PBKS vs MI: దంచికొట్టిన ముంబై.. కింగ్స్ ముందు భారీ టార్గెట్

పంజాబ్ కింగ్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ ముందు 185 టార్గెట్ ఉంది. 

New Update
PBKS vs MI, IPL 2025

PBKS vs MI, IPL 2025 Photograph: (PBKS vs MI, IPL 2025)

PBKS vs MI: ఐపీఎల్ 2025(IPL 2025)లో భాగంగా ఇవాళ పంజాబ్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగుతోంది. జైపుర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తొలి బ్యాటింగ్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ ముందు 185 టార్గెట్ ఉంది. ఓపెనర్లు రికెల్‌టన్ (27), రోహిత్ శర్మ (24) పర్వాలేదనిపించారు. 

ఇది కూడా చూడండి: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే (VIDEO)

దంచికొట్టిన సూర్యకుమార్

సూర్యకుమార్ యాదవ్ 39 బంతుల్లో 57 పరుగులు సాధించాడు. అందులో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. అతడు అర్ధ శతకంతో అలరించాడు. హార్దిక్ పాండ్య (26), నమన్ ధీర్ (20), విల్ జాక్స్ (17) పరుగులు చేశారు. తిలక్ వర్మ (1) నిరాశపర్చాడు. పంజాబ్ బౌలర్లలో మార్కో యాన్సెన్ 2 వికెట్లు, అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు, విజయ్‌కుమార్ వైశాఖ్‌ 2 వికెట్లు, హర్‌ప్రీత్ బ్రార్ ఒక వికెట్ పడగొట్టారు. 

ఇది కూడా చూడండి: సంచలన అప్‌డేట్‌.. పుతిన్‌ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్‌ బాంబు దాడి !

ఇప్పటికే ఈ రెండు జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. టాప్‌-2లో స్థానం దక్కించుకోవడమే లక్ష్యంగా ఈ రెండు జట్లు బరిలో దిగాయి. ప్రస్తుతం పంజాబ్‌ 13 మ్యాచ్‌ల్లో 17 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ముంబయి 13 మ్యాచ్‌ల్లో 16 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీం టాప్‌-2లో స్థానం దక్కించుకుంటుంది. ఒకవేళ ముంబై జట్టు ఓటమిపాలైతే నాలుగో స్థానంలోనే ఉండిపోయి ఎలిమినేటర్ మ్యాచ్‌ ఆడనుంది. 

ఇది కూడా చూడండి: బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు

PBKS vs MI | latest-telugu-news | telugu-news 

Advertisment
Advertisment
తాజా కథనాలు