🔴India Pakistan War Live Updates: మళ్లీ యుద్ధం.. జమ్మూ సరిహద్దుల్లో పాక్ కాల్పులు : లైవ్

భారత్, పాక్‌లు శనివారం యుద్ధం ముగించేందుకు ఒప్పందం చేసుకున్న కొద్ది గంటల్లోనే, పాక్ సైన్యం నియంత్రణ రేఖ వద్ద కాల్పులు ప్రారంభించింది. శ్రీనగర్‌లో పేలుళ్లు, కార్గిల్, బారాముల్లా, పంజాబ్‌ తదితర ప్రాంతాల్లో బ్లాక్‌అవుట్‌ జరిగింది.

By Manoj Varma & Lok Prakash
New Update
India Pakistan War Live Updates

India Pakistan War Live Updates

🔴India Pakistan War Live Updates:

BIG BREAKING : కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్.. జమ్మూలో మళ్లీ కాల్పులు(VIDEO)

కాల్పుల విరమణకు అంగీకరించిన పాకిస్తాన్ కొన్ని గంటల్లోనే తన వక్రబుద్దిని చూపించింది. సీజ్ ఫైర్ అంటూనే జమ్మూలోని పలన్వాలా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి పాకిస్తాన్ శనివారం కాల్పులకు పాల్పడింది. అఖ్నూర్, రాజౌరి, ఆర్‌ఎస్ పురా సెక్టార్లలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైన్యం ఫిరంగి దాడులకు పాల్పడింది. జమ్మూ నుండి పంజాబ్, రాజస్థాన్ వరకు అనేక నగరాలపై డ్రోన్ , క్షిపణి దాడులు జరిగాయి. బారాముల్లాలో పేలుళ్లు సంభవించాయని, ఒక డ్రోన్‌ను కూల్చివేసినట్లు, ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఒక వైమానిక వాహనం (UAV) కనిపించినట్లు నివేదికలు వచ్చాయి. అటు భారత బీఎస్ ఎఫ్ జవాన్లు కూడా ధీటుగానే బదులిస్తున్నాయి.  

ఇది కూడా చూడండి: IND PAK WAR 2025: జైసల్మేర్‌లో 70కి పైగా డ్రోన్లు, క్షిపణులు గాల్లోనే ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ!

పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా(Jammu and Kashmir Chief Minister Omar Abdullah) శనివారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "కాల్పు విరమణ సంగతేంటి? శ్రీనగర్ అంతటా పేలుళ్లు వినిపించాయి!!!" అని ఆయన తన ట్వీ్ట్ లో తెలిపారు.  శ్రీనగర్‌లో ఐదు చోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అంతేకాకుండా ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడింది. 

Also Read: ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. మ్యాచ్ రద్దు

అంతకుముందు, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాతో  మాట్లాడుతూ  భారత్చ, పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయని తెలిపారు.  పాకిస్తాన్ డీజీఎంఓ ఫోన్‌లో ఇండియన్ ఆర్మీతో ఫోన్ లో   సంప్రదించారని, సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలు చేయడానికి రెండు దేశాలు అంగీకరించాయని ఆయన వెల్లడించారు.  

Also Read:  మీ ఇళ్లను పేల్చేస్తాం.. పాకిస్తాన్ నుంచి తిరుపతికి ఫోన్ కాల్స్ కలకలం!

Also Read: మదర్స్ డే స్పెషల్.. అమ్మ కోసం ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్

  • May 11, 2025 21:34 IST

    రాజస్తాన్‌ పై పాక్ డ్రోన్ దాడులు.. మోగిన సైరన్లు- LIVE VIDEO

    రాజస్తాన్‌ లోని బారాముల్లాలోనూ పాక్ డ్రోన్ కనిపించగా.. భారత సైన్యం దానిని ఆకాశంలోనే కూల్చివేసింది. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించారు. స్థానికులు ఎవరూ కూడా ఇంట్లో నుంచి బయటకు రాకూడదని ఆదేశాలు జారీ చేశారు.

