/rtv/media/media_files/2025/06/03/W5SspUpC27X7BHT6cdiJ.jpg)
బ్యాంకులో బంగారం చోరి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్నాటకలోని కెనరా బ్యాంక్ మంగోలి బ్రాంచ్లో దొంగలు బీభత్సం సృష్టించారు. దొంగలు 59కిలోల బంగారం ఎత్తుకెళ్లారని సీనియర్ పోలీసు అధికారి సోమవారం తెలిపారు. అదంతా బ్యాంక్లో గోల్డ్ లోన్ తీసుకున్న వారు తాకట్టు పెట్టిన బంగారం. మే 23 సాయంత్రం సిబ్బంది బ్యాంకుకు తాళం వేశారు. మే 24, 25 లు హలీడేస్ కావడంతో బ్యాంక్ తెరవలేదు. మే 26న ప్యూన్ శుభ్రం చేయడానికి వెళ్లినప్పుడు షట్టర్ తాళాలు కత్తిరించబడి ఉండటం గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
Also Read : ప్రజల వద్దకే భూ పరిపాలన.. నేటి నుంచి రెవెన్యూ సదస్సులు
Gold Theft From Bank
Thieves Sneak Into Bank, Steal 59 Kg Gold In Karnataka
— Mohan K (🇺🇸 🇮🇳) (@mohan_author) June 3, 2025
Is it even safe to keep gold in lockers? What’s the middle class going to do with all the gold? @venkat_fin9 @ggganeshh @GabbbarSingh https://t.co/kbZGqxCT1S
Also Read : Crime news: వదిన తల నరికి.. చేతిలో పట్టుకొని పోలీస్ స్టేషన్కు వెళ్లిన వ్యక్తి
మే 26న కెనరా బ్యాంక్ మంగోలి బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదు చేశారు. మొత్తం 59 కిలోల బంగారం చోరికి గురైనట్లు పోలీసులు తేల్చారు. మే 24, 25 తేదీల మధ్య రాత్రి ఈ దొంగతనం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. తాకట్టు పెట్టి గోల్డ్ లోన్ తీసుకున్న వారిదే ఆ బంగారం అంతా అని ఎస్పీ నింబార్గి మీడియాకు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కోసం 8 టీంలను పెట్టి నిందితుల కోసం వెతుకుతున్నారు.
Also Read : ఇండియాకు చైనా వార్నింగ్.. ‘పాక్ లాగే మీకూ నీళ్లు ఉండవు’
Also Read : తాగుడుకు బానిసైన తండ్రిని కారుతో గుద్ది గుద్ది..
thieves | canara-bank | karnataka | gold-theft | gold lones | latest-telugu-news | telugu crime news
Gold theft from bank