🔴Live News Updates: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. నాలుగు రోజుల పాటు భీభత్సమైన వర్షాలు

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS LIVE

BREAKING NEWS LIVE

Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. నాలుగు రోజుల పాటు భీభత్సమైన వర్షాలు

తెలుగు రాష్ట్రాలకు మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈ క్రమంలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలుపుతోంది. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని ప్రజలను సూచించారు.

Also read: Pawan : మీకో దండంరా బాబు.. టాలీవుడ్ పై పవన్ ఫైర్!

Also read: Cinema News: పవన్‌పై కుట్రతోనే థియేటర్ల మూసివేత.. ఆ నలుగురే ఇదంతా చేస్తున్నారా!?

Weather Update In Telugu States

మరో రెండు రోజుల్లో ఏపీకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించనున్నాయి. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతవారణ శాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా భారీ వర్షాలు పడనున్నాయి.

ఏపీలో ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

తెలంగాణలో మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, సిరిసిల్ల ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులతో వర్షాలు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా మృత్సకారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. 

ఇది కూడా చూడండి: Spirit Movie: దీపికా ఔట్.. యానిమల్ బ్యూటీ ఇన్.. ప్రభాస్‌తో రొమాన్స్‌కి బోల్డ్ బ్యూటీ

Also Read :  BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే

Live News Updates

  • May 26, 2025 21:26 IST

    PBKS vs MI: దంచికొట్టిన ముంబై.. కింగ్స్ ముందు భారీ టార్గెట్

    పంజాబ్ కింగ్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ ముందు 185 టార్గెట్ ఉంది. 

    PBKS vs MI, IPL 2025
    PBKS vs MI, IPL 2025 Photograph: (PBKS vs MI, IPL 2025)

     



  • May 26, 2025 21:04 IST

    Maoist party: ఆ ద్రోహుల వల్లే కేశవరావు ఎన్‌కౌంటర్.. మావోయిస్టుపార్టీ సంచలన లేఖ!

    నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ సంచలన లేఖ విడుదల చేసింది. లొంగిపోయిన కోవర్టుల వల్లే ఈ నష్టం జరిగిందని ప్రకటించింది. ఆయన టీమ్‌లో ఆరుగురు ఇటీవలే లొంగిపోయారని, యూనిఫైడ్ కమాండో సభ్యుడు ద్రోహిగా మారినట్లు స్పష్టం చేసింది. 

    maoist operation



  • May 26, 2025 21:03 IST

    Maoist funeral: మావోయిస్టుల అంత్యక్రియలు పూర్తి.. అక్కడే దహనం చేసిన ఛత్తీస్‌గఢ్ పోలీసులు!

    నారాయణపూర్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన తెలుగు రాష్ట్రాల మావోయిస్టు మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులకు ఇవ్వకుండానే ఛత్తీస్‌గఢ్ పోలీసులు దహనం చేశారు. అంత్యక్రియలకు సంబంధించిన వీడియోలను రిలీజ్ చేశారు. 

    maoist frl
    maoist frl Photograph: (maoist frl)

     



  • May 26, 2025 21:00 IST

    BIG BREAKING : కేటీఆర్కు బిగ్ షాక్‌ .. ఏసీబీ మరోసారి నోటీసులు

    బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్‌ తగిలింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఆయనకు మరోసారి నోటీసులు అందాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు.

    BREAKING NEWS
    BREAKING NEWS

     



  • May 26, 2025 17:28 IST

    Heavy Rain Alert: మునిగిపోయిన మెట్రో స్టేషన్.. వీడియోలు చూస్తే గజగజ వణకాల్సిందే

    భారీ వర్షాల కారణంగా ముంబైలోని వర్లీ మెట్రో స్టేషన్ నీట మునిగింది. ట్రైన్‌ ట్రాక్‌లపై మాత్రమే కాకుండా ట్రైన్‌ లోపలికి వెళ్లేందుకు వినియోగించే స్టేషన్ గేట్ల వరకు నీరు చేరింది. అలాగే ప్లాట్‌ఫామ్‌లపై భారీగా నీరు చేరడంతో మెట్రో స్టేషన్ చెరువును తలపించింది.