    V BREAKING



  • May 11, 2025 21:17 IST

    పాకిస్తాన్‌కు ఇండియన్ నేవీ పవర్‌ఫుల్‌ వార్నింగ్

    --- పహల్గామ్‌ దాడి జరిగిన తర్వాత వెంటనే రంగంలోకి దిగాం
    --- డిఫెన్స్‌ ఫొర్సెస్‌తో కలిసి జాయింట్‌ ఆపరేషన్‌కు సిద్ధమయ్యాం
    --- 96 గంటల్లోనే ఆరేబియన్ సముద్రంలో అన్ని రకాల టెస్టులు చేశాం
    --- కరాచీ పోర్టును టార్గెట్ చేసేందుకు కూడా సిద్ధమే 
    --- పాకిస్తాన్ నేవీ డిఫెన్సివ్‌ మోడ్‌లో ఉంది 
    --- పాకిస్తాన్ నేవీ కదలికలపై నిఘా పెట్టాం



  • May 11, 2025 20:59 IST

    మరోసారి పాకిస్తాన్ కవ్వింపు చర్యలు

    --- జమ్ము కశ్మీర్‌ LOC, IB వెంట కాల్పులు
    --- దీటుగా బదులిస్తున్న భారత బలగాలు
    --- బారాముల్లాలోనూ కాల్పులు
    --- ముందు జాగ్రత్తగా పంజాబ్‌లోని పలు జిల్లాల్లో బ్లాకవుట్‌
    --- ఫజిల్కా, బర్నాలా జిల్లాల్లో బ్లాకవుట్‌ కొనసాగింపు



  • May 11, 2025 20:57 IST

    మారని పాకిస్తాన్ మళ్లీ కాల్పులు

    75fa859f-bc83-44ff-896d-d59ad1bde4d6
    75fa859f-bc83-44ff-896d-d59ad1bde4d6

     



  • May 11, 2025 20:42 IST

    Pakistan Colony: ఏపీలో పాకిస్తాన్ కాలనీ పేరు మార్పు.. కొత్త పేరు ఏంటంటే?

    ఏపీలోని విజయవాడలో ఉన్న పాకిస్తాన్ కాలనీ పేరు మారింది. ఆ కాలనీ పేరువల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతుండటంతో అధికారులు స్పందించారు. ఆ కాలనీకి కొత్తపేరు పెట్టారు. భగీరథ కాలనీగా కొత్త పేరును నామకరణం చేశారు. ఆధార్‌లో స్థానికుల అడ్రస్ కూడా మార్చారు.

    andhra pradesh vijayawada pakistan colony name changed



  • May 11, 2025 20:37 IST

    కరాచీ బేకరీపై దాడిని ఖండించిన మంత్రి సీతక్క

    కరాచీ బేకరీ ఈ దేశ బిడ్డలది-మంత్రి సీతక్క
    ప్రధాని, కేంద్ర హోంమంత్రి సొంత రాష్ట్రమైన..
    గుజరాత్ సహా అనేక ప్రాంతాల్లో కరాచీ బేకరీలు ఉన్నాయి
    కరాచీ బేకరీలపై దాడి హేయమైన చర్య-సీతక్క
    ప్రజల మధ్య విభజన తీసుకొచ్చే..
    ఇలాంటి చిల్లర పనులు బీజేపీ మానుకోవాలి-సీతక్క



  • May 11, 2025 20:12 IST

    Karachi Bakery: పేరు మారుస్తారా? బోర్డు తీస్తారా?.. హైదరాబాద్‌లో క‌రాచీ బేక‌రి ధ్వంసం

    భారతదేశంపై పాకిస్తాన్ దాడులకు నిరసనగా ఇవాళ తెలంగాణలో బీజేపీ కార్తకర్తలు శంషాబాద్‌లోని కరాచీ బేకరీ ముందు నిరసన చేపట్టారు. పాకిస్తాన్‌కు, కరాచీ బేకరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరాచీ బేకరీ బోర్డును ధ్వంసం చేశారు. అందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.

    Hyderabad Shamshabad Karachi Bakery destroy by Bjp Workers

     



  • May 11, 2025 20:09 IST

    ఈ రాత్రికి ఒక్క డ్రోన్ వచ్చినా.. రేపటికి పాక్ ఉండదు.. భారత్ సీరియస్ వార్నింగ్!

