/rtv/media/media_files/2025/05/26/c5hK7iihZZHOdUeu8ahe.jpg)
Pakistan PM Sharif meets Turkey President, thanks 'brother' for 'resolute support' during India-Pak tensions
ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాక్లోని ఉగ్రశిబిరాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో టర్కీ భారత్ దాడులను ఖండించింద. దీంతో ఆ దేశంపై భారత ప్రజలు తీవ్రంగా విమర్శలు చేశారు. ఆ దేశ ఉత్పత్తులు నిషేధించాలని, బాయ్కాట్ తుర్కియే అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టర్కీ అధ్యక్షుడు ఎర్గోగాన్తో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమావేశమయ్యారు.
Also Read: నీ అక్రమ సంబంధం సీక్రెట్ నీ భార్యకు చెబుతా.. ఇంజనీర్ను బ్లాక్ మెయిల్ చేసిన AI!
Pakistan PM Sharif Meets Turkey President
ఇస్తాంబుల్లో ఆదివారం రాత్రి వీళ్లిద్దరి మధ్య సమావేశం జరిగింది. ఈ విషయాన్ని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎక్స్లో వెల్లడించారు. '' నా ప్రియమైన సోదరుడు ఎర్డోగాన్తో గౌరవప్రదంగా సమావేశం జరిగింది. భారత్తో ఉద్రిక్త పరిస్థితులు వచ్చినప్పుడు మాకు అండగా ఉన్నందుకు వారికి కృతజ్ఞతలు. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించి ద్వైపాక్షిక ఒప్పందాలపై సమీక్ష జరిపాం. పాక్-తుర్కియే స్నేహబంధం సుధీర్ఘ కాలం పాటు కొనసాగాలంటూ'' పోస్టులో రాసుకొచ్చారు.
Also Read: హైదరాబాద్ తో పాటు ఆ 7 ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర
మరోవైపు దీనిపై ఎర్డోగాన్ సైతం స్పందించారు. ఇరుదేశాల మధ్య బలమైన స్నేహబంధం ఉందని తెలిపారు. రాజకీయ, వాణిజ్యం రంగాల్లో చారిత్రక బంధాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్-టర్కీ భేటీ కావడం ఇదే మొదటిసారి. అయితే భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. ఈ భేటీ ప్రధాన్యం సంతరించుకుంది.
Also read: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్లోనే (VIDEO)
Also Read: బంగ్లాదేశ్ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు
rtv-news | telugu-news | international news in telugu | today-news-in-telugu | latest-telugu-news