    Mumbai metro station flooded as water gushes inside amid heavy rain
    Mumbai metro station flooded as water gushes inside amid heavy rain Photograph: (Mumbai metro station flooded as water gushes inside amid heavy rain)

     



  • May 26, 2025 17:27 IST

    Jyoti Malhotra: జ్యోతికి పాకిస్తాన్‌లో రాజభోగాలు.. ఏకే-47లతో ఏడుగురు గన్‌మెన్లు.. షాకింగ్ వీడియో!

    పాక్ గూఢాచారి జ్యోతి మల్హోత్రాకు సంబంధించి మరో సంచలన వీడియో బయటపడింది. శత్రుదేశంలో జ్యోతి రాజభోగాలు అనుభవించింది. పాక్ టూర్‌లో ఉన్నప్పుడు ఆమెకు AK47 గన్నులతోకూడిన ఏడుగురు గన్‌మెన్లను కేటాయించారు. మరో యూట్యూబర్ ఈ వీడియో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. 

    pak jyothi
    pak jyothi Photograph: (pak jyothi)

     



  • May 26, 2025 17:25 IST

    Shubman Gill: ‘బాగా ఆడితే సరిపోదు.. అది కూడా ఉండాలి’.. కెప్టెన్ గిల్‌కు గావస్కర్ కీలక సూచన

    ఇంగ్లాండ్‌తో టెస్ట్‌సిరీస్‌ జూన్20 నుంచి జరగనుంది. ఈ తరుణంలో కెప్టెన్ గిల్‌కు గావస్కర్ కీలక సూచన చేశారు. కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నపుడు మిగిలిన వారిని గౌరవించేలా నీ ప్రవర్తన ఉండాలని సూచించారు. ఆ సమయంలో ఒక సారథికి తన ఆటతీరు కంటే ప్రవర్తనే ముఖ్యమన్నారు.

    Sunil Gavaskar gives key instructions to Shubman Gill



  • May 26, 2025 17:25 IST

    Dil Raju: పవన్ మా పెద్దన్న.. తిడితే పడతాం - దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు!

    ఇండస్ట్రీలో కాంట్రవర్సీపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. చిత్ర పరిశ్రమకు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వాల దగ్గరకు వెళ్ళాలని తెలిపారు. పవన్‌కి మీడియా వల్ల మిస్ కమ్యూనికేషన్ అయ్యిందని అన్నారు. అందువల్ల పెద్దన్న పవన్ కళ్యాణ్ తిడతాడు.. మేము పడతాము అని తెలిపారు.

    dil raju..
    dil raju Photograph: (dil raju)

     



  • May 26, 2025 17:24 IST

    Maoist: మావోయిస్టులను అంతం చేసేందుకు మోదీ సర్కార్ బిగ్ ప్లాన్.. రంగంలోకి లక్ష మంది బలగాలు!

    మావోయిస్టులపై మోదీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నక్సల్స్ ఏరివేతే లక్ష్యంగా దండకారణ్యాన్ని స్వాధీనం చేసుకుంది. దేశంలో దశబ్దాలుగా కొనసాగుతున్న ఈ పోరాటంలో సంపూర్ణ విజయం సాధించే దశకు చేరుకుంది. గత ప్రభుత్వాలు అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేస్తోంది.

    modi mao
    modi mao Photograph: (modi mao)

     



  • May 26, 2025 17:24 IST

    CRPF Jawan Arrested : పాక్తో చేతులు కలిపాడు.. CRPF జవాన్ అరెస్ట్

    పాకిస్తాన్ నిఘా అధికారులకు సున్నితమైన సమాచారాన్ని లీక్ చేశాడనే ఆరోపణలపై CRPF జవాన్ ను ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఏజెన్సీ వెల్లడించిన ప్రకారం మోతీ రామ్ 2023 నుండి పాకిస్తాన్ కగూఢచర్య కార్యకలాపాలలో పాల్గొంటూ వారి నుంచి డబ్బులు తీసుకుంటున్నాడు.  

    nia



  • May 26, 2025 17:24 IST

    Nambala Keshav Rao: కేశవరావు శవం ఇచ్చేది లేదు.. కశ్మీర్ విధానంలో అంత్యక్రియలు.. పోలీసుల సంచలన నిర్ణయం!