    పాకిస్తాన్ కాల్పుల విరమణను మరోసారి ఉల్లంఘిస్తే, తాము మరింత గట్టి సమాధానం ఇస్తామని డిజిఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్‌ ఘాయ్‌ హెచ్చరించారు. పాకిస్తాన్ ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే వెంటనే, బలమైన సమాధానం ఇవ్వాలని ఆర్మీ చీఫ్, కమాండర్లకు సూచించినట్లుగా తెలిపారు.

    pak-drone



  • May 11, 2025 20:08 IST

    పాక్‌ దాడి చేస్తే మేము కూడా చేస్తాం.. అమెరికాకు తేల్చిచెప్పిన మోదీ

    ప్రధాని మోదీ.. అమెరికా ఉపాధ్యాక్షుడు జేడీ వాన్స్‌తో మాట్లాడారు. పాకిస్థాన్‌ దాడులు చేస్తే.. భారత్‌ కూడా తీవ్రంగా స్పందిస్తుందని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌ కాల్పులు జరపకపోతే తాము సంయమనం పాటిస్తామని చెప్పారు.

    PM Modi
    PM Modi

     



  • May 11, 2025 20:08 IST

    భారత్, పాక్ సీజ్‌ఫైర్‌.. ఒక్క పోస్టుతో చిక్కుల్లో సల్మాన్ ఖాన్.. వెంటనే డిలీట్

    బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణపై ఆయన ఎక్స్‌లో చేసిన పోస్టు వివాదానికి దారితీసింది. ఆపరేషన్ సిందూర్ గురించి ఎందుకు స్పందించలేదని.. ఇప్పుడెందుకు రియాక్ట్ అవుతున్నారని కామెంట్లు పెడుతున్నారు.



  • May 11, 2025 20:07 IST

    Indian Army: 100 మందికి పైగా ఉగ్రవాదులను లేపేశాం.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన

    ఆపరేషన్ సిందూర్‌ గురించి త్రివిధ దళాల అధిపతులు మీడియాతో మాట్లాడారు. 9 ఉగ్రస్థావరాలను నేలమట్టం చేశామన్నారు. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారని తెలిపారు. ఉగ్రవాదుల అంతానికి ఆపరేషన్ సిందూర్ చేపట్టామన్నారు.

    Indian Army
    Indian Army

     



  • May 11, 2025 19:55 IST

    హైదరాబాద్‌ - శంషాబాద్‌లో కరాచీ బేకరీ మీద దాడి చేసిన బీజేపీ నేతలు



  • May 11, 2025 19:53 IST

    మా లక్ష్యాలన్నింటినీ అందుకున్నాం.. పైలట్స్‌ అందరూ తిరిగివచ్చారు..

    భారత్‌ పైలట్‌ను పట్టుకున్నామన్న పాక్‌ ప్రచారం నిజంకాదు.. పాక్‌ను నమ్మలేం.. కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే ఏమవుతుందో వాళ్లకు తెలుసు-DGMO రాజీవ్‌ ఘాయ్‌



  • May 11, 2025 18:55 IST

    ఉగ్రవాద శిబిరాలపై దాడిని వీడియో తీసి విడుదల

    9 ఉగ్రవాద శిబిరాల్లో వంద మందికిపైగా ఉగ్రవాదులు చనిపోయారు.. పాకిస్తాన్‌ మాత్రం సామాన్యులు, ప్రార్థనా స్థలాలు, స్కూళ్లను టార్గెట్‌ చేసింది-డీజీఎంవో రాజీవ్ ఘాయ్‌



  • May 11, 2025 18:45 IST

    బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ కీలక ప్రకటన

    👉 పాక్‌పై దాడి చేస్తున్న భారత్‌కు మద్దతిస్తున్నట్లు ప్రకటన 

    👉 పాక్‌ను ఉగ్రదేశంగా గుర్తించాలి

    👉 పాక్‌పై భారత్‌ నిర్ణయాత్మక చర్య తీసుకుంటే పశ్చిమ సరిహద్దు నుంచి పాక్‌పై దాడి చేస్తాం

    👉 భారత్‌కు సైనిక శక్తిగా నిలుస్తాం



  • May 11, 2025 18:43 IST

    BLA : పాకిస్తాన్ను లేపేస్తాం.. ఇండియాకు మా మద్దతు.. BLA సంచలన ప్రకటన!

