/rtv/media/media_files/2025/05/27/j4nE5JLFpTGw9jFibgGi.jpg)
Naxali Commander Manish Yadav
Encounter in Jharkhand : వరుస ఎన్కౌంటర్లతో అగ్ర నాయకులను కోల్పోతున్న మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగలింది. జార్ఖండ్ లోని లాటేహార్ జిల్లాలో మహుడనే పోలీస్ స్టేషన్ పరిధిలోని కరంఖర్, ధోవ్నా గ్రామాల మధ్య దట్టమైన అడవుల్లో మావోయిస్టు అగ్రనేత ఒకరు మృత్యువాతపడ్డారు. లాటేహార్ జిల్లాలో మావోయిస్టులు సంచారిస్తున్నారనే సమాచారంతో పోలీసులు, సీఆర్పీఎప్ అనుబంధ యూనిట్ కోబ్రా, జార్ఖండ్ జాగ్వార్ బృందం ఆదివారం సాయంత్రం నుంచి కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. కాగా ఈ సందర్భంగా పోలీసులకు, నక్సల్స్ ఎదురు పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో సీపీఐ (మావోయిస్టు) పార్టీ టాప్ కమాండర్ మనీశ్ యాదవ్ మృతి చెందారు.
ఇది కూడా చూడండి: సంచలన అప్డేట్.. పుతిన్ హెలికాప్టర్పై ఉక్రెయిన్ బాంబు దాడి !
మృతిచెందిన మావోయిస్టును బిహార్ రాష్ట్రం గయా జిల్లాకు చెందిన మనీశ్ యాదవ్ గా గుర్తించారు. కాగా ఈ ఎదురుకాల్పుల్లో మరో కొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. అయితే ఈ సందర్భంగా ఏరియా కమాండర్ కుందన్ ఖేర్వార్ ను పోలీసులు ప్రాణాలతో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. చనిపోయిన టాప్ కమాండర్ మనీశ్ యాదవ్పై రూ.10 లక్షల రివార్డు కూడా ఉన్నట్లుగా ఉన్నతాధికారులు తెలిపారు. కాగా ఘటనా స్థలంలో రెండు ఎక్స్-95 ఇజ్రాయిల్ అసాల్ట్ రైఫిళ్లు, ఇతర ఆయుధాలు, పెద్ద ఎత్తున మందుగుండి సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ఇది కూడా చూడండి: బంగ్లాదేశ్ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు
మావోయిస్టు పార్టీలో మనీష్ యాదవ్ అంత్యంత కీలక వ్యక్తిగా గుర్తింపు పొందాడు. గత రెండు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో చురుకుగా ఉన్న అతడు బీహార్ , జార్ఖండ్ సరిహద్దు ఆపర్లేషన్లలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు తెలిపారు. మనీష్ ఒకప్పుడు సీనియర్ మావోయిస్ట్ పొలిట్బ్యూరో సభ్యుడు దేవ్ కుమార్ సింగ్ అలియాస్ అరవింద్ కు పర్సనల్ బాడీగార్డ్గా కూడా పని చేసినట్లు తెలిపారు. మనీశ్ యాదవ్ రెండు దశాబ్ధాలలో 50 కంటే ఎక్కువ సాయుధ ఆపరేషన్లలో పాల్గొన్నట్లుగా అక్కడి పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇది కూడా చూడండి: SRH VS KKR: హ్యాట్రిక్ విజయం..కేకేఆర్ ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్