/rtv/media/media_files/2025/05/08/wzjwtX1IsFU4ev23vNb3.jpg)
PSL match cancelled
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాక్ మధ్య మరింత ఉద్రిక్తతపరిస్థితులు నెలకొన్నాయి. పాక్లో ఇవాళ జరగాల్సిన PSL మ్యాచ్ రద్దైంది. రావల్పిండి స్టేడియంలో నేడు మ్యాచ్ జరగాల్సింది. కానీ దానిసమీపంలో పేలుడు సంభవించడంతో పెషావర్జల్మీ, కరాచీకింగ్స్ మధ్య మ్యాచ్ రద్దైంది.
ఏం జరిగింది?
భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇవాళ పాక్లోని రావల్పిండి క్రికెట్ స్టేడియం సమీపంలో డ్రోన్ అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. స్టేడియానికి సమీపంలోనే దాడి జరిగినట్లు ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ స్టేడియంలో ఇవాళ (మే8) రాత్రి 8గంటలకు పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో భాగంగా పెషావర్ జల్మి vs కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.
🚨 An Indian drone crashed near the food street adjacent to #Rawalpindi Cricket Stadium after colliding with a tree. The crash caused a fire at the site. On one hand, we are attacking India through social media; on the other hand, all of this is being watched . What's going on? pic.twitter.com/tKs10Nikd1
— Islamabadies (@Islamabadies) May 8, 2025
క్రికెట్ స్టేడియం సమీపంలో డ్రోన్ దాడి
ఈ మ్యాచ్కు కొన్ని గంటల ముందు ఈ సంఘటన జరిగడం సంచలనంగా మారింది. ఈ దాడి తర్వాత PSL సూపర్లీగ్ కరాచీకి మార్చే అవకాశం ఉందని అనేక నివేదికలు పేర్కొన్నాయి. దీంతో భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. ఈ సంఘటన సమీపంలోని ఒక రెస్టారెంట్ భారీ స్థాయిలో ద్వంసం అయింది. ఈ దాడిలో ఇద్దరు పౌరులు కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ డ్రోన్ గురించి దర్యాప్తు ప్రారంభించారు. కాగా లాహోర్, కరాచీలలో వేర్వేరుగా పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తోంది.
నివేదిక ప్రకారం.. ఈ ప్రమాదంలో స్టేడియం సమీపంలోని రెస్టారెంట్ భవనం పాక్షికంగా ద్వంసం అయింది. స్థానిక పాకిస్తాన్ నివేదికల ప్రకారం.. అధికారులు ఆ ప్రాంతాన్ని సీజ్ చేసి, డ్రోన్ ఎక్కడ నుండి వచ్చిందో దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన ఇద్దరు పౌరులను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
PSL 2025 | latest-telugu-news | telugu-news