    మావోయిస్టు నంబల కేశవ్ రావు మృతదేహాన్ని బంధువులకు అప్పగించేందుకు ఛత్తీష్ గఢ్ పోలీసులు అంగీకరించట్లేదు. ఏపీ హైకోర్టు చెప్పినా ప్రజల్లో అతన్ని హీరోగా చూడటం ఇష్టంలేదని చెబుతున్నట్లు తెలుస్తోంది. కశ్మీర్ విధానంలో అంత్యక్రియలు జరిపించాలని చూస్తున్నారట. 

    Nambala Keshav Rao
    Nambala Keshav Rao

     



  • May 26, 2025 17:23 IST

    Pumpkin: పొరపాటున వీరు గుమ్మడికాయ తింటే.. ప్రాణాలు గోవిందా!

    గుమ్మడి కాయను గర్భిణులు, పాలిచ్చే తల్లులు, కడుపు సంబంధిత సమస్యలు, బీపీ సమస్యలు ఉన్నవారు తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీరు తీసుకోవడం బాడీ డీహైడ్రేట్ అయి సమస్య తీవ్రం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

    pumpkin eating
    pumpkin eating

     



  • May 26, 2025 17:23 IST

    BIG BREAKING: వైఎస్సార్ జిల్లా పేరు మార్పు.. చంద్రబాబు సర్కార్ సంచలన ఉత్తర్వులు!

    ఏపీలో వైఎస్సార్ జిల్లా పేరు మారింది. దీనిని వైఎస్సార్ కడప జిల్లాగా మార్చుతూ చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కేబినెట్ సమావేశంలోనూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది ప్రభుత్వం.

    AP BREAKING NEWS
    AP BREAKING NEWS

     

     



  • May 26, 2025 17:21 IST

    Serial Killer: మనిషి తలను మరిగించి సూప్‌.. ఉత్తరప్రదేశ్‌లో మరో గురుమూర్తి.. షాకింగ్ విషయాలు!

    ఉత్తరప్రదేశ్‌లో మరో గురుమూర్తి తరహా ఘటన చోటు చేసుకుంది. సీరియల్‌ కిల్లర్‌ రామ్‌ నిరంజన్‌ అలియాస్‌ రాజా కోలందర్ మనుషులను చంపి వారి తలను మరిగించి సూప్ తాగుతాడని పోలీసుల విచారణలో తేలింది. ఇతనికి కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది.

    Uttar pradesh Soup
    Uttar pradesh Soup

     



  • May 26, 2025 17:20 IST

    Kaleshwaram: సరస్వతి పుష్కరాలు చివరిరోజు.. కొనసాగుతున్న భక్తుల రద్దీ

    కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి పుష్కరాలు సోమవారంతో ముగియనున్నాయి. ఈరోజు చివరిరోజు కావడంతో భక్తుల రద్దీ నెలకొంది. పవిత్ర త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ముకేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు.

    last day of saraswati pushkaram, Crowd Continuing in Kaleshwaram
    last day of saraswati pushkaram, Crowd Continuing in Kaleshwaram

     



  • May 26, 2025 14:10 IST

    చికెన్‌ నెక్‌ వివాదం.. బంగ్లాదేశ్‌కు హిమంత బిశ్వ శర్మ గట్టి కౌంటర్

    అసోం సీఎం హిమాంత బిశ్వ శర్మ బంగ్లాదేశ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బంగ్లాలో కూడా రెండు సన్నని భూభాగాలు ఉన్నాయని.. అవి భారత్‌ కన్నా మరింత సున్నితమైనవని హెచ్చరించారు. యూనస్ చికెన్‌ నెక్‌ వ్యాఖ్యలపై ఆయన ఈవిధంగా కౌంటర్ ఇచ్చారు.

