వైసీపీపై జనసేన వార్, జగనన్న కాలనీలపై సోషల్ మీడియా క్యాంపైన్

ఏపీలో వైసీపీ, జనసేన పార్టీల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. సీఎం జగన్‌ పాలనపై తరుచూ విమర్శలు చేసే సేనాని పవన్ కల్యాణ్ తాజాగా భారీ వర్షాల నేపథ్యంలో జనసైనికులకు డిజిటల్ క్యాంపెయిన్‌కు పిలుపునిచ్చారు. జగనన్న కాలనీల ప్రస్తుత పరిస్థితిపై ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలని సూచించారు.

New Update
వైసీపీపై జనసేన వార్, జగనన్న కాలనీలపై సోషల్ మీడియా క్యాంపైన్

జగనన్న కాలనీల దుస్థితిపై క్యాంపెయిన్..

ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతల విమర్శలతో పొలిటికల్‌ హీట్ పెరుగుతోంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం జగన్‌ పాలనపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ పాలన వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి బలంగా తీసుకుపోతున్నారు. తాజాగా రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీల పరిస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్‌కు పవన్ శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జగనన్న కాలనీలను సందర్శించి, అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులపై ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేయాలని సూచించారు. ఈ పోస్టులో FailureofJaganannacolony అనే హ్యాష్ ట్యాగ్ ఉండాలని తెలిపారు.

పోస్టులతో జనసైనికుల రచ్చ..

దీంతో రంగంలోకి దిగిన జనసైనికులు జగనన్న కాలనీలను సందర్శిస్తున్నారు. గుంటూరు జిల్లా తాటికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామంలో ప్రస్తుతం జగనన్న కాలనీ దుస్థితి అంటూ కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. ఈ పోస్టులో గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ను టార్గెట్ చేశారు. అలాగే ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం జగనన్న కాలనీ దుస్థితిని వీడియో తీసి పోస్ట్ చేశారు జనసైనికులు. టెక్కలి నియోజకవర్గం, శ్రీకాళహస్తి నియోజకవర్గం, మదనపల్లి నియోజకవర్గం వంటి ప్రాంతాల్లోని జగనన్న కాలనీలను సందర్శించి అక్కడి పరిస్థితిని పోస్ట్ చేస్తున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా క్యాంపెయిన్ చేపట్టి పోస్టుల మీద పోస్టులు చేస్తున్నారు. మరి సోషల్ మీడియాలో శనివారం జనసైనికులు ఎంత రచ్చచేస్తారో వేచి చూడాలి.

పోస్టులు చేసే వారికి సూచనలు..

పోస్టులు చేసే వారికి సూచనలను కూడా జనసేన అందజేసింది. కనీసం ఒక నిమిషం నిడివి కలిగిన వీడియో తీయాలని అక్కడి పరిస్థితులు కళ్లకు కట్టేలా ఫోటోలు ఉండాలని తెలిపింది. సోషల్ మీడియా పోస్టులో కచ్చితంగా FailureofJaganannacolony హ్యాష్ ట్యాగ్ ఉండాలని వెల్లడించింది. మీ వివరాలతో పాటు సోషల్ మీడియా లింక్స్, నాలుగు ఫోటోలు, నిమిషం వీడియోను పార్టీ కేంద్ర కార్యాలయానికి కూడా పంపించాలని సూచించింది. వివరాల్లో పేరు, పార్టీ పదవి, నియోజకవర్గం, మండలం, గ్రామం వివరాలు ఉండాలని పేర్కొంది. అలాగే 6304900820 లేదా 6304900819 నెంబర్లకు వాట్సాప్ కూడా చేయవచ్చని చెప్పింది. మొత్తానికి వైసీపీ ప్రభుత్వ పాలనను పవన్ కల్యాణ్ అన్ని మార్గాల ద్వారా టార్గెట్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live Breakings: క్యాన్సర్ తో పోరాడుతూ ప్రముఖ నటుడు కన్నుమూత!

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

IPL Final: వర్షం పడితే ఫైనల్ మ్యాచ్ ఎలా.. IPL విన్నర్ ను ఎలా డిసైడ్ చేస్తారంటే!?

