Karnataka:  ట్రంప్ పేరుతో మోసం..కోట్లరూపాయలు యాప్ లో పెట్టుబడులు

మోసం జరిగింది కర్ణాటకలో..కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరుతో. కర్ణాటకలో హవేరీలో ట్రంప్ యాప్ పేరుతో కోట్లాది రూపాయలకు టోకరా వేశారు. తరువాత ఆ భారీ మొత్తంతో పరారయ్యారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

author-image
By Manogna alamuru
New Update
Pakistani Hackers Fail To Breach Indian Cyber Defences As LoC Tensions Escalate

Pakistani Hackers Fail To Breach Indian Cyber Defences As LoC Tensions Escalate

కర్ణాటకలో హవేరీలో జరిగిన సైబర్ మోసం అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది.  ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కొందరు ట్రంప్ పేరుతో ఒక యాప్ ను పెట్టారు. అందులో కోట్ల రూపాలు ప్రజల చేత పెట్టుబడులు పెట్టించారు. అధిక లాభాలు వస్తాయంటూ నమ్మబలికారు. ఈ యాప్ లో ట్రంప్ హోటల్ అద్దె, పెట్టుబడులు అంటూ ఏవేవో చెప్పి అందరినీ నమ్మించారు. సోషల్ మీడియాలో కూడా తెగ ప్రకటనలు ఇచ్చారు. తక్కువ వ్యవధిలో ఎక్కువ రాబడి అంటూ చెప్పారు. 

చిన్న రాబడుల చూపించి పెద్ద మోసంతో...

యాప్ లో జాయిన్ అయిన వారితో మొదట్లో రూ.1500 పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తరువాత వారికి రూ. 500 ఇచ్చారు. దీంతో జనాల్లో నమ్మకాన్ని పంచుకున్నారు. ఇక తరువాత ఇలా చిన్న చిన్న రాబడులు చూపిస్తూ..పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టించారు. చివరకు వాళ్ళు అనుకున్న డబ్బు జమకూడగానే ఎవరికీ చెప్పపెట్టకుండా చెక్కేశారు. ఎటువంటి ఆధారాలు దొరక్కుండా చాలా తెలివిగా పారిపోయారు. మోసపోయామని తెలిసిన జనాలు కేసులు నమోదుచేయడం మొదలెట్టారు. రాష్ట్రంలో బెంగళూరు, మంగళూరు, తుమకూరు, హావేరి, హుబ్లీ-ధార్వాడ్, శివమొగ్గ సహా పలు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. ఒక్క హవేరీలోనే 15మందికి పైగా బాధితులు కేసులు నమోదు చేశారు. బాధితుల్లో వ్యాపారుల నుంచి విద్యార్థుల దాకా అందరూ ఉన్నారు. ఒక వ్యక్తి రూ. 6లక్షలు పోగొట్టుకున్నానని చెప్పారు. ప్రస్తుతం కేసుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను డిజిటల్ గా ట్రాక్ చేస్తున్నారు. నకిలీ లోన, డబ్బు రెట్టింపు చేస్తామనే యాప్ లకు ప్రజలు దూరంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. ఏ అనధికార లింక్‌లపైనా క్లిక్ చేయవద్దని సలహా ఇస్తున్నారు. 

 today-latest-news-in-telugu | karnataka | Cyber ​​Crime | trump

Also Read: Pahalgam: పహల్గాంలో కేబినెట్ భేటీ..అజెండా ఇదే..

Advertisment
Advertisment
తాజా కథనాలు