    పాకిస్తాన్ సైన్యంతో యుద్ధం చేస్తున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ సంచలన ప్రకటన చేసింది. భారత్ కు మద్దతు ప్రకటించింది. భారత్ పాకిస్తాన్ పై దాడి చేయాలని BLA ఒక లేఖ జారీ చేసింది. రేపు పాకిస్తాన్ తో భారత్ చర్చల నేపథ్యంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ  ప్రకటన కీలకంగా మారింది.

    V BREAKING



  • May 11, 2025 18:25 IST

    ''ఆ విషయాలు చెప్పాల్సిందే''.. ప్రధానికి రాహుల్ గాంధీ సంచలన లేఖ..

    విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రధాని మోదీకి సంచలన చేశారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌, కాల్పుల విరమణ ప్రకటనలపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

    Rahul gandhi and PM Modi
    Rahul gandhi and PM Modi

     



  • May 11, 2025 17:56 IST

    అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోడీ

    పాకిస్తాన్‌ దాడి చేస్తే.. ప్రతిచర్య గట్టిగా ఉంటుందని చెప్పిన మోడీ.. ఉగ్రవాదాన్ని అంతం చేసే విషయంలో కఠినంగా ఉంటాం.. మా సంయమనం బలహీనత కాదు-ప్రధాని మోడీ



  • May 11, 2025 17:44 IST

    త్రివిధ దళాలకు ప్రధాని మోదీ కీలక ఆదేశాలు

    పాక్‌ నుంచి కాల్పులు జరిపితే భారత్ కూడా జరుపుతుంది
    పాక్‌ దాడులు జరిపితే..భారత్ కూడా దాడులకు దిగుతుంది
    ఆపరేషన్‌ సింధూర్‌ ముగియలేదు-మోదీ
    అటు నుంచి తుపాకీ గుళ్లు వస్తే..
    ఇటు నుంచి మిస్సైల్స్ ప్రయోగించాలి-మోదీ
    ఆపరేషన్ సింధూర్‌తో ప్రపంచానికి కొత్త సందేశం ఇచ్చాం
    ప్రతి రౌండ్‌లో పాకిస్తాన్‌ మరింత దిగజారింది-మోదీ
    ఉగ్రశిబిరాలను కాదు..హెడ్‌క్వార్టర్లను ధ్వంసం చేశాం
    బహవల్పూర్‌, మురిద్కే, ముజఫరాబాద్‌లో..
    ఉగ్రక్యాంప్‌లను మట్టిలో కలిపేశాం-ప్రధాని మోదీ
    ప్రతి రౌండ్‌లో పాకిస్తాన్ భారత్ చేతిలో ఓడిపోయింది
    వైమానిక దాడుల తర్వాత పాక్‌ చేతులెత్తేసింది-మోదీ
    సింధూ ఒప్పందాన్ని సీమాంతర ఉగ్రవాదంతో ముడిపెట్టాం
    ఉగ్రవాదం ఆగేవరకు ఒప్పందం నిలుపుదలలోనే ఉంటుంది-మోదీ



  • May 11, 2025 17:28 IST

    సైన్యంలో చేరి నా తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటా : జవాన్ కూతురు

    పాకిస్థాన్ చేసిన డ్రోన్ దాడిలో రాజస్థాన్ కు చెందిన సార్జెంట్ సురేంద్ర మోగా వీరమరణం పొందిన సంగతి తెలిసిందే.  ఈ సందర్భంగా ఆయన కూతురు వర్తిక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

    solider daughter
    solider daughter

     



  • May 11, 2025 16:59 IST

    పహల్గామ్ ఉగ్రదాడి నుంచి కాల్పుల విరమణ వరకు ఈ 10 వీడియోలే ముఖ్యం

    గత 20 రోజులుగా ఇండియాలో శరవేగం పరిణామాలు మారిపోతున్నాయి. ఏప్పిల్ 22న పహాల్గామ్ ఉగ్రదాడితో మొదలైన విపత్కర పరిస్థితి ఇండో పాక్ యుద్ధ అంచుకు తీసుకొచ్చింది. ఏది ఏమైనా తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్‌‌కు ఈసారి గట్టి కౌంటర్‌ ఇవ్వాలని భారత్ ఫిక్స్ అయ్యింది.

    India Pakistan War 2025
    India Pakistan War 2025

     



  • May 11, 2025 16:42 IST

    IND-CHINA WAR: భారత్ చేతిలో చైనా సీక్రెట్స్.. భలే దొరికిపోయిందిగా?