    Himanta Biswa Sharma
    Himanta Biswa Sharma

     



  • May 26, 2025 14:09 IST

    మనిషి తలను మరిగించి సూప్‌.. ఉత్తరప్రదేశ్‌లో మరో గురుమూర్తి.. షాకింగ్ విషయాలు!

    ఉత్తరప్రదేశ్‌లో మరో గురుమూర్తి ఘటన చోటు చేసుకుంది. సీరియల్‌ కిల్లర్‌ రామ్‌ నిరంజన్‌ అలియాస్‌ రాజా కోలందర్ మనుషులను చంపి వారి తలను మరిగించి సూప్ తాగుతాడని పోలీసుల విచారణలో తేలింది. ఇతనికి కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది.

    Uttar pradesh Soup
    Uttar pradesh Soup

     



  • May 26, 2025 13:50 IST

    హైదరాబాద్‌లో దారుణం.. గొడవ ఆపడానికి వెళ్లిన యువకుడిని కొట్టి చంపిన ఫ్రెండ్స్!

    హైదరాబాద్‌లోని ఉప్పల్‌ గుడ్ డే బార్‌లో తాగుబోతుల గొడవ యువకుడి ప్రాణం తీసింది. మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు గొడవ పడ్డారు. వారికి సర్ది చెప్పే సమయంలో బీరు బాటిల్‌తో శ్రవణ్ గొంతు భాగంలో కొట్టాడు. తీవ్ర గాయాలవ్వడంతో పవన్ కుమార్‌ ప్రాణాలు కోల్పోయాడు.

    HYD Crime
    HYD Crime

     



  • May 26, 2025 13:16 IST

    ఆ దేశ అధినేత పిచ్చొడు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

    ఆదివారం ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులకు పాల్పడింది. దీంతో పుతిన్ పూర్తిగా పిచ్చి పట్టినట్లు ప్రవరిస్తున్నారని ట్రంప్‌ విరుచుకుపడ్డారు. ఉక్రెయిన్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తే రష్యా పతనానికి దారి తీస్తుందని హెచ్చరించారు.

    Trump calls Putin 'crazy' after largest Russian attack on Ukraine
    Trump calls Putin 'crazy' after largest Russian attack on Ukraine

     



  • May 26, 2025 13:15 IST

    కరోనా పని ఖతం.. నో టెన్షన్.. గుడ్ న్యూస్ చెప్పిన నిపుణులు

    ప్రపంచ వ్యాప్తంగా ఒక్కో దేశంలో ఒక్కో కరోనా వేరియంట్ పుట్టుకొస్తోందని, వీటితో ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు. దేశంలో NB.1.8.1, LF.7 అనే వేరియంట్లు ఉన్నాయని ఇవి వేరే దేశంలో లేవని ప్రొఫెసర్లు అంటున్నారు. ప్రస్తుతం కరోనా సాధారణమైందని చెబుతున్నారు.

    corona-virus
    corona-virus

     



  • May 26, 2025 11:50 IST

    భారత్ ప్రధాన శత్రువు పాకిస్తాన్ కాదు.. అమెరికా నిఘా సంస్థ సంచలన రిపోర్ట్!

    తైవాన్‌ను ఆక్రమించేందుకు చైనా మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకుంటోందని అమెరికాకు చెందిన ఓ నివేదిక పేర్కొంది. 2030 నాటికి చైనాకు 1000 వరకు అణ్వాయుధాలు ఉంటాయని తెలిపింది. ఇండియా చైనాను ప్రధాన శత్రువుగా భావిస్తోందని వెల్లడించింది.

    China Projected To Have 1,000 nuclear warheads, Viewed As 'Primary Adversary' By India, Says US Report
    China Projected To Have 1,000 nuclear warheads, Viewed As 'Primary Adversary' By India, Says US Report

     



  • May 26, 2025 11:49 IST

    అమెరికాలో మరోసారి కాల్పులు.. 11 మందికి పైగా..?

