/rtv/media/media_files/2025/05/27/w0i6942VKZ4CTDANdjXa.jpg)
బీఆర్ఎస్ నేత, వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ కన్నుమూశారు. గుండెపోటుతో గచ్చిబౌలిలోని ఎఐజీ హాస్పిటల్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన మదన్ లాల్ ... అనంతరం బీఆర్ఎస్ లో చేరారు. 2018,2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్నారు మదన్ లాల్.
Also Read : నైరుతి రుతుపవనాలు ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
వైరా మాజీ ఎమ్మెల్యే మధన్ లాల్ కన్నుమూత
— Telangana Awaaz (@telanganaawaaz) May 27, 2025
గుండెపోటుతో ఎ.ఐ.జీ హాస్పిటల్ లో కన్నుమూత
2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి బిఆర్ఎస్ లో చేరిన మదన్ లాల్
2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మదన్ లాల్
ప్రస్తుతం బిఆర్ఎస్ వైరా… pic.twitter.com/xEsw9LsrW1
Also Read : దేశంలో భారీ బాంబు పేలుడు
2009లో రాజకీయాల్లోకి
బానోతు మదన్ లాల్ 1963 మే 03న ఖమ్మం జిల్లా, రఘునాథపాలెం, ఈర్లపుడి గ్రామంలో జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి బీఏ పూర్తి చేశాడు. బానోతు మదన్ లాల్ 2009లో వైరా శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి బానోత్ చంద్రావతి చేతిలో 47 వేల 539 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆయన 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరి 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు.
Also Read : ఆ దేశాల్లో భారీ భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు
Also Read : మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ..జార్ఖండ్లో భీకర ఎన్కౌంటర్.. టాప్ కమాండర్ మృతి
madan-lal | brs-party | khammam