    భారత్‌లో పాక్ వినియోగించిన పీఎల్‌ 15 దీర్ఘశ్రేణి క్షిపణి చెక్కుచెదరకుండా దొరికింది. ఇప్పుడు ఆ క్షిపణిని విడిగొట్టి.. అందులో వాడిన సాంకేతిక గుట్టును భారత్‌ తెలుసుకోనుంది. దీనివల్ల మరింత మెరుగైన క్షిపణులు తయారుచేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు.

    PL 15 Missile
    PL 15 Missile

     



  • May 11, 2025 15:36 IST

    పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకున్నాం: రాజ్‌నాథ్‌ సింగ్

    కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ కీలక ప్రకటన చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామన్నారు. ఆపరేషన్ సింధూర్‌ ద్వారా ఉగ్రవాదులకు గట్టి జవాబిచ్చామని పేర్కొన్నారు. బ్రహ్మోస్‌ క్షిపణితో శత్రువుకు మన శక్తి ఏంటో తెలియజేశామన్నారు.

    Rajanth Singh
    Rajanth Singh

     



  • May 11, 2025 14:47 IST

    మీడియా ముందు బయటపడ్డ దొంగ పాక్.. పుల్వామా అటాక్‌ కూడా మేమే

    పుల్వామా ఆత్మహుతి దాడి వెనుక పాకిస్తాన్ ఆర్మీ హస్తం ఉందని అంగీకరించింది. పాక్ ఎయిర్ మార్షల్ ఔరంగాజేబ్ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పుల్వామా దాడిలో భారత్‌ను వ్యూహాత్మకంగా దెబ్బకొట్టామని ఔరంగాజేబ్‌ చెప్పారు.

    pak army officer



  • May 11, 2025 14:47 IST

    రేపే భారత్‌-పాక్‌ చర్చలు.. కాల్పుల విరమణ కొనసాగుతుందా ?

    సోమవారం భారత్‌-పాకిస్థాన్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. హాట్‌లైన్‌లో జరగబోయే ఈ చర్చలకు ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్‌(DGMO)లు పాల్గొననున్నారు. కాల్పుల విరమణ కొనసాగింపు గురించి చర్చలు జరపనున్నారు.

    India-Pakistan talks
    India Pakistan

     



  • May 11, 2025 14:06 IST

    ఆ కలలో బతకొద్దు.. భారత్-పాక్ యుద్ధంపై యాంకర్ రష్మీ సంచలన కామెంట్స్!

    యాంకర్ రష్మీ గౌతమ్ భారత్-పాకిస్తాన్ యుద్ధంపై హాట్ కామెంట్స్ చేశారు. మనం శాంతి అనే కలల్లోనే బ్రతుకుతున్నట్లు ఉన్నామని.. అదే మనకు ఈ రోజు ఈ పరిస్థితి తీసుకొచ్చిందన్నారు. భారత్ మాతాకీ జై అనడానికి సిద్ధంగా లేని వారి నాలుకను కోసేయండని రష్మీ ట్వీట్ చేశారు.

    Rashmi Gautham
    Rashmi Gautham

     



  • May 11, 2025 13:29 IST

    కాల్పుల విరమణను స్వాగతించిన యునైటెడ్ కింగ్‌డమ్‌ విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ



  • May 11, 2025 13:15 IST

    కాల్పుల విరమణలో వీళ్లే కీలకం.. ఇరు దేశాల DGMO గురించి మీకు తెలుసా?

    ఇండియా పాకిస్తాన్ రెండు దేశాల డీజీఎంఓలు కాల్పుల విరమణపై అంటే యుద్ధాన్ని ఆపుతున్నట్లు ఓ ఒప్పందానికి చేరుకున్నారు. దీంతో శనివారం నుంచి రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది.

    Army



  • May 11, 2025 13:07 IST

    BIG BREAKING: ఆపరేషన్ సిందూర్ ను ఆపలేదు.. ఎయిర్ ఫోర్స్ సంచలన ప్రకటన!

    యుద్ధంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంచలన ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ ఆపలేదని ఇండియన్ ఫోన్స్ ఎక్స్ లో తెలిపింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందని పేర్కొంది. త్రివిధ దళాలతో ప్రధాని మోదీ భేటీ అనంతరం.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంచలన ప్రకటన చేసింది.

