/rtv/media/media_files/2025/06/03/skGL5OrQocrvg80rdDvu.jpg)
అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. పంజాబ్ తో జరుగుతోన్న ఈ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. విరాట్ కోహ్లీ తన తొలి బౌండరీ సాధించిన వెంటనే, ఐపీఎల్లో అత్యధిక ఫోర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ధావన్ను అధిగమించాడు. టోర్నీలో 770 ఫోర్లు బాదాడు కోహ్లీ. ధావన్ 221 ఇన్నింగ్స్లలో ఈ ఘనతను సాధించగా, కోహ్లీ తన 258వ ఇన్నింగ్స్లలో ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్లో 663 ఫోర్లతో డేవిడ్ వార్నర్ మూడవ స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ 86 పరుగులు చేయగలిగితే, ఐపీఎల్ సీజన్లో మూడుసార్లు 700 పరుగులు చేసిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా నిలిచే అవకాశం ఉంది. కోహ్లీ గతంలో ఐపీఎల్ 2016లో 973 పరుగులు, ఐపీఎల్ 2024లో 741 పరుగులు చేశాడు. అదే సమయంలో గేల్ 2012, 13 సీజన్లలో వరుసగా 700+ పరుగులు చేశాడు.
In the IPL 2025 final, Virat Kohli broke Shikhar Dhawan’s record for most fours in IPL history with 769 boundaries. Kohli has scored 614 runs this season and could become the first to score 700+ runs thrice in IPL.
— The Daily Jagran (@TheDailyJagran) June 3, 2025
Know More: https://t.co/M8OtVhhY3W#IPL2025 #ViratKohli… pic.twitter.com/r52mzgxWGH