    అమెరికా సౌత్ కరోలినా ప్రాంతంలో దుండగులు మరోసారి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరో 11 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వరుస కాల్పుల ఘటనలతో అమెరికాలో ప్రజల భయాందోళనలు చెందుతున్నారు.

    SOUTH CAROLINA
    SOUTH CAROLINA

     



  • May 26, 2025 11:48 IST

    జీతాలకు కూడా డబ్బుల్లేవ్.. చేతులెత్తేసిన యూనస్.. సంచలన ప్రకటన!

    బంగ్లాదేశ్‌ పరిస్థితులు దిగజారిపోయాయి. ముహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. కనీసం అక్కడ జీతాలు చెల్లించడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి నెలకొంది. ఎన్నికలు కూడా వాయిదా పడ్డాయి.

    Potests against  muhammad yunus interim govt in Bangladesh
    Potests against muhammad yunus interim govt in Bangladesh

     



  • May 26, 2025 11:48 IST

    మేడ్చల్‌లో విషాదం.. కరెంట్ వైర్ ప్రమాదంలో యువతి మృతి, మరో వ్యక్తి ఆత్మహత్య

    మేడ్చల్ జిల్లా నాగారంలోని బొడ్రాయి సెంటర్ వద్ద స్కూటీపై వెళ్తున్న సురేష్ అనే వ్యక్తి కుటుంబంపై విద్యుత్ తీగ ఆకస్మాత్తుగా తెగి మీద పడింది. ఈ ప్రమాదంలో సురేష్‌కు, అతని కుమారుడికి స్వల్ప గాయాలు కాగా.. మౌనికకు తీవ్రమైన కరెంట్ షాక్ తగిలి మృతి చెందింది.

    electric wire
    electric wire

     



  • May 26, 2025 11:47 IST

    సంగారెడ్డి జిల్లాలో దారుణం.. డబ్బులు కోసం మహిళను సీసాతో పొడిచి ఆపై..?

    సంగారెడ్డి జిల్లాలో రాణెమ్మ(48) అనే ఒంటరి మహిళను దుండగులు డబ్బు కోసం దారుణంగా చంపేశారు. ఆమె ఇంట్లోకి చొరబడి బంగారం, నగదు తీసుకుని ఆపై ఆమెను సీసాతో పొడిచి దారుణంగా హత్య చేశారు. వెంటనే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

    Read More

     



  • May 26, 2025 11:46 IST

    మధ్యప్రదేశ్‌లో దారుణం.. గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం

    మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఖండవాలో ఓ మహిళపై నరరూప రాక్షసులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. క్రూరంగా హింసించి ప్రాణాలు తీశారు. తీవ్రంగా హింసించిన దృష్ట్యా ఆమె గర్భాశయం వెలుపలికి వచ్చిందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    Read More



  • May 26, 2025 11:45 IST

    సరస్వతి పుష్కరాలు చివరిరోజు.. కొనసాగుతున్న భక్తుల రద్దీ

    కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి పుష్కరాలు సోమవారంతో ముగియనున్నాయి. ఈరోజు చివరిరోజు కావడంతో భక్తుల రద్దీ నెలకొంది. పవిత్ర త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ముకేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు.

    last day of saraswati pushkaram, Crowd Continuing in Kaleshwaram
    last day of saraswati pushkaram, Crowd Continuing in Kaleshwaram

     

     



  • May 26, 2025 11:44 IST

    ఉక్రెయిన్‌పై రష్యా వైమానిక దాడి.. 12 మంది మృతి

    ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో మొత్తం 12 మంది మృతి చెందారు. ఉక్రెయిన్‌పై 69 క్షిపణులు, 298 డ్రోన్లతో మొత్తం 37 ప్రదేశాల్లో దాడులు చేసినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.