ఐపీఎల్ సీజన్ 18 తుది ఘట్టానికి చేరుకుంది. ఈరోజే ఫైనల్ మ్యాచ్. బెంగళూరు, పంజాబ్ కు మధ్య అహ్మదాబాద్ లో ఈరోజు సమరం జరగనుంది. అయితే ఈరోజు కూడా వర్షం పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే కనుక అయితే విన్నర్ ను ఎలా డిసైడ్ చేస్తారు..

ipl
RCB VS PBKS

 

ఐపీఎల్ 2025 సీజన్ లో ఈరోజే తుది సమరం. కప్ ఎవరు గెలుచుకుంటారో ఈ రోజు రాత్రి తేలిపోతోంది. గత నెలన్నరగా పది జట్లు వరుసపెట్టి మ్యాచ్ లు ఆడుతున్నారు. చివరకు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, పంజాబ్ కింగ్స్ ఫైనల్ కు వచ్చాయి. ఇప్పటి వరకు ఆర్సీబీ మూడు సార్లు ఫైనల్ కు వచ్చింది. పంజాబ్ మాత్రం ఒక్కసారే వచ్చింది. కానీ రెండు జట్లూ కప్ ను మాత్రం గెలవలేకపోయాయి. అందుకే ఈసారి ఎవరు టైటిల్ విన్నర్ గా నిలిచినా..ఐపీఎల్ కు మరో కొత్త ఛాంపియన్స్ అవుతారు. 

Also Read :  రాజన్నగోశాలలో కోడెల మృత్యుఘోష

Also Read :  యువతి ప్రైవేట్ పార్ట్స్‌పై స్క్రూ డ్రైవర్‌తో పొడిచి దారుణ హత్య

వాతావరణం..

ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లో జరగనుంది. అయితే ఇక్కడ ఈరోజు వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి.   క్వాలిఫయర్ 2 మ్యాచ్ కూడా ఇదే స్టేడియంలో జరిగింది. ఆ మ్యాచ్ కు కూడా వర్షం అంతరాయం కలిగించింది. దాంతో మ్యాచ్ లేట్ గా స్టార్ట్ అయింది. ఇదే తరహాలో ఈరోజు కూడా వర్షం పడితే పంజాబ్ కే అనుకూలం అని చెబుతున్నారు. అహ్మదాబాద్ లో 37 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని.. ఆకాశం మేఘావృతమయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అహ్మదాబాద్ వాతావరణ శాఖ చెబుతోంది. అసలు ఈ ఫైనల్ మ్యాచ్ కోలకత్తాలో జరగాల్సి ఉంది. కానీ అక్కడ వర్షాలు ఉన్నాయని చెప్పడంతోనే అహ్మదాబాద్ కు మార్చారు. 

ఈరోజు రాత్రి అహ్మదాబాద్ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ప్రారంభం అవనుంది. వర్షం పెద్దగా పడకపోతే లేట్ గా అయినా మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ చాలా పెద్ది అయితే మ్యాచ్ ను మరుసటి రోజుకు మారుస్తారు. ఫైనల్ మ్యాచ్ కు ఎప్పుడూ రిజర్వ్ డే ఉంటుంది. ఒకవేళ రిజర్వ్ డే నాడు కూడా వర్షం పడి...అసలు మ్యాచ్ నిర్వహించడానికి అవకపోతే..కనీసం 5 ఓవర్ల మ్యాచ్ అయినా నిర్వహిస్తారు. అది కూడా అవలేదు అంటే రన్ రేట్ ఆధారంగా పంజాబ్ ను విజేతగా డిక్లేర్ చేస్తారు. లీగ్ దశలో పంజాబ్ టాప్ ప్లేస్ లో ఉంది కాబట్టి ఆ టీమ్ కప్ ను గెలుస్తుంది. 

Also Read: HHVM Trailer: పవన్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మ.. ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ వచ్చేస్తుంది!

Also Read :  ట్రంప్‌కు షాక్ ఇచ్చిన మోదీ.. అమెరికాపైనే ఇండియా సుంకాలు!!

