిసింది.
today-latest-news-in-telugu | stock-market | sensex-crash-today | nifty
Also Read: Pinaka MK 3: భారత్ అమ్ముల పొదిలో మరో సూపర్ మిస్సైల్.. పరీక్షించనున్న డీఆర్డీవో