    Russia-Ukraine war
    Russia-Ukraine war

     



  • May 26, 2025 11:44 IST

    ఆపరేషన్ సిందూర్ తర్వాత టర్కీ-పాక్‌ భేటీ.. థాంక్స్‌ చెప్పిన షెహబాజ్ షరీఫ్

    టర్కీ అధ్యక్షుడు ఎర్గోగాన్‌తో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ ఇస్తాంబుల్‌లో ఆదివారం రాత్రి సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించి ద్వైపాక్షిక ఒప్పందాలపై సమీక్ష జరిపామని పాక్‌ ప్రధాని తెలిపారు.

    Pakistan PM Sharif meets Turkey President, thanks 'brother' for 'resolute support' during India-Pak tensions
    Pakistan PM Sharif meets Turkey President, thanks 'brother' for 'resolute support' during India-Pak tensions

     



  • May 26, 2025 09:18 IST

    సోషల్ మీడియా ప్రేమ కథ.. చివరికి ఏమైందంటే..?

    విశాఖపట్నానికి చెందిన పద్మ అనే వివాహితకు, శ్రీకాళహస్తికి చెందిన సురేశ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం ప్రేమగా మారింది. సురేశ్‌ని పెళ్లి చేసుకొని నివసించసాగింది. కొన్ని రోజుల తర్వాత చిన్న విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగి రెండు ప్రాణాల్ని తీసుకుంది.

    srikalahasti crime news
    srikalahasti crime news

     



  • May 26, 2025 08:17 IST

    హైదరాబాద్ తో పాటు ఆ 7 ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర

    బాంబు పేలుళ్ల కుట్రకు సంబంధించిన కేసులో పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటికి వచ్చాయి. నిందితులు సిరాజ్, సమీర్‌ ఢిల్లీ, హైదరాబాద్‌, ముంబై, చెన్నై, విజయనగరంతో పాటు ఏడు చోట్ల బాంబులు పెట్టాలని ప్లాన్ వేసినట్లు విచారణలో తేలింది.

    Conspiracy for blasts in Hyderabad and other 7 areas, Know Details
    Conspiracy for blasts in Hyderabad and other 7 areas, Know Details

     



  • May 26, 2025 08:16 IST

    రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయి.. పిల్లల ముందే ప్రాణాలు కోల్పోయిన తల్లి!

    హైదరాబాద్‌ సమీపంలోని ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్‌లో విషాదం చోటు చేసుకుంది. పిల్లలను బోగీలోకి ఎక్కించాక తాను ఎక్కే ప్రయత్నంలో శ్వేత అనే మహిళ కాలుజారి బోగీ, ప్లాట్‌ఫామ్‌ మధ్యలో ఇరుక్కుపోయింది. అక్కడే తీవ్రంగా గాయపడి మృతి చెందింది.

    railway-station
    railway-station

     



  • May 26, 2025 07:54 IST

    నీ అక్రమ సంబంధం సీక్రెట్ నీ భార్యకు చెబుతా.. ఇంజనీర్‌ను బ్లాక్ మెయిల్ చేసిన AI

    ఆంథ్రోపిక్ అనే సంస్థ కృత్రిమ మేధ ఆధారంగా క్లాడ్ ఒపస్ 4 ఏఐ అసిస్టెంట్‌ను అభివృద్ధి చేసింది. భవిష్యత్తులో డెవలప్ చేస్తానని ఇంజనీర్ అనడంతో పసిగట్టిన ఏఐ బ్లాక్ మెయిల్ చేసింది. నన్ను అప్డేట్ చేస్తే నీ అక్రమ సంబంధం గురించి అందరికీ చెబుతానని వార్నింగ్ ఇచ్చింది.

    AI black mail developer
    AI black mail developer

     

     



  • May 26, 2025 07:52 IST

    తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. నాలుగు రోజుల పాటు భీభత్సమైన వర్షాలు

    తెలుగు రాష్ట్రాలకు మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈ క్రమంలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలుపుతోంది. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని ప్రజలను సూచించారు.

     TG Weather
    Rain Alert In Telugu States

     



Advertisment
Advertisment
తాజా కథనాలు