Live Breakings

  • Jun 03, 2025 12:52 IST

    క్యాన్సర్ తో పోరాడుతూ ప్రముఖ నటుడు కన్నుమూత!

    ప్రముఖ టీవీ నటుడు విభూ రాఘవే స్టేజ్ 4 కాలన్ క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశారు. తన నివాసమైన ముంబైలో జూన్ 2న తుదిశ్వాస విడిచారు. విభూ ‘నిషా ఔర్ ఉస్కే కజిన్స్’ అనే సీరియల్‌తో ఎంతో గుర్తింపు పొందారు. ఆయన అకాల మరణం అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది.

    Television actor Vibhu Raghave passed away
    Television actor Vibhu Raghave passed away

     



  • Jun 03, 2025 11:53 IST

    ప్రజల వద్దకే భూ పరిపాలన.. నేటి నుంచి రెవెన్యూ సదస్సులు

    తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు గాను నేటి నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. అలాగే కొత్తగా తీసుకొచ్చిన భూ భారతిపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఈ సందర్భంగా  భూభారతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.  

    bhubharathi



  • Jun 03, 2025 10:55 IST

    నష్టాల్లో ఊగిసలాడుతున్న దేశీ మార్కెట్లు

    అన్నీ బాగానే ఉన్నాయి. అంతర్జాతీయమార్కెట్లు కూడా రాణిస్తున్నాయి. కానీ దేశీ మార్కెట్లు మాత్రం నష్టల్లోకి జారుకున్నాయి. ప్రారంభమైనప్పుడు లాభాల్లోనే ఉన్నా వాణిజ్య ఆందోళనల కారణంగా ఒడిదుడుకుల్లో తేలియాడుతున్నాయి. 

    business
    Stock Market On Monday

     



  • Jun 03, 2025 10:24 IST

    Pijush Hazarika Tweet



  • Jun 03, 2025 10:07 IST

    తాగుడుకు బానిసైన తండ్రిని కారుతో గుద్ది గుద్ది..

    తాగుడుకు బానిసైన తండ్రి ప్రతిరోజు ఇంట్లోవారితో గొడవపడుతుండంటంతో ఆ కొడుకు తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. ఎలాగైన తన తండ్రిని చంపేయాలనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం కారుతో ఢీకొట్టి చంపేశాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుకున్నది ఘటన.

    murder
    murder

     



  • Jun 03, 2025 10:06 IST

    Happy World Bicycle Day : ఇది తెలిస్తే.. ఈరోజే వెళ్లి సైకిల్ కొంటారు!

    బాల్యంలో సైకిల్‌ తొక్కిన సందర్భాలు మనకి మదుర జ్ఞాపకాలు. సైకిల్ తొక్కడంతో శరీరానికి సెక్స్‌ర్‌సైజ్‌తోపాటు పెట్రోల్ డబ్బు కూడా ఆదా. కాళ్లు, పిక్క కండరాలు, ఎముకలు, శ్వాసక్రియకు సైక్లింగ్ మంచి వ్యాయామం. ప్రతి సంవత్సరం జూన్ 3న వరల్డ్ సైకిల్ డేగా జరుపుకుంటారు.

    World Bicycle Day



  • Jun 03, 2025 09:35 IST

    హఫీజ్ సయీద్ కొడుకుతో ఫెహబాజ్ షరీఫ్ సహాయకుడు.. ఉగ్రవాదుల విషయంలో మరో సాక్ష్యం

    పాకిస్తాన్ కు టెర్రరిజానికి ఉన్న సంబంధాలు మళ్ళీ మళ్ళీ బయటపడుతున్నాయి. తాజాగా మరో సారి ఈ విషయం బహిర్గతమైంది. పాకిస్తాన్ లోని పంజాబ్ స్పీకర్ మాలిక్ అహ్మద్ ఖాన్ లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి, లష్కరే తోయిబా చీఫ్ కుమారుడుతో వేదికను పంచుకున్నారు.

    pak
    Punjab Speaker Malik

     



  • Jun 03, 2025 09:34 IST

    59 కేజీల బంగారం చోరి.. బ్యాంకుకు బొక్కెట్టిన దొంగలు

    కర్నాటకలో మంగోలి కెనరా బ్యాంక్ బ్రాంచ్‌లో 59Kgల బంగారం చోరి అయ్యింది. మే 26న ప్యూన్ బ్యాంక్ దగ్గరకు వచ్చి చూడగా.. షట్టర్ తాళాలు కత్తిరించి ఉన్నాయి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగారం తాకట్టు పెట్టి గోల్డ్ లోన్స్ తీసుకున్న వారి బంగారం చోరికి గురైంది.

    Read More



  • Jun 03, 2025 09:33 IST

    పాకిస్తాన్‌కు పెద్ద దెబ్బ.. కరాచీ జైలు నుంచి 200 మంది ఖైదీలు పరార్



  • Jun 03, 2025 09:33 IST

    IPL FINAL: ఐపీఎల్ కు కొత్త విజేత..ఎవరి కల తీరనుంది?

    పది టీమ్ లు...అలుపెరుగని మ్యాచ్ లు. చివరకు రెండు జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. ఈరోజు తుది పోరుకు సిద్ధమయ్యాయి బెంగళూరు, పంజాబ్ జట్లు. వీటిల్లో ఇప్పటి వరకు ఒక్క జట్టు కూడా కప్ గెలవలేదు. కాబట్టి ఏ టీమ్ గెలిచినా ఐపీఎల్ కు కొత్త ఛాంపియన్ యాడ్ అయినట్లే. 

    ipl
    PBKS VS RCB

     



  • Jun 03, 2025 07:58 IST

    వర్షం పడితే ఫైనల్ మ్యాచ్ ఎలా.. IPL విన్నర్ ను ఎలా డిసైడ్ చేస్తారంటే!?

    ఐపీఎల్ సీజన్ 18 తుది ఘట్టానికి చేరుకుంది. ఈరోజే ఫైనల్ మ్యాచ్. బెంగళూరు, పంజాబ్ కు మధ్య అహ్మదాబాద్ లో ఈరోజు సమరం జరగనుంది. అయితే ఈరోజు కూడా వర్షం పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే కనుక అయితే విన్నర్ ను ఎలా డిసైడ్ చేస్తారు..

    ipl
    RCB VS PBKS

     



  • Jun 03, 2025 07:57 IST

    రాజన్నగోశాలలో కోడెల మృత్యుఘోష

    వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం గోశాలలో  కోడెల మృత్యు ఘోష ఆగడం లేదు. తిప్పాపూర్‌ గోశాలలో సోమవారం మరో 3 కోడెలు మృతిచెందాయి. దీంతో ఇప్పటివరకు మృతిచెందిన కోడెల సంఖ్య 20కి చేరింది. వాటిని గుట్టుచప్పుడు కాకుండా మూలవాగులో గోశాల సిబ్బంది ఖననం చేశారు.

    vemulawada



  • Jun 03, 2025 07:56 IST

    యువతి ప్రైవేట్ పార్ట్స్‌పై స్క్రూ డ్రైవర్‌తో పొడిచి దారుణ హత్య

    సైరా అనే యువతి ప్రైవేట్ పార్ట్స్‌పై స్క్రూడ్రైవర్‌తో పొడిచి రఫీ హత్య చేశాడు. 18సార్లు పొడిచి చిత్రహింసలకు గురిచేసి చంపాడు. సైరా ఫోన్‌లో ఫోన్ కాల్ డేటాతో నిందితుడి పట్టుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ మొరాదాబాద్‌లో కొట్వాలి మైనథర్‌ గ్రామంలో ఘటన వెలుగుచూసింది.

    man murder with screwdriver



  • Jun 03, 2025 07:56 IST

    గచ్చిబౌలిలో నడిరోడ్డుపై కాలిబూడిదైన కారు

    హైదరాబాద్ గచ్చిబౌలిలో రన్నింగ్ కారులో మంటలు చెరరేగాయి. సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయం ముందు కారు పూర్తిగా దగ్దమైంది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. మంటల్లో పూర్తిగా కాలి బూడిదైంది. 

    Read More



Advertisment
Advertisment