    Operation Sindoor
    Operation Sindoor

     



  • May 11, 2025 12:47 IST

    ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది.. ఎయిర్ఫోర్స్ సంచలన ట్వీట్!



  • May 11, 2025 11:55 IST

    IND-PAK WAR: యుద్ధంపై మోదీ సంచలన నిర్ణయం.. ప్రధాని ప్లాన్-B ఇదే?

    భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణ తర్వాత ఆదివారం ప్రధాని మోదీ త్రివిధ దళాధిపతులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి నేషనల్ సెక్యురిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సీడీఎస్ అనిల్ చౌహాన్ హాజరైయ్యారు.

    modi plan B



  • May 11, 2025 11:46 IST

    అమృత్ సర్ లో సాధారణ స్థితికి చేరిన పరిస్థితులు



  • May 11, 2025 11:20 IST

    India Pak War : ఇండియా, పాకిస్తాన్ యుద్ధం ఆగిపోవడానికి కారణం ఇదే..!

    పాకిస్తాన్‌కు లోన్ ఇవ్వాలంటే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాలని IMF నింబందన పెట్టినట్లు సమాచారం. భారత్‌తో యుద్ధానికి దిగొద్దన్న షరతుపై పాకిస్తాన్‌కి రూ.8500 కోట్ల రుణం మంజూరు చేసినట్లు తెలుస్తోంది. IMF పాకిస్తాన్‌కు శుక్రవారం లోన్ ఇచ్చింది.

    IMF loan
    IMF loan

     



  • May 11, 2025 11:18 IST

    IND-PAK WAR: భారత్-పాక్ యుద్ధంపై ట్రంప్ మరో సంచలన పోస్ట్!

    భారత్-పాక్ కాల్పుల విరమణ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన పోస్ట్ చేశారు. ఇరు దేశాల మధ్య యుద్ధం ఆపామని, ఒకవేళ యుద్ధం జరిగితే అమాయక ప్రజలు చనిపోయేవారని తెలిపారు. ఇకపై ఇరు దేశాలతో కలిసి పనిచేస్తానని వెల్లడించారు.

    Trump Post
    Trump Post

     



  • May 11, 2025 10:38 IST

    India Pakistan War: యుద్ధంపై NSA అజిత్ దోవల్ సంచలన ప్రకటన!

    చైనా విదేశాంగ శాఖమంత్రి NSA అజిత్ దోవల్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఇరు దేశాలు మాట్లాడుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. అయితే యుద్ధం భారతదేశం ఎంపిక కాదని అజిత్ దోవల్ అన్నారు. ఉగ్రవాదంపై తాము ఉక్కుపాదం మోపామని చెప్పారు.

    NSA Ajit Doval with China'



  • May 11, 2025 10:10 IST

    బగ్లిహార్ డ్యాం గేట్లను ఓపెన్ చేసిన భారత్



  • May 11, 2025 10:07 IST

    కశ్మీర్ సమస్య పరిష్కారానికి భారత్, పాక్ తో కలిసి పని చేస్తా-ట్రంప్



  • May 11, 2025 10:02 IST

    IND-PAK WAR: పాక్‌కే మా మద్దతు.. చైనా చిల్లర వ్యాఖ్యలు

    ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపుతూ చైనా పాక్‌పై ప్రేమను చాటుకుంది. తమకు మిత్ర దేశమైన పాకిస్థాన్​‌కు ఎప్పుడూ అండంగా ఉంటామని చైనా హామీ ఇచ్చినట్లు సమాచారం. భారత్-పాక్ యుద్ధ నేపథ్యంలో పాక్ విదేశాంగ మంత్రితో చైనా విదేశాంగ మంత్రి ఫోన్‌లో ఇలా మాట్లాడారట.

    china supports to the pak
    china supports to the pak

     



  • May 11, 2025 09:59 IST

    మురళీనాయక్ కు కాంగ్రెస్‌ సీనియర్ నేత రఘువీరారెడ్డి నివాళి



  • May 11, 2025 09:32 IST

    IND-PAK WAR: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. కాల్పుల విరమణ తర్వాత ఏం జరిగిందంటే?

    భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన వెంటనే సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పాక్ మళ్లీ కాల్పులు చేపట్టింది. దీంతో జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లో బ్లాక్‌అవుట్ విధించారు. ప్రస్తుతం పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయి.

    india pakistan war updates
    india pakistan war updates

     



  • May 11, 2025 09:28 IST

    ఉదంపూర్ లో సాధారణ స్థితికి చేరుకుంటున్న పరిస్థితులు



  • May 11, 2025 09:27 IST

    11 గంటలకు భారత ప్రభుత్వ ప్రెస్ మీట్



  • May 11, 2025 08:52 IST

    Operation Sindoor: నేడు వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు..కదిలిన మంత్రులు

    ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధం లో తెలుగు జవాన్‌ మురళీనాయక్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఆయన మృతదేహన్ని శనివారం రాత్రి ఆయన స్వగ్రామం కళ్లితండాకు తరలించారు. ఈ రోజు అధికారిక, సైనిక లాంఛనాలతో మరుళీనాయక్‌ అంత్యక్రియలు జరగనున్నాయి.

    Indian Army Soldier Murali Nayak Last Journey🔴LIVE : మురళీ నాయక్ అంతిమ యాత్ర | India VS Pak War |RTV



  • May 11, 2025 07:50 IST

    IND-PAK WAR : పాక్‌ ఉగ్రవాదులను శిక్షించి తీరాల్సిందే : ఒవైసీ సంచలన ట్వీట్‌

    భారతదేశం, పాకిస్థాన్‌ యుద్ధ విరమణ ఒప్పందంపై ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన ట్వీట్‌ చేశారు. ఎక్స్ వేదికగా అనేక అంశాలను లేవనెత్తారు. కాల్పుల విరమణ ఉన్నా.. లేకున్నా పహల్గాంలో టూరిస్టులను చంపిన ఉగ్రవాదులను శిక్షించి తీరాల్సిందేనన్నారు.

    Asaduddin Owaisi
    Asaduddin Owaisi

     



  • May 11, 2025 06:57 IST

    India Pakistan War Live Updates



  • May 11, 2025 06:57 IST

    India Pakistan War Live Updates



  • May 11, 2025 06:51 IST

    India On Ceasefire: ఒప్పందాన్ని ఉల్లంఘించడం దారుణం..భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ

    కాల్పుల విరమణకు అంగీకరించినట్లు భారత్, పాకిస్తాన్ విదేశాంగ శాఖలు ప్రకటించాయి. కానీ ఈ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘిస్తోంది. ఇది అత్యంత దారుణమైన విషయమని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్సి మండిపడ్డారు. భారత్ దీనికి ధీటుగా జవాబిస్తుందని అన్నారు.

    ind
    Foreign Secretary Vikram Misri

     



  • May 11, 2025 06:51 IST

    BIG BREAKING: భారత్ సైనిక స్థావరంపై ఉగ్రదాడి..ఖండించిన రక్షణ శాఖ

    కాల్పులు విరమణ జరిగింది కానీ...ఉగ్రవాదుల దాడులు మాత్రం ఆగలేదు. భారత్ లో తాజాగా మరో ఉగ్రదాడి జరిగింది. జమ్మూలోని నాగ్రోట దగ్గర సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేశారు.. ఇద్దరు టెర్రరిస్టులను చంపారనివార్తలు వచ్చాయి. అయితే దీనిని రక్షణ శాఖ ఖండించింది.

    BREAKING NEWS
    breaking news

     



  • May 11, 2025 06:50 IST

    Indian Army: కాల్పుల విరమణకు ఒకే.. కానీ.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన

    భారత్‌-పాక్ కాల్పుల విరమణకు అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే కాల్పుల విరమణకు తాము కట్టుబడి ఉన్నామని.. కానీ భారత సైన్యం ఎల్లప్పుడూ కూడా అప్రమత్తంగా ఉంటుందని భారత ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.

    Indian Army
    Indian Army

     



  • May 11, 2025 06:49 IST

    BIG BREAKING : కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్.. జమ్మూలో మళ్లీ కాల్పులు(VIDEO)

    కాల్పుల విరమణకు అంగీకరించిన పాకిస్తాన్ కొన్ని గంటల్లోనే తన బుద్ది చూపించింది. సీజ్ ఫైర్ అంటూనే జమ్మూలోని పలన్వాలా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి పాకిస్తాన్ శనివారం కాల్పులకు పాల్పడినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

    pak again fire
    pak again fire

     



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు