భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల విరమణ ఒప్పంద విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర పోషించారు. కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని ట్రంప్ సోషల్ మీడియాలో ట్వీట్ చేయడంతో.. భారత్ స్పందించింది. యుద్ధాన్ని భారత్ కోరుకోవడం లేదని, కాల్పుల విరమణకు అంగీకరించినట్లు తెలిపింది. అయితే ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో మరో సంచలన పోస్ట్ చేశారు. భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని ఆపడంలో తాను ముఖ్య పాత్ర పోషించినట్లు చెప్పుకుంటున్నారు.
ఇది కూడా చూడండి: Miss World 2025: మిస్ వరల్డ్ వేదికపై.. తెలంగాణ సాంప్రదాయ నృత్యాలు.. ఫొటోలు ఇక్కడ చూడండి
US President Donald Trump posts, "I am very proud of the strong and unwaveringly powerful leadership of India and Pakistan... I am proud that the USA was able to help you arrive at this historic and heroic decision. While not even discussed, I am going to increase trade… pic.twitter.com/SSHkoYcChD
— ANI (@ANI) May 11, 2025
ఇది కూడా చూడండి: Indian Army: కాల్పుల విరమణకు ఒకే.. కానీ.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన
ఇరు దేశాలతో కలిసి పనిచేస్తామని..
ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగితే.. విధ్వంసం జరిగేదాని, లక్షలాది మంది అమాయక ప్రజలు మరణించేవారని ట్రంప్ తెలిపారు. యుద్ధం ఆపాలనే భారత్, పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయానికి గర్వపడుతున్నానని తెలిపారు. వెయ్యేళ్లుగా ఉన్న కశ్మీర్ సమస్య పరిష్కారానికి రెండు దేశాలతో కలిసి పనిచేస్తానని తెలిపారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పాక్ ఉల్లంఘనకు పాల్పడింది.
ఇది కూడా చూడండి: BIG BREAKING: తిరగబడ్డ ఆర్మీ చీఫ్.. పాక్ లో కుప్పకూలిన ప్రభుత్వం?
సరిహద్దు రాష్ట్రాల్లో పాక్ డ్రోన్లతో దాడికి పాల్పడింది. ఈ దాడులను భారత సైన్యం తిప్పికొట్టింది. అయితే ఈ దాడులపై డొనాల్డ్ ట్రంప్ అసలు స్పందించకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. పాక్ ట్రంప్ మాటలకు కనీసం గౌరవం ఇవ్వకుండా పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘించిందని అంటున్నారు. పాక్ భారత్తో కాళ్ల బేరానికి వచ్చింది. కానీ విజయం తమదే అని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. దీంతో ఆ దేశంలో సంబరాలు మొదలయ్యాయి. పాక్ జాతీయ జెండాలను పట్టుకుంటూ.. వాహనాలపై ర్యాలీలు నిర్వహించారు.